
మార్క్ ఫెడ్ లో జాగీర్దార్లు
సహనం వందే, హైదరాబాద్: మార్క్ ఫెడ్ లో కొందరు ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయారు. దీంతో ఆయా విభాగాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ విభాగాలను తమ సొంత జాగీరులా భావిస్తున్నట్లు తోటి ఉద్యోగులే మండిపడుతున్నారు. వారి పోస్టుల్లోకి ఇతరులను తీసుకురావాలన్న ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పై స్థాయి అధికారులను మాయ చేసి తమ విభాగాలను సామంత రాజ్యాలుగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారిని కదపడానికి ఎవరూ సాహసించడం లేదు. ఐదారేళ్లుగా తిష్ట వేసిన…