తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం- అనేక చోట్ల నష్టపోయిన రైతులు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, వడగళ్ల వాన కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మెదక్ జిల్లాలో పెను నష్టం సంభవించింది. మెదక్ పట్టణంలోని జంబికుంట వీధిలో ఒక ఇంటిపై పిడుగు పడటంతో సిద్ధయ్య అనే వ్యక్తి ఇంట్లోని వస్తువులు ధ్వంసమయ్యాయి. అయితే, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మెదక్ పట్టణంతో పాటు మెదక్ రూరల్, పాపన్నపేట, కోల్చారం…

Read More

నాబార్డు చైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డు చైర్మన్ షాజీ కేవీ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని, సూక్ష్మ సేద్యానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని, సహకార సంఘాలను బలోపేతం చేయాలని, మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక పథకం రూపొందించాలని, ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను…

Read More

రేవంత్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

సహనం వందే, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం శాసనమండలిలో ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లోనే రూ. 1,58,000 కోట్ల అప్పు చేసిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో రూ. 4,17,000 కోట్ల అప్పు చేసిందని కవిత ఆరోపించారు. ప్రజల్లో కేసీఆర్ ను తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల…

Read More

తిరుమలలో దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు

సహనం వందే, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్నదాన కేంద్రంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. దేవాన్ష్ చేతుల మీదుగా ప్రసాదాల పంపిణీ చేశారు. దేవాన్ష్ కూడా తన తాతతోపాటు భక్తులకు అన్నప్రసాదాలు స్వయంగా వడ్డించి, వారి ఆశీర్వాదాలు పొందాడు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ అన్నదాన ట్రస్ట్…

Read More

ప్రతిపక్షం… ప్రజాధిక్కారం…!

ప్రజా తీర్పును అవహేళన చేస్తున్న కేసీఆర్, జగన్ – సీఎం కుర్చీ నుంచి దింపినందుకు అసెంబ్లీకి రానంటున్న మాజీ సీఎంలు – అలాంటప్పుడు సభ్యులుగా కొనసాగడం అవసరమా? – ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండంటున్న ప్రజలు – ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించకుంటే మీరెందుకు? – అసెంబ్లీకి రాకుండానే లక్షల వేతనాలు దండగ అంటూ విసుర్లు – సోషల్ మీడియా, ట్విట్టర్ పోస్టింగులకే పరిమితమా? సహనం వందే, హైదరాబాద్/అమరావతి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి,…

Read More

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి ప్రణాళిక – మంత్రి దామోదర రాజనర్సింహ

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య సేవల నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడం, వైద్య సిబ్బంది నియామకం, డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి తేవడం వంటి అంశాలపై గురువారం మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల బ్రాండింగ్… ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా బ్రాండింగ్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. “అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా…

Read More

హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీల ప్రీ-ఈవెంట్

– యాదగిరిగుట్ట ఆలయం అనుభూతి ఇచ్చిందన్న 2024 ప్రపంచ సుందరి – మే నెలలో మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ అద్వితీయ ఆతిథ్యం! సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి గురువారం ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్…

Read More

ఉస్మానియాలో ఆంక్షలు ఎత్తివేయాలి – సీపీఎం నాయకులు వీరయ్య డిమాండ్

సహనం వందే, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ వైస్ ఛాన్సలర్ జారీ చేసిన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య ప్రకటన విడుదల చేశారు. వివిధ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. “వైస్ ఛాన్సలర్ చేత ఇలాంటి…

Read More

మంత్రి దామోదరకు నాయకుల కృతజ్ఞతలు

సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాల నాటి ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరడంలో కీలక పాత్ర పోషించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ జనరల్ సెక్రటరీ కొండేటి మల్లయ్య మరియు ఇతర నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రి దామోదర రాజనర్సింహ చేసిన కృషిని కొనియాడారు. “దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణ ఆకాంక్షను నెరవేర్చడంలో మంత్రి…

Read More

తెలంగాణ వ్యవసాయంలో సాంకేతిక విప్లవం – జర్మనీ సహకారంతో ఆధునిక సాగుకు శ్రీకారం!

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జర్మనీ ప్రతినిధుల బృందంతో గురువారం సచివాలయంలో సమావేశమై, నూతన సాంకేతికతల వినియోగం, మార్కెటింగ్, డిజిటల్ వ్యవసాయ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, “భారత-జర్మనీ ప్రభుత్వాల సహకారంతో వ్యవసాయ రంగం అభివృద్ధికి నూతన ప్రణాళికలు రూపొందిస్తాం” అని అన్నారు. సిరిసిల్లలో పైలట్ ప్రాజెక్ట్: సిరిసిల్ల జిల్లా వేములవాడలో జర్మనీ సంస్థ…

Read More