పదో తరగతిలో ఆవు మెదడు -ఉపాధ్యాయురాలు సస్పెండ్

సహనం వందే, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలు ఆవు మెదడు ను తీసుకొచ్చి తరగతి గదిలో ప్రదర్శించడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో విద్యార్థులు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ఆ ఉపాధ్యాయురాలుని సస్పెండ్ చేశారు. తాండూరు నియోజకవర్గంలోని యలాల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు)లో ఈ ఘటన చోటుచేసుకుంది. సైన్స్ ఉపాధ్యాయురాలు ఖాసీమ్ బీ… 10వ తరగతి విద్యార్థులకు మానవ మెదడు…

Read More

దంతవైద్యులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఝలక్

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, ప్లాస్టిక్ సర్జరీలపై నిషేధం సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలోని దంతవైద్యులకు (డెంటిస్టులకు) తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీఎంసీ) ఒక పెద్ద షాకిచ్చింది. ఇకపై దంతవైద్యులు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, ప్లాస్టిక్ సర్జరీ వంటి కాస్మెటిక్ ప్రొసీజర్‌లు నిర్వహించడానికి అనుమతి లేదని టీఎంసీ స్పష్టం చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) మార్గదర్శకాల ఆధారంగా టీఎంసీ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓరల్, మాక్సిలోఫేషియల్…

Read More

దక్షిణాది రాష్ట్రాలపై నరేంద్ర మోడీ దండయాత్ర

సహనం వందే, హైదరాబాద్:దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన రాజకీయ ఆధిపత్యాన్ని విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో సమగ్ర వ్యూహాలు రచిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దక్షిణ రాష్ట్రాల్లో తమ పట్టు బలోపేతం చేసుకోవడానికి బీజేపీ రాజకీయ కసరత్తులు చేస్తోంది. ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ, డీఎంకే, కాంగ్రెస్, సీపీఎంలను బలహీనపరిచేందుకు బీజేపీ స్థానిక నాయకత్వం, పొత్తులు, సినీ తారలను ఉపయోగించుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు…

Read More

సోషల్ మీడియా నెత్తుటి మడుగులో ‘అమ్మ’ -ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్..

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ నగరం రక్తపు మరకలతో నిండిన ఓ దారుణ నేరానికి సాక్ష్యంగా నిలిచింది. కన్న కూతురే తల్లిని కడతేర్చిన ఘటన తెలుగునాట పెను సంచలనం సృష్టించింది. మానవ సంబంధాల పవిత్రతను ఛిన్నాభిన్నం చేస్తూ, సామాజిక మాధ్యమాలు విషపు కోరలు ఎలా పరుచుకుంటున్నాయో ఈ హత్య స్పష్టం చేసింది. ప్రేమ, అక్రమ సంబంధాలు, డిజిటల్ ప్రపంచపు మాయాజాలం మనుషుల నైతికతను ఎలా కాలరాస్తున్నాయో ఈ ఘోరం కళ్ళ ముందుంచింది. సమాజం ఎటు పయనిస్తోంది? ఈ నీచపు…

Read More

యూరియా కొరత తీర్చండి – కిషన్ రెడ్డికి తుమ్మల లేఖ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో యూరియా లభ్యతపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్రం నుండి రాష్ట్ర వాటాగా రావాల్సిన యూరియాను త్వరగా తెప్పించేలా కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని మంత్రి తుమ్మల ఈ లేఖలో కోరారు. ప్రస్తుత యూరియా లభ్యత వివరాలు, అలాగే కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన యూరియా పరిమాణాన్ని లేఖలో స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల అవసరాల కోసం కేంద్రం నుండి రాష్ట్రానికి…

Read More

పదో తరగతి బాలిక కర్కషత్వం -ప్రియుడి మోజులో పడి తల్లి హత్య

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న బాలిక, ఆమె ప్రియుడు శివ, అతని తమ్ముడు కలిసి తల్లి అంజలిని దారుణంగా హత్య చేసిన ఘటన నగరాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. అయితే ఈ దారుణమైన హత్యకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన మృతురాలి చిన్న కుమార్తె ప్రియ… ఈ వ్యవహారంలో వెలుగులోకి తెచ్చిన నిజాలు యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి….

Read More

హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయంకు జాతీయ అవార్డు

సహనం వందే, న్యూఢిల్లీ:హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్‌పీఓ), తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న 2025 ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారుల సమావేశంలో…హైదరాబాద్ ఆర్‌పీఓ చేపట్టిన వినూత్న చర్యలు, పౌర-కేంద్రీకృత కార్యక్రమాల విభాగంలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు గెలుచుకుంది. పాస్‌పోర్ట్ ధృవీకరణ, సేవా సౌకర్యాలలో తెలంగాణ పోలీసుల నిరంతర ప్రతిభకు కూడా ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. మంగళవారం నాడు పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి…

Read More

ఆంధ్రప్రదేశ్ ను అడ్డుకోండి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒకవేళ కేంద్రం ప్రాజెక్టుకు అనుమతిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతామని తేల్చిచెప్పారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం తెలిపిన అభ్యంతరాల విషయంలో అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు.‌గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం అన్ని రకాలుగా పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే…

Read More

ఆయిల్ ఫెడ్ నర్సరీ కుంభకోణంలో సూత్రధారి ప్రవీణ్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:నాణ్యతలేని ఆయిల్ పామ్ మొక్కలను అంటగట్టి తమ జీవితాలను నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం మొక్కలను పంపిణీ చేయడంలో ఆయిల్ ఫెడ్ అధికారులే దోషులని వారు నిందించారు. జన్యులోపం మొక్కలను పంపిణీ చేశారని ఆరోపించారు. నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదులోని దిల్ కుషా అతిథి గృహంలో విచారణ జరిగింది. కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఆధ్వర్యంలోని బృందం అధికారులను ప్రశ్నించింది….

Read More

ఆధునిక వైద్యంపై విషం – సొంత వైద్యంతో క్యాన్సర్…కూతురి బలి

సహనం వందే, లండన్:ఆమె కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఒక యువతి. క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆమెకు కీమోథెరపీ చేస్తే 80 శాతం తగ్గుతుందని డాక్టర్లు నిర్ధారించారు. కానీ తల్లి ఆధునిక వైద్యాన్ని తిరస్కరించి… అశాస్త్రీయ మొక్కల ఆధారిత థెరపి చేయించి కూతురి ప్రాణాలను బలిపొంది. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న తమ సోదరి… తమ తల్లి ప్రచారం చేసిన వైద్య వ్యతిరేక సిద్ధాంతాల వల్లే కన్నుమూసిందని ఇద్దరు సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు. అపోహల…

Read More