
పాక్ రాయబార కార్యాలయంలో కేక్ కటింగ్
సహనం వందే, ఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు నింపుతుంటే… ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు ఓ వ్యక్తి కేక్ పట్టుకెళ్లిన అత్యంత హేయమైన ఘటన సంచలనం రేపింది. 26 మంది పర్యాటకుల ప్రాణాలు పోగొట్టుకున్న విషాద సమయంలో ఇలాంటి చర్యకు పాల్పడటం దేశ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు. నెత్తుటి మరకలు ఆరకముందే సంబరాలా? ఏప్రిల్ 22న బైసరన్…