కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్‌లో అందాల తారలు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో అపారమైన సేవ‌లందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు మంగళవారం సందర్శించారు. సౌందర్యం కేవలం బాహ్య రూపానికే పరిమితం కాదని, సామాజిక సేవలో కూడా తమ వంతు పాత్ర పోషించగలమని ఈ సందర్శన ద్వారా వారు చాటిచెప్పారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులకు కిమ్స్ గ్రూప్…

Read More

‘నకిలీ’ మాఫియా నీడలో వ్యవసాయశాఖ

సహనం వందే, హైదరాబాద్: వానాకాలం సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. రైతులు ఇప్పటికే విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎప్పటిలాగే దళారులు రైతులను మోసం చేస్తున్నారు. తెలంగాణలో పత్తి రైతులు నిషేధిత బీటీ-3 విత్తనాల దందాతో మోసపోతున్నారు. వ్యాపారులు, దళారులు అధిక దిగుబడి, తెగుళ్ల నిరోధకత పేరుతో ఈ విత్తనాలను రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ నకిలీ విత్తనాల రవాణాను అరికట్టడంలో విఫలమవుతూ, కొందరు దళారులతో కుమ్మక్కై చూసీ చూడనట్టు…

Read More

గుల్జార్ ఘటన…వ్యవస్థాగత ఉగ్రవాదం

సహనం వందే, హైదరాబాద్: పహల్గాంలో ఉగ్రవాదుల చేతుల్లో 26 మంది చనిపోతే, భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై యుద్ధం చేసింది. మరి హైదరాబాదులోని గుల్జార్ హౌస్‌లో మంటలు చెలరేగి 17 మంది చనిపోతే ఎవరిపై మనం యుద్ధం చేయాలి? నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలను బలిగొన్న ఇక్కడ ఉగ్రవాదులు ఎవరు? అధికారులు కాదా? ఇది అంతర్గత వ్యవస్థాగత ఉగ్రవాదం కాదా? ఈ ఉగ్రవాదులపై చర్యలు ఉండవా? ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటే సరిపోతుందా? ఇది కేవలం దుర్ఘటన కాదు….

Read More

బీఆర్ఎస్‌ చీలికకు హరీష్ బీజాలు

సహనం వందే, హైదరాబాద్: రాజకీయ ఓనమాలు నేర్పించి ఈ స్థాయికి తీసుకొస్తే, తన సొంత మేనమామ కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు కూడా హరీష్ రావు వెనుకాడడం లేదని జోరుగా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్‌ చీలికకు ఆయన బీజం వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని ఏమాత్రం అంగీకరించడానికి హరీష్ రావు సిద్ధంగా లేనట్టు చెబుతున్నారు. కేటీఆర్ కు పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తన రాజకీయ అడుగులు మరోరకంగా ఉంటాయని హరీష్ రావు తన…

Read More

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

సహనం వందే, హైదరాబాద్: వానాకాలం పంటల సాగుకు సన్నద్ధంగా ఉండాలని, నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వానాకాలం పంటల సాగుపై సమీక్ష సమావేశం…

Read More

‘అగ్ల్రీ’ చైర్మన్లు… డమ్మీ ఎండీలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ శాఖలోని కార్పొరేషన్లు ఇప్పుడు చైర్మన్ల సొంత జాగీర్లుగా మారిపోయాయి. కొందరు చైర్మన్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఐఏఎస్ అధికారులుగా ఉన్న ఎండీలు సైతం వారి గుప్పిట్లో డమ్మీలుగా మిగిలిపోయారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న చైర్మన్ల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎండీలు గులాంలు.. చైర్మన్లదే పెత్తనం! వ్యవసాయశాఖలో ఆగ్రోస్, ఆయిల్ ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థ, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, హాకా, టెస్కాబ్, మార్క్‌ఫెడ్ వంటి…

Read More

‘కంచ’ విధ్వంసంపై సుప్రీం గరం గరం

సహనం వందే, ఢిల్లీ: కంచ గచ్చిబౌలిలోని విలువైన అటవీ భూమిని ఐటీ ప్రాజెక్టు కోసం ధ్వంసం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. అటవీ భూమిని తిరిగి పూర్వ స్థితికి తీసుకురావాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఆరుగురు ఉన్నతాధికారులను జైలుకు పంపాల్సి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. సుమోటోగా స్వీకరించిన కోర్టు…ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం సమీపంలోని…

Read More

జొన్న ‘అవినీతి’ కేంద్రాలు

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో అనేక జొన్న కొనుగోలు కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారాయి. పక్క రాష్ట్రాల నుంచి అడ్డదారిలో జొన్నలు తెచ్చి, మద్దతు ధర పేరుతో దళారులు లక్షల రూపాయలు కొల్లగొడుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా తాంసిలో ముక్కిపోయిన అక్రమ జొన్నలు పట్టుబడటం సంచలనం రేపింది. ఈ ఘటన వెనుక అధికారుల హస్తం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసలు ఈ జొన్నలు ఎవరివో, ఎక్కడి నుంచి తెచ్చారో తేల్చకుండా అధికారులు దాస్తున్నారు….

Read More

సీపీఆర్’హూ’?

సహనం వందే, హైదరాబాద్: అయోధ్యరెడ్డి ఆర్టీఐ కమిషనర్ గా నియమితులవడంతో, ఆయన ఖాళీ చేసిన ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల అధికారి పోస్టులోకి కొత్తగా ఎవరు వస్తారన్న విషయం మీడియా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి కార్యాలయంలో అత్యంత కీలకమైన ఈ సీపీఆర్ఓ పదవి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక పదవిని దక్కించుకోవడానికి సీనియర్ జర్నలిస్టులు పోటీ పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కొందరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయగా,…

Read More

ప్రజారోగ్యంలో ఖల్ ‘నాయక్’

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ప్రజల ఆరోగ్యం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా కొందరు అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారు. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్‌పై విజిలెన్స్ విచారణలో అక్రమాలు బట్టబయలైనా, ప్రభుత్వం మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. నోటీసులు ఇచ్చినా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు వైద్య సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఆరు నెలల కిందట ఆయన్ను తప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం…

Read More