విలాసంపై విప్లవాగ్ని – నేపాల్ అధికార పెద్దల లగ్జరీపై ఆగ్రహజ్వాల

సహనం వందే, నేపాల్:నేపాల్‌ లో ప్రభుత్వ పెద్దల విలాసవంతమైన జీవితంపై యువతలో ఆగ్రహం అగ్నిపర్వతంలా పేలింది. లగ్జరీ కార్లు, ఖరీదైన విదేశీ ప్రయాణాలు, కళ్ళు చెదిరే జీవనశైలికి సంబంధించిన నాయకుల పిల్లల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ‘నెపో కిడ్స్’ హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అయ్యాయి. దేశంలో నాలుగో వంతు ప్రజలు పేదరికంతో అల్లాడుతుంటే పాలకుల వారసులు చేస్తున్న విచ్చలవిడి ఖర్చులను చూసి యువత సహనం కోల్పోయింది. ఈ సోషల్ మీడియా ప్రచారం కేవలం సమాచారం కోసం మాత్రమే…

Read More

‘శ్రీనివాసా’ గోవిందా – ఎట్టకేలకు ఎంఎన్ జే డైరెక్టర్ తొలగింపు

సహనం వందే, హైదరాబాద్‌:ఎట్టకేలకు ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులును రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. కొత్త ఇంచార్జి డైరెక్టర్ గా డాక్టర్ జోసెఫ్ బెంజిమెన్ ను నియమించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సహనం వందే’, ‘ఆర్టికల్ టుడే’ డిజిటల్ పేపర్లు రాసిన వరుస కథనాలతో డాక్టర్ శ్రీనివాసులుపై వేటు పడింది. ఆయన డైరెక్టర్ గా కొనసాగడంపై ‘సహనం వందే’ https://sahanamvande.com/?p=6557, ‘ఆర్టికల్ టుడే’ https://articletoday.in/ shock-to-dr-srinivasulu-as-dopt-sacks-mnj-director/ డిజిటల్…

Read More

కుబేరుడి పీఠాన్ని కోల్పోయిన మస్క్

సహనం వందే, అమెరికా:ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ తన పీఠాన్ని కోల్పోయాడు. అపారమైన కంప్యూటింగ్ శక్తికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఒరాకిల్ సహవ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ అనూహ్యంగా అతడిని అధిగమించి కొత్త ధనవంతుల రాజుగా అవతరించాడు. ఒరాకిల్ అద్భుతమైన ఆదాయ నివేదికతో లారీ సంపద ఒక్క రోజులోనే ఆకాశానికి ఎగిసింది. ఒరాకిల్ ఆదాయంతో దూకుడు…ఒరాకిల్ సంస్థ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఆదాయ నివేదిక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కృత్రిమ మేధస్సు కంపెనీల నుంచి వచ్చిన భారీ…

Read More

హరీష్ రావుకు ముఖ్యమంత్రి యోగం – ఫ్లాష్ సర్వే పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో చెక్కర్లు

సహనం వందే, హైదరాబాద్:ఫ్లాష్ సర్వే పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో 20 పేజీల రిపోర్ట్ చెక్కర్లు కొడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు కాంగ్రెస్ పార్టీకే మరింత ప్రయోజనం కలిగిస్తుందని సర్వే వెల్లడించింది. సర్వేలో అత్యంత ఆసక్తికరమైన విషయం హరీష్ రావు ప్రజల మనిషిగా ముందుకు వస్తున్నాడని… కేసీఆర్ కుటుంబంలో అంతర్గత యుద్ధం హరీష్ కి లాభిస్తుందని తేలింది. దీంతో హరీష్ రావే భవిష్యత్ ముఖ్యమంత్రి అవుతారని చాలామంది నమ్ముతున్నారు. కేటీఆర్‌కు మించి ప్రజల దగ్గర హరీష్‌కు బలమైన…

Read More

కోచింగ్‌కు పన్ను… భవిష్యత్తుపై మన్ను – విద్యార్థుల జీవితాలతో 18% జీఎస్టీ ఆట

సహనం వందే, హైదరాబాద్:మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పుడొక కొత్త చిక్కు వచ్చి పడింది. ఒకవైపు పిల్లల భవిష్యత్తు, మరోవైపు పెరిగిపోయిన ఖర్చులు. ప్రభుత్వం ఇటీవల ప్రైవేట్ కోచింగ్‌ సెంటర్లకు, ఆన్‌లైన్ ట్యూషన్లకు 18 శాతం జీఎస్టీ విధించడంతో ఈ సంకట పరిస్థితి మరింత పెరిగింది. పాఠశాలలు, కళాశాలలు పన్ను పరిధి నుంచి మినహాయించిన ప్రభుత్వం… కోచింగ్ సంస్థలను విద్యాసంస్థలుగా పరిగణించకుండా ఈ నిర్ణయం తీసుకుంది. పన్ను భారం వల్ల తల్లిదండ్రులు కోచింగ్ మానిపించి, పిల్లలను మళ్లీ పాఠశాల విద్యపై…

Read More

గ్రూప్-1… గుండెల్లో గన్ – మూడున్నరేళ్ల నిరీక్షణ పటాపంచలు

సహనం వందే, హైదరాబాద్:మూడున్నరేళ్ల నిరీక్షణ… నిద్రాహారాలు లేని కఠోర శ్రమ… అసంఖ్యాకమైన ఆశల పతాక. వీటన్నింటికీ ప్రతిఫలంగా తుది జాబితాలో తమ పేర్లు చూసుకుని మురిసిపోయారు గ్రూప్-1 అభ్యర్థులు. నియామక పత్రాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు వారి ఆశలపై పిడుగుపాటులా పడింది. తుది జాబితాను రద్దు చేస్తూ మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించడం..‌. లేదంటే మళ్ళీ పరీక్షలు పెట్టాలని సూచించడం… ఈ తీర్పుతో వారి గుండె ఝల్లుమంది. ఈ…

Read More

మైనారిటీ గురుకులాల్లో జీతాల గోస

సహనం వందే, ఖమ్మం:తెలంగాణలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, డైలీ వేజెస్ ఉద్యోగుల బతుకులు మూడు నెలలుగా అగమ్యగోచరంగా మారాయి. ప్రజాపాలనలో జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని, తక్షణమే పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యుడు షేక్ మక్బూల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. గత ప్రభుత్వం గురుకుల ఉద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో…

Read More

అల్లు అర్జున్ కు మరో షాక్ – అల్లు బిజినెస్ పార్క్‌ పై జీహెచ్ఎంసీ కన్నెర్ర

సహనం వందే, హైదరాబాద్:పుష్ప-2 సినిమా విడుదలైనప్పటినుంచి అల్లు కుటుంబాన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అల్లు అర్జున్ ఏకంగా జైలుకు వెళ్లి రావాల్సి వచ్చింది. తాజాగా ఆయన తండ్రి అల్లు అరవింద్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో సినీ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన అల్లు బిజినెస్ పార్క్‌ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పెంట్‌హౌస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తీవ్రంగా స్పందించింది. అనుమతులు లేకుండా…

Read More

న్యూ యా’ఫీల్’ – నేటి రాత్రి 10.30 గంటలకు ఐఫోన్ 17 ఆవిష్కరణ

సహనం వందే, అమెరికా:టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఈ ఈవెంట్ కోసం టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐఫోన్ 17 సిరీస్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 వంటి గాడ్జెట్‌లు మార్కెట్‌లోకి రానున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యాపిల్ ఈసారి టెక్ ప్రపంచంలో ఏ సంచలనాలు సృష్టిస్తుందో అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది. ఐఫోన్ 17 సిరీస్… సన్నగా,…

Read More

జ’గన్’పై రాజారెడ్డి మిస్సైల్ – రాజకీయాల్లోకి జగన్ మేనల్లుడు రాజారెడ్డి

సహనం వందే, విజయవాడ:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే వై.ఎస్. కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు, ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్. షర్మిల కుమారుడు వై.ఎస్. రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై షర్మిల కీలక ప్రకటన చేశారు. కర్నూలులో ఉల్లి రైతులను పరామర్శించేందుకు రాజారెడ్డిని తీసుకువెళ్లి ప్రజలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… వై.ఎస్. రాజారెడ్డికి ఎప్పుడు అవసరం అయితే…

Read More