రక్తంతో తడుస్తున్న అభిమానం – విజయ్ ర్యాలీ ఘటనలో 38 మంది మృతి

సహనం వందే, తమిళనాడు:అభిమానుల పట్ల సినిమా తారల తీరు అత్యంత దారుణంగా ఉంటుంది. ఫ్యాన్స్ అమాయకత్వాన్ని తమ సినిమా రాజకీయ, అవసరాల కోసం ఉపయోగించుకుంటూ వందల కోట్లు గడిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చిన అభిమానాన్ని రాజకీయాల వైపు మళ్ళించుకుని పదవులు పొందుతున్నారు. తమ స్వార్థం కోసం అభిమానుల రక్తం కళ్ళచూస్తున్నారు. పదవీకాంక్ష కోసం ఇష్టారాజ్యంగా ర్యాలీలు నిర్వహిస్తూ జనాన్ని తొక్కి చంపేస్తున్న ఈ ధోరణిని అభిమాన ఉగ్రవాదం అనకుండా ఎలా ఉండగలం? కరూరు జిల్లాలో నటుడు విజయ్…

Read More

రైతు బలి… రఘునందన్ బదిలీ – రుణమాఫీ… యూరియా కొరత ఎఫెక్ట్

సహనం వందే, హైదరాబాద్:సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్ రావును తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కార్యదర్శి బాధ్యతల నుంచి తొలగించి బదిలీ చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎక్కువకాలం వ్యవసాయశాఖలో ఉన్నందున బదిలీ చేశారని కొందరు అంటుంటే… కీలకమైన పంటల సీజన్లో అకస్మాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని మరికొందరు అంటున్నారు. అయితే ఆయన హయాంలో జరిగిన రెండు ప్రధాన వైఫల్యాలే ఈ పరిస్థితికి కారణమని సచివాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రుణమాఫీ అమలులో గందరగోళం…కాంగ్రెస్ పార్టీ అధిష్టానం… ముఖ్యమంత్రి…

Read More

డాక్టర్లపై డాలర్ సెగ – భారతీయ వైద్యులకు హెచ్1బీ గుదిబండ

సహనం వందే, అమెరికా:అమెరికా ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న విదేశీ వైద్యులకు హెచ్1బీ వీసా ఫీజు రూపంలో అకస్మాత్తుగా పెనుభారం పడింది. అగ్రరాజ్యం తాజాగా వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంపై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) అగ్గిమీద గుగ్గిలమైంది. ఈ భారీ ఫీజు వైద్య సేవలకు అడ్డంకిగా మారుతుందని, దీని ప్రభావం వల్ల దేశ ఆరోగ్య రంగం కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికన్ల ఆరోగ్య భద్రతకు అత్యవసరం అయిన వైద్యులను ఈ నిబంధన…

Read More

బీసీలకు అ’భయం’ – ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) సామాజిక న్యాయాన్ని అందించే దిశగా చారిత్రక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఏకంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఈ రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. న్యాయపరమైన చిక్కులపై ఆందోళన…ఈ చారిత్రక నిర్ణయం…

Read More

అసెంబ్లీలో అఖండ ‘చంద్ర’ప్రచండ – చంద్రబాబునూ వదలని బాలయ్య బాబు

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం ఎమ్మెల్యే బాలయ్య బాబు విశ్వరూపం చూపించారు. అఖండ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. సొంత ప్రభుత్వం పైనా… మాజీ సీఎం జగన్ పైనా చెలరేగిపోయారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవినీ ఇరికించేశారు. రాజకీయంగా సొంత పార్టీనీ… పెద్దలను చెడుగుడు ఆడుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని సైకోగాడు అంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలు సభను స్తంభింపజేశాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులు జగన్‌ను కలిసిన వివాదాస్పద అంశంపై మాటల…

Read More

పచ్చబొట్టుకు పండగ – దక్షిణ కొరియాలో టాటూకు చట్టబద్ధత!

సహనం వందే, సియోల్:కొత్త చట్టంతో దక్షిణ కొరియాలో ఇక టాటూ కళకు స్వేచ్ఛ వచ్చింది. ఇప్పటివరకు చీకటి గదుల్లో రహస్యంగా పనిచేసిన టాటూ కళాకారులకు మంచి రోజులు వచ్చాయి. జాతీయ అసెంబ్లీ టాటూ కళను చట్టబద్ధం చేస్తూ చారిత్రక బిల్లును గురువారం ఆమోదించింది. ఈ చట్టం దక్షిణ కొరియా సమాజంలో టాటూలపై ఉన్న అపోహలను తొలగించి కళగా గుర్తించే దిశగా వేసిన అతిపెద్ద అడుగు. కళాకారుల జీవితాల్లో వెలుగు…దక్షిణ కొరియాలో టాటూలు వేయడం ఎప్పటి నుంచో నిషేధం….

Read More

సీట్ల నై’వైద్యం’… ‘నాడి’ ప్రశ్నార్థకం – కొత్తగా 5000 పీజీ… 5023 ఎంబీబీఎస్ సీట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో వైద్య విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచేందుకు ఆమోదం లభించింది. మారుమూల ప్రాంతాల్లో వైద్య నిపుణుల కొరతను ఈ సీట్ల పెంపు తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే వైద్య విద్యలో నాణ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో కేంద్రం…

Read More

అభిమానంతో కోట్ల వ్యాపారం – ఫ్యాన్స్ టిక్కెట్లే… పవన్ కల్యాణ్ కు కోట్లు

సహనం వందే, హైదరాబాద్:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా ఇప్పుడు అభిమానం, వ్యాపారం మధ్య చిక్కుకుంది. కేవలం అభిమానుల క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుని భారీ మొత్తాలను జేబులో వేసుకుంటున్నారని సినీ వర్గాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. ఈ సినిమాకు పవన్ ఏకంగా 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని వస్తున్న వార్తలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. 250 కోట్ల రూపాయల బడ్జెట్‌లో దాదాపు అటు ఇటుగా సగం పవన్ రెమ్యునరేషనే…

Read More

రక్తచరిత్రకు నేతల తహతహ – గతంలో జగన్ ‘రప్పా రప్పా’ ఫ్లెక్సీ వివాదం

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:జనాన్ని రెచ్చగొట్టడానికి మన నేతలు కత్తులు వాడుతున్నారు. పరోక్షంగా నెత్తుటి రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది. సినిమాల్లోనూ నిషేధించాల్సిన కత్తుల నెత్తురు చిత్రాలను… బయట కూడా ప్రదర్శించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలో వైసీపీ కార్యకర్తలు పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగును ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడాన్ని అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మొన్న హైదరాబాదులో జరిగిన…

Read More

‘షీ’ని వదిలేసిన ‘టీమ్స్’ – షీ టీమ్స్ ఉన్నా మహిళల భద్రత సున్నా

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నగర శివారులోని రాజేంద్రనగర్‌లో జరిగిన దారుణ ఘటన నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కనీసం మానవత్వం కూడా లేకుండా కొందరు మృగాలుగా మారి ఒక మహిళను అత్యంత క్రూరంగా హతమార్చారు. ఈ ఘటన సమాజాన్ని కలవరపెట్టడంతోపాటు పోలీసుల పనితీరుపై కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. షీ టీమ్స్ ఏర్పాటు చేసినప్పటికీ మహిళల భద్రత ప్రశ్నార్ధకంగానే ఉంది. ఘోరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడమే తమ గొప్పతనంగా…

Read More