
‘గడల’పై ఏసీబీ ఉచ్చు?
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడిగా పనిచేసిన డాక్టర్ గడల శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనా విపత్కర సమయంలో, అంతకుముందు కాలంలో ఆయన కోట్ల రూపాయలను అక్రమంగా కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో ఆయనపై వచ్చిన అనేక ఫిర్యాదులతో పాటు ఇటీవల కొందరు ఉద్యోగులు అందించిన పక్కా సమాచారం ఆధారంగా ఏసీబీ తన విచారణను…