జెన్ జెడ్ గుండెల్లో జ్వాల – అవినీతి, అక్రమాలపై ఈ చిహ్నం బ్రహ్మాస్త్రం

సహనం వందే, న్యూఢిల్లీ:ఆసియా యువతరం తమ గొంతుకను వినిపించడానికి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అది ఏ ఆయుధం కాదు, ఒక ప్రత్యేకమైన జెండా కాదు, కేవలం ఒక గుర్తు. ఇది వన్ పీస్ అనే జపాన్ మాంగాలో లూఫీ అనే కథానాయకుడి ట్రేడ్‌మార్క్ అయిన గడ్డితో అల్లిన టోపీ గుర్తు. ఇండోనేషియా, నేపాల్‌తో మొదలైన ఈ విప్లవం ఇప్పుడు ఆసియా మొత్తం విస్తరించింది. అవినీతి, ప్రభుత్వ దమనకాండ, నిరంకుశత్వం, సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా ఇది ఒక శక్తిమంతమైన…

Read More

తాత్కాలిక బదిలీల తిరకాసు – ఉద్యోగుల బదిలీలకు కఠిన నిబంధనలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్లపై జారీ చేసిన మార్గదర్శకాలపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కన్నా నిరాశనే మిగుల్చుతోంది. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పలు అంశాలు ఉద్యోగుల ఆశలకు అడ్డుకట్ట వేసినట్లు స్పష్టమవుతోంది. కఠినమైన అర్హతా నిబంధనలు, పరిమిత కాలపరిమితి, ఆర్థిక ప్రయోజనాల లేమి వంటివి ఉద్యోగుల మధ్య అసంతృప్తిని పెంచుతున్నాయి. అర్హత కన్నా అనర్హతలే ఎక్కువ…ప్రభుత్వం తాత్కాలిక బదిలీల కోసం…

Read More

హుస్సేన్‌సాగర్ నీటిపై క్రికెట్ స్టేడియం

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి మరిన్ని కొత్త హంగులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. హుస్సేన్‌సాగర్‌ నీటిపై ఫ్లోటింగ్ గ్రౌండ్స్ (తేలియాడే మైదానాలు) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీంతో పర్యాటక రంగం మరింత పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ వాసులు నీటిపైనే ఫుట్‌బాల్, బాక్స్ క్రికెట్ వంటి క్రీడలు ఆడుకునే అరుదైన అవకాశం దక్కుతుంది. ఇప్పటివరకు ఇలాంటివి సింగపూర్ వంటి విదేశాల్లోనే…

Read More

ఆన్‌లైన్ డెత్ గేమ్‌ – ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్య

సహనం వందే, లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆన్‌లైన్‌ గేమ్‌ 12 ఏళ్ల విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫ్రీ ఫైర్‌ గేమ్‌లో ఏకంగా రూ.13 లక్షలు పోగొట్టుకున్న ఆరో తరగతి విద్యార్థి యశ్‌ కుమార్‌… తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అతని తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. మైనర్‌ పిల్లలు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో ఎలా పడిపోతున్నారో దీని ద్వారా మరోసారి రుజువైంది. ఫ్రీ ఫైర్‌ వంటి గేమ్‌లు పిల్లలను ఆకర్షించి, డబ్బులు ఖర్చు చేయమని ప్రేరేపిస్తున్నాయని…

Read More

పేదల వైద్యంపై పిడుగు – ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్ పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 2500 కోట్లు, తెలంగాణలో రూ.1400 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు సేవలను నిలిపివేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేయాలని నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్టీఆర్ పథకం కింద ఉన్న ఓపీడీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం… పేదలకు శాపంప్రైవేటు ఆస్పత్రులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు కనీస స్పందన చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో…

Read More

భారత మగాళ్లకు అమెరికాలో డిమాండ్ – ఇండియన్ భర్త కోసం ఒక మహిళ ప్రయత్నం

సహనం వందే, అమెరికా:న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ ప్రపంచానికి కేంద్ర బిందువు లాంటిది. అక్కడ విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన ప్రజలు కనిపిస్తుంటారు. అలాంటి చోట ఒక అమెరికన్ మహిళ ‘భారతీయ భర్త కావాలి’ అని రాసి ఉన్న ప్లకార్డుతో నిలబడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆధునిక కాలంలో డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ప్రేమ వ్యవహారాలకు వేదికగా మారుతున్నప్పుడు… ఆ మహిళ పాత పద్ధతిని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించింది….

Read More

నారా వారి నయా నాటకం – యూరియా తగ్గించే రైతులకు బోనస్ ఎర

సహనం వందే, అమరావతి:యూరియా కొరత సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాన్నే రచించారు. యూరియా వాడకం తగ్గిస్తే రైతులకు ఒక్కో బస్తాకు రూ. 800 ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. వినడానికి బాగానే ఉన్నా ఈ ప్రకటన వెనుక దాగి ఉన్న రాజకీయ కోణాన్ని విశ్లేషిస్తే అసలు విషయం అర్థమవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే యూరియా కొరతతో రైతులు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితిలో వాడకం తగ్గించమని చెప్పడం… ఒకవేళ అవసరమైతే డోర్ డెలివరీ…

Read More

బ్లడ్ మ్యాచ్‌ – దేశం బాధలో ఉంటే పాక్ తో క్రికెట్ ఆటలేంటి?

సహనం వందే, హైదరాబాద్:ఏప్రిల్ రెండో తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అమాయకులైన 26 మంది భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దేశం ఇంకా ఆ దుర్ఘటన షాక్‌లోంచి తేరుకోకముందే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు, ఉగ్రదాడి బాధితుల కుటుంబాలు ఈ నిర్ణయంపై మండిపడుతున్నాయి. దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని నినదిస్తుంటే క్రికెట్ మైదానాల్లో పాకిస్తాన్‌తో చేతులు…

Read More

లండన్ మండెన్ – ‘మా దేశం మాక్కావాలి’.. బ్రిటన్ లో నిరసనలు

సహనం వందే, లండన్:లండన్ నగరం వలస వ్యతిరేక నినాదాలతో హోరెత్తిపోయింది. యాంటీ-ఇమ్మిగ్రేషన్ ఉద్యమం గట్టి గళంతో ముందుకు సాగుతోంది. వెస్ట్‌మిన్‌స్టర్ బ్రిడ్జి నుంచి హౌస్ ఆఫ్ పార్లమెంట్ వరకు వేలాది మంది ప్రజలు కదలివచ్చారు. అతివాద కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన ఈ ‘యునైట్ ది కింగ్‌డమ్’ ర్యాలీకి లక్షన్నర మందికి పైగా హాజరయ్యారని నివేదికలు చెబుతున్నాయి. వలసవాదాన్ని వ్యతిరేకిస్తూ, అక్రమ వలసదారులను వెంటనే వెనక్కి పంపించాలని వీరు డిమాండ్ చేశారు. నిరసన శాంతియుతంగా మొదలైనా…

Read More

విజయనగరం వీరుడు… పార్లమెంట్ టాపర్

సహనం వందే, న్యూఢిల్లీ:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంటులో టాపర్ గా నిలిచారు. ప్రశ్నలు, హాజరు విభాగాల్లో ఎంపీలందరితో పోలిస్తే మొదటి స్థానం సాధించారు. మొత్తం పని తీరులో నాలుగో స్థానం వచ్చింది. 99 శాతం హాజరు, 115 ప్రశ్నలతో ముందుండటం అతని అంకితభావాన్ని తెలియజేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీలలో అత్యుత్తములలో ఒకరిగా నిలవడం తెలుగుదేశం పార్టీకి గొప్ప గుర్తింపు. లోక్‌సభ సభ్యుల పనితీరు నివేదికను పార్లమెంట్ విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025…

Read More