కొకైన్ మత్తులో ‘ఆసుపత్రి’ మాజీ…

సహనం వందే, హైదరాబాద్: ప్రముఖ ఒమేగా హాస్పిటల్స్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) నమ్రతా చిగురుపాటి (34) ఏకంగా వాట్సాప్ ద్వారా రూ. 5 లక్షల విలువైన కొకైన్ కొనుగోలు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనతో ఉన్నత వర్గాల్లో డ్రగ్స్ ఎంతలా పాతుకుపోయిందో మరోసారి బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో ముంబైకి చెందిన డ్రగ్ సరఫరాదారుడు వంశ్ ధక్కర్‌కు సహకరిస్తున్న బాలకృష్ణ (రాంప్యార్ రామ్) అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్…

Read More

బంగ్లాదేశ్ లో నియంతృత్వం

సహనం వందే, ఢాకా: బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం! తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై ఉక్కుపాదం మోపింది. పార్టీ కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చాత్రా లీగ్‌పై ఉగ్రవాద ముద్ర…అవామీ లీగ్ విద్యార్థి విభాగమైన చాత్రా లీగ్‌ను గతంలోనే ఉగ్రవాద సంస్థగా…

Read More

సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డికి సంఘీభావం

సహనం వందే, హైదరాబాద్: సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షి జర్నలిస్టులు, ఇతర మీడియా ప్రతినిధులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆ సంస్థ తీవ్రంగా ఆరోపిస్తోంది. సాక్షి మీడియా వర్గాల ప్రకారం… పోలీసులు ఎటువంటి సెర్చ్ వారెంట్ చూపకుండానే…

Read More

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 ప్రారంభం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో మిస్ వరల్డ్ 2025 పోటీలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళా ప్రదర్శనల మధ్య ఈ పోటీలు ప్రారంభమైనట్లు ముఖ్యమంత్రి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. 110 దేశాల ప్రతినిధుల ప్రదర్శనతెలంగాణ సంప్రదాయ కళలు, పోటీదారుల పాశ్చాత్య కళల మేళవింపుతో మిస్ వరల్డ్…

Read More

తెలంగాణలో జపానీస్ భాష

సహనం వందే, హైదరాబాద్: ఇటీవల జపాన్ దేశ పర్యటన సందర్భంగా తెలుసుకున్న విషయాల మేరకు ఆ దేశానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చడానికి వీలుగా తెలంగాణలో జపనీస్ భాషను నేర్పించాలని సంకల్పించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని స్పష్టం చేశారు. సామాజిక న్యాయంతో పాటు ఇతర అంశాల్లో తెలంగాణ మాడల్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాల్సిన పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. బెంగుళూరు…

Read More

‘అందం’పై యుద్ధమేఘం

సహనం వందే, హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజలు ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారు. భారత సైన్యం సరిహద్దుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా శత్రువును ఎదుర్కొంటున్న సమయంలో, అందాల పోటీల్లో ఆనందించే పరిస్థితి దేశంలో లేదని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ‘మన జవాన్లు దేశం కోసం పోరాడుతుంటే, హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించడం జాతీయ మనోభావాలను గాయపరుస్తుంద’ని ఒకరు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోటీలు కొనసాగితే దేశ ఐక్యతకు భంగం కలిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు…

Read More

ఆయిల్ పా(షే)మ్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష ఎకరాల సాగు లక్ష్యంలో ఇప్పటివరకు సాధించినది కేవలం 40,247 ఎకరాలు మాత్రమే. అంటే 40 శాతం మాత్రమే. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ సంస్థతోపాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. ఏ ఒక్క సంస్థ కూడా…

Read More

భారత్ కు అమెరికా… పాక్ కు చైనా

సహనం వందే, హైదరాబాద్: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ పై దాదాపు యుద్ధం మొదలైనట్లే. చారిత్రాత్మకంగా అలీన విధానాన్ని అనుసరించిన భారత్, ఇప్పుడు అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రష్యా నుంచి ఆయుధ కొనుగోళ్లను తగ్గించింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తర్వాత అమెరికా వ్యూహాత్మక ప్రాధాన్యతను కోల్పోయిన పాకిస్తాన్, ఇప్పుడు చైనాపై ఆధారపడుతూ తన సైనిక అవసరాలను తీర్చుకుంటోంది. భారత్ ఆయుధ వ్యూహంలో మార్పు…భారత్ గతంలో రష్యాపై ఆధారపడగా, ఇప్పుడు…

Read More

అత్యవసర సర్వీసు ఉద్యోగుల సెలవులు రద్దు

సహనం వందే, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశ సైన్యానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని స్పష్టం చేశారు. కీలక ఆదేశాలు:

Read More

ఉగ్రవాదంపై కేంద్రానికి సిపిఐ మద్దతు

సహనం వందే, హైదరాబాద్: ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఉగ్రవాదానికి కులం, మతం, దేశం లేదని, పాకిస్తాన్ పాలకులు, ఉగ్రవాదులు కలిసి భారత్‌లో నరమేధం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, దీనికి సరైన గుణపాఠం చెప్పాలని కూనంనేని డిమాండ్ చేశారు. మావోయిస్టులపై ఎన్‌కౌంటర్లు ఆపాలి…మావోయిస్టులను…

Read More