కరోనా శవాలపై రూ. 450 కోట్లు?

సహనం వందే, హైదరాబాద్: ఇలా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కాలంలో 2020 నుంచి ప్రజారోగ్య విభాగం పరిధిలోని అనేకమంది జిల్లా వైద్యాధికారులు, రాష్ట్ర వైద్యాధికారులు ప్రైవేట్ ఆసుపత్రులపై పడి అందినంత దోచుకున్నారు. రోగులకు సాయం చేయాల్సింది పోయి యాజమాన్యానికి తొత్తులుగా మారారన్న విమర్శలు ఉన్నాయి. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు వైద్య ఆరోగ్య శాఖలో కరోనా కాలంలో రూ.కోట్లు దండుకోవటమే పనిగా కొందరు అధికారులు వ్యవహరించారు. కరోనా చావులపై పైసలు ఏరుకున్నారు. వందల ఫిర్యాదులు… చర్యలెక్కడ?కరోనా సమయంలో…

Read More

జైలు నుంచి సీఎం

సహనం వందే, హైదరాబాద్: భారత రాజకీయాల్లో జైలు జీవితం అనేక మంది నాయకులకు అనూహ్య అవకాశాలు కల్పించింది. ఇటీవల కాలంలో జైలుకు వెళ్లి వచ్చిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతుండటం గమనార్హం. రాజకీయ పోరాటాలు, అవినీతి ఆరోపణలు… కారణం ఏదైనా వారికి బ్రహ్మరథం పడుతున్నారు. జైలుకు వెళ్లడం ఒక అర్హతగా భావించేవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని,…

Read More

రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి…!

సహనం వందే, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గతేడాది జూన్‌ 3వ తేదీన రాష్ట్రంలోని రుతుపవనాలు ప్రవేశించగా… ఈసారి వారం రోజుల ముందే రాష్ట్రాన్ని తాకాయి. సాధారణంగా జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల ఆగమనం ఉంటుంది. కానీ ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో ముందస్తుగా రుతుపవనాల రాక రైతాంగాన్ని ఉత్సాహంలో నింపింది. వారం రోజులుగా కురుస్తున్న అడపాదడపా వర్షాలతో రైతులంతా దుక్కులు దున్ని సాగుపనులకు సిద్దంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రుతుపవనాలు ముందుగానే రావడంతో…

Read More

‘గడల’పై ఏసీబీ ఉచ్చు?

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడిగా పనిచేసిన డాక్టర్ గడల శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనా విపత్కర సమయంలో, అంతకుముందు కాలంలో ఆయన కోట్ల రూపాయలను అక్రమంగా కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో ఆయనపై వచ్చిన అనేక ఫిర్యాదులతో పాటు ఇటీవల కొందరు ఉద్యోగులు అందించిన పక్కా సమాచారం ఆధారంగా ఏసీబీ తన విచారణను…

Read More

దేశంలో మళ్లీ కరోనా అలజడి

సహనం వందే, ఢిల్లీ: అంతరించిపోయిందనుకున్న కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. కొత్త రూపంలో తిరిగొచ్చి దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్లను గుర్తించిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. నిపుణుల హెచ్చరిక…భారతీయ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు ఎన్‌బి.1.8.1, ఎల్ఎఫ్.7 అనే రెండు కొత్త కరోనా వేరియంట్లను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే జేఎన్.1 రకం కేసులు నమోదయ్యాయి. ఈ…

Read More

విజ‌య‌సాయిరెడ్డిపై వైసీపీ సంచలన ట్వీట్‌

సహనం వందే, అమరావతి: విజ‌య‌సాయిరెడ్డి అమ్ముడు పోయాడ‌న‌డానికి ప‌క్కా ఆధారాలు ఉన్నాయంటూ వైఎస్సార్‌సీపీ సంచలన ట్వీట్‌ చేసింది. ‘మ‌ద్యం కుంభ‌కోణంపై సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌ల ముందు ర‌హ‌స్య స‌మావేశం జరిగింది. తాడేప‌ల్లి పార్క్ విల్లా నెంబర్ 27కు సాయంత్రం 5:49కు విజ‌య‌సాయిరెడ్డి వచ్చారు… 13 నిమిషాల త‌ర్వాత అదే విల్లాకు చంద్రబాబు న‌మ్మిన‌బంటు టీడీ జ‌నార్ధ‌న్‌ వచ్చారు. 45 నిమిషాల పాటు ర‌హ‌స్య మంత‌నాలు జరిపారని వైఎస్సార్‌సీపీ ట్వీట్‌ చేసింది.

Read More

మిస్ వరల్డ్ తారలను ఎవరు వేధించారు?

ప్రభుత్వం సమాధానం చెప్పాలని సబిత డిమాండ్ సహనం వందే, హైదరాబాద్: మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ కామెంట్స్‌పై మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదివారం స్పందించారు. మిల్లా మ్యాగీ ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ పరువును ప్రభుత్వం మంటగలిపిందని ఆరోపించారు. మ్యాగీ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. ప్రపంచ దేశాల యువతులను ఎవరు వేధించారో తేల్చాలని డిమాండ్ చేశారు. బాధ్యులు ఎవరో తేల్చాలని… మహిళా కమిషన్ స్పందించి విచారణ జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Read More

జపాన్‌ను అధిగమించిన భారత్

సహనం వందే, ఢిల్లీ: భారత్ జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం జరిగిన నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత ఆర్థిక పురోగతిపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయని సుబ్రమణ్యం తెలిపారు. ‘ప్రస్తుతం మనం నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన నాలుగో అతిపెద్ద ఆర్థిక…

Read More

నాగార్జున, ధనుశ్ నటిస్తోన్న కుబేర టీజర్

సహనం వందే, హైదరాబాద్: నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది….

Read More

సినిమా థియేటర్ల వివాదంపై అల్లు…

సహనం వందే, హైదరాబాద్: సినిమా థియేటర్ల వివాదంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల మూసివేత అనేది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. ఏపీలో 1500 థియేటర్లు ఉంటే తనవి కేవలం 15 మాత్రమే ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో తనకు కేవలం ఒక్క థియేటర్‌ మాత్రమే ఉందన్నారు. స్టాండ్‌ అలోన్ థియేటర్లకు సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అల్లు అరవింద్ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు కూర్చుని మాట్లాడుకోవాలని.. ఏకపక్షంగా వెళ్లడం సరికాదన్నారు.

Read More