Kalisetti Bharosa to Bahrain

యుద్ధ భయం… కలిశెట్టి అభయం – బహ్రెయిన్ లో చిక్కుకున్న వారికి ఎంపీ అండ

సహనం వందే, విజయనగరం: అమెరికా ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధజ్వాలలు మధ్యప్రాచ్యంలో నివసిస్తున్న వేలాదిమంది ప్రవాసాంధ్రుల జీవితాలను ఒక్కసారిగా అల్లకల్లోలం చేశాయి. బహ్రెయిన్ వంటి దేశాల్లో చిక్కుకున్న తమ వారి క్షేమం కోసం ఇక్కడ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఉత్కంఠ భరిత తరుణంలో వారికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు భరోసా కల్పించారు. యుద్ధ నీడలో బహ్రెయిన్అమెరికా ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌తో తలపడుతున్న ప్రస్తుత యుద్ధ పరిస్థితులు బహ్రెయిన్ ద్వీపాన్ని వణికిస్తున్నాయి….

Read More
Ropinirole Stimulates the dopamine

మాత్రతో ‘మాయరోగం’ – రోగులను రేపిస్టులుగా మార్చే మెడిసిన్

సహనం వందే, హైదరాబాద్: ఆధునిక వైద్యం పేరిట బహుళజాతి ఫార్మా సంస్థలు సాగిస్తున్న రసాయన మారణకాండ బట్టబయలైంది. పార్కిన్సన్, కాళ్లలో అసౌకర్యం తగ్గించేందుకు ఇచ్చే మందులు రోగులను నేరగాళ్లుగా, జూదగాళ్లుగా మారుస్తున్నాయి. బ్రిటన్ నుంచి భారత్ వరకు విస్తరించిన ఈ వ్యసనాల ఉప్పెన వేలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. రోపినిరోల్ వంటి డోపమైన్ అగోనిస్ట్ మందుల వాడకం వల్ల రోగుల ప్రమేయం లేకుండానే వారి మెదడు నియంత్రణ తప్పుతోంది. ఫలితంగా సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నవారు సైతం…

Read More
Betting against Khamenei Death

బాంబు పడకముందే పేలిన బెట్టింగ్స్ – ఖమేనీ మరణంపై 1200 కోట్ల పందెం

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం అంతర్జాతీయ రాజకీయాలను కుదిపేస్తోంది. కానీ ఈ విషాదం వెనుక ఒక చీకటి వ్యాపారం కోట్లలో లాభాలను గడించింది. యుద్ధ క్షేత్రంలో బాంబులు పడకముందే బెట్టింగ్ మార్కెట్లలో కాసుల వర్షం కురిసింది. ఇది కేవలం అంచనా మాత్రమేనా లేక ముందస్తుగా అమ్ముడుపోయిన సైనిక రహస్యమా అనే అనుమానాలు ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. పాలిమార్కెట్ మాయాజాలంపాలిమార్కెట్ అనేది క్రిప్టో ఆధారిత వికేంద్రీకృత ప్రిడిక్షన్ ప్లాట్‌ఫారమ్. ఇక్కడ…

Read More
Dharavi becomes Tourist place

పేదరికమే పాపులర్ టూరిజం – ముంబై ధారావి ఇప్పుడు టూర్ హాట్‌స్పాట్

సహనం వందే, ముంబై: ముంబైలోని చిమ్మచీకటి సందులు ఇప్పుడు కోటీశ్వరుల కాలక్షేప కేంద్రాలుగా మారాయి. ఆకలి కేకలు వినబడే చోట 15 వేల రూపాయలు పోసి దారిద్ర్యాన్ని చూసే వింత పోకడ మొదలైంది. ధారావి మురికివాడ ఇప్పుడు విదేశీయులకు, సంపన్నులకు ఒక ప్రదర్శనశాల. పేదల బతుకు చిత్రాన్ని ఒక పర్యాటక వస్తువుగా మార్చేసిన వైనంపై విశ్లేషణ ఇది. పేదరికపు ప్రదర్శనశాలధారావి మురికివాడలో పేదరికాన్ని అమ్ముకుంటున్నారు. ఇక్కడ రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల మంది బతుకుతున్నారు….

Read More
AK Khan and Kalisetti

భళా కలిశెట్టి – మాజీ ఐపీఎస్ ఏకే ఖాన్ ప్రశంస

సహనం వందే, అమలాపురం: కోనసీమ జిల్లా అమలాపురంలో ఆదివారం జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఒక అరుదైన కలయికకు వేదికయ్యాయి. ఈ వేడుకలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలిశెట్టిని మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ అభినందించడం విశేషం. ఆయన కలిశెట్టి రాజకీయ సేవలను కొనియాడారు. ‘విలువలు కలిగిన రాజకీయవేత్త అప్పలనాయుడుకు ప్రేమతో’ అని రాసిన పుస్తకాన్ని బహూకరించారు. ఏకే ఖాన్ నుంచి ఈ గుర్తింపు రావడం పట్ల కలిశెట్టి…

Read More
Nobel Prize Vs Trump

నోబెల్ బహుమతికి రక్తాభిషేకం – ఇరాన్ అగ్నిగుండంలో కాలిపోతున్న ప్రైజ్

సహనం వందే, హైదరాబాద్: నోబెల్ శాంతి బహుమతి తనకు ఇవ్వలేదని విమర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యుద్ధ బాట పట్టారు. పదేళ్ల కిందట ఇతర దేశాల జోలికి వెళ్లనని చెప్పిన ఆయన ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడినే అంతం చేశారు. అమెరికా సైనిక శక్తిని వాడుతూ మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధానికి తెరలేపారు. గతంలో తాను చెప్పిన మాటలన్నీ తుంగలో తొక్కే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ విషయంపై ట్రంప్ విధానాలను అమెరికా ప్రసిద్ధ పత్రిక…

Read More
Weekend Crime dramas

వారమంతా పని… వీకెండ్ లో ఖూనీ! – క్రైమ్ టూరిజంతో వేల కోట్ల వ్యాపారం

సహనం వందే, హైదరాబాద్: నిశ్శబ్దంగా ఉన్న ఒక విలాసవంతమైన రిసార్టులో అకస్మాత్తుగా ఒక కేక వినబడుతుంది. కాసేపటికే ఒక శవం కనిపిస్తుంది. చుట్టూ ఉన్న పర్యాటకులు భయపడకుండా వెంటనే డిటెక్టివ్ డైరీలు తీసి ఆధారాలు వెతకడం మొదలుపెడతారు. ఇది నిజమైన నేరం కాదు… వేల రూపాయలు చెల్లించి కొనుక్కున్న ఒక ‘మర్డర్ మిస్టరీ’ వినోదం. ప్రస్తుతం అమెరికాతో సహా అనేక దేశాల్లో ఈ వింత పర్యాటకం విపరీతంగా ప్రాచుర్యం పొందింది. ధనవంతులు తమ వారాంతపు సెలవుల్లో రక్తపాతం,…

Read More
SBI Life Insurance Elderly

కాటికిపోయే వయసులో ఇన్సూరెన్స్ పాలసీ – 82 ఏళ్లకు జీవిత బీమా పాలసీల అమ్మకం

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్ అనేది ఒక నిశ్శబ్ద ఆర్థిక నేరంలా వేళ్లూనుకుంది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి సామాన్యుల నమ్మకాన్ని యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్నాయి. రిటైర్ అయిన వృద్ధుల జీవితకాల పొదుపు మొత్తమే లక్ష్యంగా ఈ వ్యవస్థీకృత దందా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పాలసీలు అంటగడుతూ అమాయకుల జీవితాలను రోడ్డున పడేస్తున్న ఈ దారుణం ఇది. నమ్మించి గొంతు కోసిన ఎస్‌బీఐకోల్‌కతాకు చెందిన మీరా దాస్ ఉదంతం ఈ వ్యవస్థీకృత మోసానికి…

Read More
Vetlapalemm Issue

గోదావరి తీరాన మరణ మృదంగం! – కాకినాడలో భారీ పేలుడు… 20 మంది మృతి

సహనం వందే, కాకినాడ/రాజమండ్రి: ఉమ్మడి గోదావరి జిల్లాలు వరుస విషాదాలతో వణికిపోతున్నాయి. ఒకవైపు శనివారం కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడులో 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరోవైపు మూడు రోజుల క్రితం రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఐదుగురిని బలితీసుకున్నాయి. పారిశ్రామిక భద్రత, ఆహార కల్తీ అంశాల్లో వ్యవస్థల వైఫల్యం ప్రజల ప్రాణాలను గాలిలో కలిపేస్తోంది. యంత్రాంగం నిర్లక్ష్యంపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వేట్లపాలెంలో మృత్యుఘోషసామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం సంభవించింది….

Read More
MNJ Director issue

ఎంఎన్జే డైరెక్టర్ నియామకంపై రచ్చ -ప్రొఫెసర్లు, డాక్టర్ల తీవ్ర నిరసన

సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాలుగా సంస్థను నమ్ముకుని సేవలందిస్తున్న నిపుణులను కాదని, పారదర్శకత లేని రీతిలో బయటి వ్యక్తిని ఎంఎన్జే డైరెక్టర్‌గా నియమించడంపై హైదరాబాద్‌లోని ఎంఎన్జేలో పెను తుఫానుకు దారి తీసింది. ఈ నిర్ణయం కేవలం ఒక పదవికి సంబంధించింది మాత్రమే కాదు… ప్రభుత్వ క్యాన్సర్ చికిత్స నాణ్యతను, అంతర్గత నైపుణ్యాన్ని అవమానించడమేనని అక్కడి సీనియర్ ప్రొఫెసర్లు బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హతలకు పాతరఎంఎన్జేలో డైరెక్టర్ నియామకం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. సంస్థలో…

Read More