ఎమ్మెల్యే చేతిలో బీసీ భవితవ్యం – నియోజకవర్గం యూనిట్ గా రిజర్వేషన్లు

సహనం వందే, హైదరాబాద్:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆశలు అడియాశలు అవుతున్నాయి. అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మోక్షం లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ధర్నా నిర్వహించినప్పటికీ కేంద్రం నుంచి ఏమాత్రం కదిలిక రాలేదు. దీంతో రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాకపోయినప్పటికీ పార్టీ పరంగానే 42% సీట్లను బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. నియోజకవర్గం యూనిట్ గా అమలు…

Read More

నర్సింగ్ ఉద్యోగాల్లో లింగ వివక్ష – పురుష నర్సులకు ప్రమోషన్లు కరువు!

సహనం వందే, హైదరాబాద్:నర్సింగ్ వృత్తిలో మహిళలకు మాత్రమే అవకాశాలు ఉంటాయనే అపోహను దాటి, ఇప్పుడు పురుషులు కూడా ఈ రంగంలో రాణిస్తున్నారు. అయితే తెలంగాణలో పురుష నర్సులకు ప్రమోషన్లలో తీవ్ర వివక్ష ఎదురవుతోంది. సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి సేవలందిస్తున్నప్పటికీ పాత జీవోల కారణంగా వారికి పదోన్నతులు రావడం లేదు. పాత నిబంధనలను సవరించాలని తెలంగాణ నర్సస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఎదురవుతున్న వివక్ష…2005లో పురుష విద్యార్థులకు నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పించేలా జీవో 82ను…

Read More

నిర్మాతల కొర్రీ… కార్మికుల వర్రీ – కొలిక్కిరాని సినిమా కార్మికుల వ్యవహారం

సహనం వందే, హైదరాబాద్:తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల జీతాల పెంపు విషయంలో నెలకొన్న వివాదం సద్దుమణగలేదు. వేతనాల పెంపునకు నిర్మాతలు షరతులతో కూడిన ప్రతిపాదనలు ముందుకు తెచ్చినప్పటికీ, కార్మిక సంఘాల నాయకులు వాటిని తిరస్కరించారు. ఫలితంగా ఈ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఇకపై తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఫెడరేషన్ నేతలు ప్రకటించారు. నిర్మాతల షరతుల్లోని మెలికలు…నిర్మాతలు శనివారం మీడియా సమావేశంలో వేతనాల పెంపుపై తమ నిర్ణయాలను ప్రకటించారు. రోజుకు 2 వేల రూపాయల…

Read More

సేవా మార్గంలో ‘మణి’ కుమార్ – డాక్టర్లకు ఇస్టా డిజిటల్ మీడియా ద్వారా అవార్డులు

సహనం వందే, హైదరాబాద్:సాధారణంగా జీవితంలో డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించిన తర్వాత చాలా మంది సుఖంగా గడపాలనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం తాము నిలదొక్కుకున్న తర్వాత సమాజానికి తమ వంతు ఏదైనా చేయాలని భావిస్తారు. అలాంటి వారిలో ఒకరు ఇస్టా డిజిటల్ మీడియా వ్యవస్థాపకుడు మణి కుమార్. బీటెక్ పూర్తి చేసి, విజయవంతమైన మొబైల్ వ్యాపారంతో మంచి ఆదాయం, పేరు సంపాదించిన మణి… కేవలం డబ్బు సంపాదనకు పరిమితం కాకుండా, వైద్యులకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో…

Read More

నటులకు కోట్లు… కార్మికులకు పాట్లు – టాలీవుడ్ ఇండస్ట్రీలో విచిత్ర పరిస్థితి

సహనం వందే, హైదరాబాద్:టాలీవుడ్ పరిశ్రమలో పెద్ద పెద్ద నటులకు వందల కోట్లు చెల్లించే బడా నిర్మాతలు… సినిమా షూటింగ్ లలో పాల్గొనే కార్మికులకు మాత్రం రోజువారి కూలీ ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు. హీరో హీరోయిన్లకు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చే నిర్మాతలు… కార్మికుల ఆకలి తీర్చడానికి కూడా ముందుకు రావడం లేదు. దీనిపై తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, కోశాధికారి టీవీ…

Read More

టీఆర్ఎస్ (డి) గౌరవ అధ్యక్షురాలిగా ప్రసన్న

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) (టీఆర్ఎస్ (డి)) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని, సమస్యలపై పోరాడే మహిళగా గుర్తింపు పొందిన ప్రసన్నను తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. పరిచయం అవసరం లేని పేరుగా తెలంగాణలో సుపరిచితులైన ప్రసన్న, ఇకపై పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. ఆమె పోరాట స్ఫూర్తి పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Read More

బ‌స్తీతో ‘హైడ్రా’ దోస్తీ – హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఏవీ రంగ‌నాథ్ శ్రీకారం

సహనం వందే, హైద‌రాబాద్‌: కూల‌గొట్టుడు కాదు.. ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన, అంద‌రికీ నివాస యోగ్య‌మైన‌ న‌గ‌ర నిర్మాణ‌మే తమ ల‌క్ష్య‌మ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. హైడ్రా అంటే భ‌యం కాద‌ని… న‌గ‌ర ప్ర‌జ‌లంద‌రికీ ఓ అభ‌యం అని అన్నారు.చెరువులు, నాలాలు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను క‌బ్జా చేసిన వారు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు సూచించారు. 5 ఎక‌రాల భూమిని క‌బ్జా చేసి అందులో ప‌ని వాళ్ల‌కోసం ఒక షెడ్డు వేసి……

Read More

ఎంబీబీఎస్ కు డబ్బా కాలేజీల దెబ్బ – నాలుగేళ్లలో నిండని 11,966 సీట్లు

సహనం వందే, ఢిల్లీ: ఒకప్పుడు ఎంబీబీఎస్ లో సీటు రావడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు అవకాశాలు మరింత పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. కానీ అనేక కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. సీట్ల కోసం విద్యార్థులు ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు… అయినప్పటికీ ఎంబీబీఎస్ సీట్లు మిగిలి పోవడానికి కారణం ఏంటనేది చర్చనీయాంశం అయింది. 2024-25 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,849 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయని కేంద్ర…

Read More

‘సృష్టి’కి సాయం… అమ్మకు ద్రోహం -ఫెర్టిలిటీ సెంటర్లకు వైద్యాధికారుల వత్తాసు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాదులో అనేక ఫెర్టిలిటీ సెంటర్లలో అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు అక్రమంగా ఫెర్టిలిటీ సెంటర్లు నడుపుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. సంతానం లేని దంపతులకు అక్రమ పద్ధతిలో శిశువులను అంటగట్టుతున్నారు. నగరంలో దాదాపు 180 ఫెర్టిలిటీ సెంటర్లు ఉండగా… కొన్ని సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొందరు వైద్యాధికారుల చేయూతతోనే ఈ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకుగాను కొందరు వైద్యాధికారులకు…

Read More

‘మహా’ డైవర్షన్ మెసేజ్- నేడు మహావీర్ మెడికల్ కాలేజీలో తనిఖీలు

సహనం వందే, హైదరాబాద్:మహావీర్ మెడికల్ కాలేజీ యాజమాన్యం తన తప్పులను సరిదిద్దుకోకుండా దిక్కుమాలిన వ్యవహారాలన్నీ చేస్తూ బుక్ అవుతుంది. గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఫ్యాకల్టీ, డాక్టర్లు, ఇతర వాట్సాప్ గ్రూపులలో ఒక మెసేజ్ పెట్టారు. శుక్రవారం హెల్త్ యూనివర్సిటీ అధికారుల తనిఖీ ఉన్నందున ఉదయం ఏడున్నర గంటలకే బోధనాసుపత్రిలో అందుబాటులో ఉండాలని ఆ మెసేజ్ లో స్పష్టం చేశారు. అయితే ఇందులో ఏమైనా మతలబు ఉందా అన్న చర్చ కాలేజీ వర్గాలలో నెలకొంది. గత…

Read More