‘నాడి’పట్టే చెయ్యి’గాడి’తప్పుతోంది-డబ్బు కోసం వైద్యులు గడ్డి

సహనం వందే, హైదరాబాద్: ______________________________________________________________________________________________________________________ ఇలా అనేకమంది వైద్యులు డబ్బు కోసం గడ్డి తింటున్నారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఇప్పటికే లక్షల్లో సంపాదిస్తున్నారు. లక్షల రూపాయలు జీతాలు అందుతున్నా… ప్రైవేటు ప్రాక్టీస్ ఉన్నా కొందరు ఇంకా కోట్ల సంపాదనకు కుయుక్తులు చేస్తున్నారు. అందుకోసం అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా పేట్ల బుర్జు ఆసుపత్రి సూపరింటెండెంట్ గా గతంలో పనిచేసిన డాక్టర్ రజనీరెడ్డి ఎన్ఎంసీ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఆమె ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఒక ప్రైవేట్ మెడికల్…

Read More

తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వివ(క)క్ష

సహనం వందే, హైదరాబాద్:ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అవమాన భారం మోస్తున్నారు. జీతం తక్కువ… ఛీత్కారాలు ఎక్కువ. నిబద్ధతతో సేవ చేస్తున్నప్పటికీ అవమానంతో మనుగడ సాగిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా… కనీసం విచారణ, నోటీసు లేకుండా ఒక సాధారణ ఫోన్ కాల్ ద్వారా తొలగిస్తున్నారు. వేతనంతో కూడిన సెలవు లేదు. వీరి కోసం ఉద్దేశించిన ప్రభుత్వ నిధుల్లో 25-30% ఏజెన్సీలు తినేస్తున్నాయి. తెలంగాణలో రెండు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సరైన వేతనాలు లేక అర్ధాకలితో జీవితాలను నెట్టుకొస్తున్నారు….

Read More

49,000 కోట్ల భారీ స్కామ్‌ – పెరల్ ఆగ్రో టెక్ మోసం

సహనం వందే, లక్నో: దేశంలో అత్యంత పెద్ద కుంభకోణాల్లో ఇదొకటి.‌ పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఏసీఎల్‌) సంస్థ ఏకంగా రూ. 49 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడటంతో దేశం యావత్తూ నిర్ఘాంత పోయింది. మధ్యతరగతి ప్రజలను, అనేకమంది చిన్నచిన్న పెట్టుబడిదారులను మోసం చేయడంతో ఆయా వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజల నుంచి, చిన్నచిన్న పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో శుక్రవారం…

Read More

విద్యార్థుల శారీరక ఫిట్‌నెస్‌ కోసం ‘యాక్టివ్ సీఐఎస్‌సీఈ ’

సహనం వందే, హైదరాబాద్:విద్యార్థుల శారీరక ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్‌సీఈ) ‘యాక్టివ్ సీఐఎస్‌సీఈ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈనెల 15వ తేదీ నుంచి అమలయ్యే ఈ కార్యక్రమంలో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు ప్రత్యేక ఫిట్‌నెస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఐసీఎస్‌ఈ (10వ తరగతి), ఐఎస్‌సీ (12వ తరగతి) పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తప్పనిసరి అని సీఐఎస్‌సీఈ రీజనల్ స్పోర్ట్స్…

Read More

ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగుల పోరుబాట -12వ తేదీన మహాధర్నా

సహనం వందే, హైదరాబాద్:తమ సమస్యల పరిష్కారం కోసం ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులు గళం విప్పుతున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సకాలంలో వేతనాలు ఇవ్వాలని, ఏజెన్సీలు కాకుండా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పోరాట బాట పట్టారు. ఈ మేరకు శనివారం (12వ తేదీన) హైదరాబాదులోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల నుంచి వందలాదిమంది ఈ ధర్నాకు…

Read More

సీబీఐ వలలో డాక్టర్ రజినీరెడ్డి – మాజీ సూపరింటెండెంట్ పై కేసు

సహనం వందే, హైదరాబాద్:నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనలను ఉల్లంఘించి పలు వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేయడంలో జరిగిన భారీ అవినీతి కుంభకోణంలో మరో కీలక పేరు వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని మోడరన్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, పేట్లబుర్జ్ మాజీ సూపరింటెండెంట్ రజినీరెడ్డి ఈ ఆరోపణల జాబితాలో చేర్చారు. తనిఖీ బృందంలో పాత్ర…ఎన్‌ఎంసీ తనిఖీ బృందంలో మాజీ సూపరింటెండెంట్ సభ్యులుగా ఉన్నారు. గత నెల 30న…

Read More

గేమింగ్… మనీ వింగ్ – సాంప్రదాయ కెరీర్‌లకు గేమింగ్ సవాల్

సహనం వందే, హైదరాబాద్:యూట్యూబ్ వాక్‌త్రూలు, మల్టీప్లేయర్ గేమ్‌లతో పెరిగిన ప్రస్తుత తరానికి గేమింగ్ ఇకపై కేవలం ఒక అలవాటు లేదా వినోదం మాత్రమే కాదు. ఇది ఒక లాభదాయకమైన కెరీర్‌గా, గణనీయమైన ఆదాయ వనరుగా రూపాంతరం చెందుతోంది. గేమింగ్ రంగం సాంప్రదాయ ఉద్యోగాల భావనను సవాల్ చేస్తూ యువతకు సరికొత్త అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తోంది. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ పట్ల దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తోంది. కొత్త తరం కలల వృత్తిగా ఆవిష్కరణ…గతంలో గేమింగ్‌ను కేవలం సమయం…

Read More

ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై కఠినం – మంత్రివర్గం కీలక నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్:ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి నియమించిన అధికారుల కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించింది. రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఆ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై కఠినంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలన్నీ రాష్ట్ర అభివృద్ధికి, పారదర్శక పాలనకు దోహదపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ మేరకు బుధవారం జరిగిన…

Read More

తెలంగాణలో ప్రైవేటు మెడికల్ కాలేజీల అనుమతికి 500 కోట్లు?

సహనం వందే, హైదరాబాద్:ప్రైవేటు మెడికల్ కాలేజీల మాఫియా వైద్య విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. డబ్బా కాలేజీలు పెట్టి విద్యార్థుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ వందల కోట్లకు పడగలెత్తుతున్నాయి. వాటిని పర్యవేక్షించాల్సిన జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) లంచాలకు మరిగి ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వటం సంచలనంగా మారింది. వైద్య విద్యా వ్యవస్థను కుదిపేసిన భారీ అవినీతి కుంభకోణం బయటపడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), వైద్య…

Read More

ఆయిల్ ఫెడ్ తిరుమలేశునికి దెబ్బ మీద దెబ్బ

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ మేనేజర్ తిరుమలేశ్వర్ రెడ్డి పెత్తనానికి కత్తెరలు పడుతున్నాయి. ఆయన అధికారాలను ఒక్కొక్కటి తగ్గించే కార్యక్రమానికి ఆ సంస్థ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. నాలుగు విభాగాలను తన చేతుల్లో ఉంచుకొని ఆడించిన నాటకానికి తెరపడుతుంది. ‘నేను ఏం చేస్తే అదే చెల్లుబాటు’ అన్న ఆయన ధోరణికి చెక్ పడుతుంది. మొన్నటి వరకు ఫైనాన్స్, మార్కెటింగ్, బల్క్ మార్కెటింగ్, ఓపీఎస్ ఫ్యాక్టరీ… ఈ నాలుగింటినీ తన చేతిలో ఉంచుకున్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా వీటిపై…

Read More