బోయింగ్ ఢమాల్ -అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎఫెక్ట్

సహనం వందే, అమెరికా:అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయిన ఘటన… అమెరికన్ విమాన తయారీ సంస్థ బోయింగ్ కు ఎదురుదెబ్బ తగిలింది. దాని అత్యంత విజయవంతమైన విమానాల్లో ఒకటైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ భద్రతా రికార్డును తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే భద్రతా, ఉత్పత్తి సమస్యలతో సతమతమవుతున్న బోయింగ్ సంస్థకు ఈ ప్రమాదం మరో గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ప్రమాదం తర్వాత అమెరికన్ స్టాక్ మార్కెట్ (నాస్డాక్)లో బోయింగ్ షేర్లు 6.5% నుండి 8% వరకు పడిపోయాయి. దీని ఫలితంగా సంస్థకు…

Read More

సెక్యులరిజం నయా ట్రెండ్ – మతాలకు గుడ్ బై చెబుతున్న కోట్లమంది

సహనం వందే, ఢిల్లీ: ప్రపంచంలో సెక్యులరిజం పెరుగుతుంది. వివిధ మతాల నుంచి కోట్ల మంది బయటకు వస్తున్నారు. అలాగేఅమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలకు చెందిన అనేకమంది సెక్యులరిస్టులుగా మారిపోతున్నారు. ప్రపంచంలో క్రైస్తవుల జనాభా 230 కోట్లు, ఇస్లాం మతస్తుల జనాభా 200 కోట్లు… ఆ తర్వాత మూడో వర్గం ఏ మతానికీ చెందని వారు 147 కోట్ల మంది ఉన్నారు. ఆ తర్వాత 120 కోట్ల మంది హిందూ మతస్తులు ఉన్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్…

Read More

మహావీర్ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ లీకులు

సహనం వందే, హైదరాబాద్: వికారాబాద్ లోని మహావీర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ రెండు రోజుల ప్రత్యేక డ్రామాకు తెరలేపింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బృందాల తనిఖీలు గురు, శుక్రవారాల్లో జరుగుతాయని మేనేజ్మెంట్ కు సమాచారం అందింది. ఆకస్మికంగా జరగాల్సిన తనిఖీలు ముందస్తు లీకు కావడం గమనార్హం. దీంతో యాజమాన్యం మహా యాక్షన్ కు రంగం సిద్ధం చేసింది. ఎక్కడెక్కడో ఉన్న వివిధ విభాగాల అధిపతులు తక్షణమే కాలేజీకి చేరుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వారంతా కేవలం…

Read More

మందులో మంగ్లీ చిందు -బర్త్డే పార్టీలో అడ్డంగా బుక్

సహనం వందే, హైదరాబాద్: సింగర్ మంగ్లీ అడ్డంగా బుక్కయ్యారు. తన పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలనుకుని పోలీసులకు చిక్కిపోయారు. డ్రగ్స్, విదేశీ మద్యం ఆరోపణలతో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో ఆమె కుటుంబం బెంబేలెత్తిపోయింది. అయితే పుట్టినరోజు పార్టీలకు, డీజేలకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. దీనికి, మంగ్లీకి సంబంధం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ వాడితే నేరంగా భావించి అరెస్టు చేయవచ్చు, జైలుకు కూడా పంపవచ్చు. కానీ పుట్టినరోజు వేడుకలకు అనుమతి లేదని పోలీసులు…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో… చిన్న తిమింగలం 200 కోట్లు మింగేస్తే..

సహనం వందే, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల కలలను ఆశలతో నింపి కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర జీవనాడిగా చిత్రీకరించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, దానిని అవినీతి యంత్రంగా మార్చి ముంచింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ వద్ద రూ. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సంచలన ప్రకటన చేసింది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో బంగారం, నగదు, విలాసవంతమైన ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ,…

Read More

రెండు ఫ్లాట్లు… నిండా నోట్లు – కరోనా తీసుకొచ్చిన అదృష్టం

సహనం వందే, హైదరాబాద్: డాక్టర్ శ్రీహరిరావు (పేరు మార్చాం)… కరోనా కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో కీలక పోస్టులో పనిచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై ఆయన కంట్రోల్ ఉండేది. అప్పటి ప్రభుత్వం కూడా ఎనలేని ప్రాధాన్యం కల్పించింది. ఆయన స్థాయికి మించి బాధ్యతలు అప్పగించింది. వ్యాక్సిన్లు మొదలుకొని అన్నింటిపైనా అజమాయిషీ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే కరోనా ఆయన పాలిట ధనలక్ష్మి అయ్యింది. ఆసుపత్రుల్లో శవాలు లేస్తుంటే… ఆ మాజీ వైద్యాధికారి ఇంట కరెన్సీ నోట్లు…

Read More

ఆయిల్ ఫెడ్ అధికారులపై వ్యవసాయ మంత్రి తుమ్మల ఫైర్

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ అక్రమాలపై ఇటీవల వరుసగా ‘సహనం వందే, ఆర్టికల్ టుడే’ (sahanamvande.com & articletoday.in) డిజిటల్ పేపర్లలో వస్తున్న కథనాలపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. మంగళవారం హైదరాబాదులోని ఆయిల్ ఫెడ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులపై ఆయన ఫైర్ అయ్యారు. ఆయిల్ ఫెడ్ అక్రమాల్లో కొందరు అధికారుల తీరుపై మంత్రి మండిపడినట్లు సమాచారం. ఆ రెండు డిజిటల్ పేపర్లలో…

Read More

ఏలూరులో సాక్షి ఆఫీసుకు నిప్పు – రాష్ట్రవ్యాప్తంగా దాడులు

ఎడిటర్ ధనుంజయరెడ్డి, సైమాల ఖండన సహనం వందే, ఏలూరు:ఆంధ్రప్రదేశ్‌లో సాక్షికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఏలూరులో నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కొందరు దుండగులు సాక్షి ఆఫీసుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆఫీసులోని ఫర్నిచర్, సోఫాలు పూర్తిగా కాలిపోగా, పార్కింగ్‌లో నిలిపి ఉంచిన కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడి టీడీపీ నేతలు కక్షపూరితంగా చేసిన పనే అని వైసీపీ ఆరోపించింది. ఈ ఘటనను సాక్షి…

Read More

రెడ్ల రగడ – మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై యాగీ

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం బహుజనులకు అవకాశం కల్పించడంపై రెడ్లు భగ్గుమంటున్నారు. తమకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం పట్ల ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డీలు నానా యాగీ చేస్తున్నారు. బోధన్ లోనైతే సుదర్శన్ రెడ్డి అనుచరులు రాజీనామాలు కూడా చేస్తున్నారు. అలాగే బోధన్ బంద్ కు పిలుపునిచ్చారు. రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డీలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ కులగణన, సామాజిక న్యాయం…

Read More

కోట్లు కొల్లగొట్టారు – కార్పొరేషన్ ను ప్రైవేటీకరణ చేసే కుట్ర

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆయిల్ ఫెడ్ పై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొందరు కీలక స్థాయి వ్యక్తులు కోట్ల రూపాయలు కొల్లగొట్టారని పామాయిల్ రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ను నాశనం చేస్తున్నారని అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇటీవల కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేసింది. ఈ లేఖ ఆయిల్ ఫెడ్…

Read More