పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ నోటి దురుసు

సహనం వందే ఒంగోలు:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నోటి దురుసు ప్రదర్శించారు.‌ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. విమర్శలు హద్దులు దాటి పోవడం పరాకాష్ట. నారాయణ సహజంగానే తెగించి ఇష్టరాజ్యంగా మాట్లాడుతారన్న విమర్శలు ఉన్నాయి. సోమవారం ఒంగోలులో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర మహాసభలో నారాయణ ప్రసంగించారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్…

Read More

18 వేల ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణం – ఈడీ దర్యాప్తులో వెలుగులోకి అక్రమాలు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా వైద్య విద్యలో జరిగిన భారీ కుంభకోణం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఎన్ఆర్ఐ కోటా పేరుతో నకిలీ పత్రాలతో వేలాది మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను దక్కించుకున్నట్లు తాజా దర్యాప్తులో బయటపడింది. ఈ కుంభకోణంలో దాదాపు 18 వేల మంది విద్యార్థులు ఫోర్జరీ సర్టిఫికెట్లతో వైద్య కళాశాలల్లో చేరినట్లు తేలింది. ఈ దారుణంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టి ఈ మోసాన్ని బట్టబయలు చేసింది. నకిలీ పత్రాలతో దందా…వైద్య కళాశాలల్లో…

Read More

అధికారుల తీరుతో అన్నదాత బలి – నాడు రుణమాఫీ… నేడు యూరియా

సహనం వందే, హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రభుత్వంలో ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి వ్యవసాయశాఖలో ఎవరైనా కోవర్టులుగా పనిచేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కొందరు రాజకీయ పండితులు. అప్పట్లో రుణమాఫీ విషయంలోనూ… ఇప్పుడు యూరియా కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ యంత్రాంగ నిర్లక్ష్యమే నిదర్శనమని చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉంటూ సర్కారును ఇరుకున పెట్టే విధంగా కొందరు వ్యవసాయ అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దలతో కలిసి…

Read More

సొంత గడ్డపై గడ్డుకాలం – గుజరాత్ నుండి రెండేళ్లు బహిష్కరణ

సహనం వందే, న్యూఢిల్లీ:కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోహ్రబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో తన రెండేళ్ల గుజరాత్ బహిష్కరణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని న్యాయమూర్తి ఆఫ్తాబ్ అలం ఆందోళన వ్యక్తం చేయడంతో తానే స్వచ్ఛందంగా రాష్ట్రం విడిచి వెళ్లానని షా స్పష్టం చేశారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పాలనలో హోం మంత్రిగా ఉన్న షా… తన పదవీ ప్రభావం సాక్ష్యాలపై…

Read More

వైద్య అనుబంధ వృత్తుల కౌన్సిల్ ఏర్పాటుకు డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మినహా వైద్య రంగానికి చెందిన 57 రకాల అనుబంధ వృత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2021 మార్చిలో వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర కౌన్సిల్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. చివరికి సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర కౌన్సిల్స్‌ను…

Read More

‘సీఎంలు వాళ్లు.. రోడ్లపై నేను’ – వి. హనుమంతరావు భావోద్వేగం

సహనం వందే, కరీంనగర్:‘నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్, చంద్రబాబు నా దగ్గరే పని చేశారు. వాళ్లు సీఎంలు అయ్యారు. నేను మాత్రం రోడ్లమీద తిరుగుతున్నాన’ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు రెండుసార్లు వచ్చినప్పటికీ ఆ పదవి తీసుకోలేదని చెప్పారు. సోమవారం కరీంనగర్ జిల్లాలో జరిగిన జనహిత పాదయాత్రలో చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ మారని నేతపదవుల కోసం పార్టీలు మారిన నేతలు చాలామంది ఉన్నారని,…

Read More

ఎంఎన్ జే డైరెక్టర్ పై వేటు – డాక్టర్ శ్రీనివాసులుకు డీవోపీటీ షాక్!

సహనం వందే, హైదరాబాద్‌:ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులుపై వేటు పడింది. ఆయనను తిరిగి వెనక్కి పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలన విభాగం తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ఏపీకి కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలంటూ శ్రీనివాసులు చేసిన అభ్యర్థనను కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వశాఖ (డీవోపీటీ) తిరస్కరించింది. 2017 జనవరి 17న జారీ చేసిన ఆ ఉత్తర్వులు…

Read More

తెలుగు భాషపై మార్వాడీ ద్వేషం – దశాబ్దాలైనా స్థానిక భాష మాట్లాడని జాతి

సహనం వందే, హైదరాబాద్:శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని… సొంత తెలివి తేటలతో వ్యాపారాలు చేస్తున్నామని చెప్పుకుంటున్న మార్వాడీలు… ఇన్నేళ్ల కాలంలో తెలుగు భాష ఎందుకు నేర్చుకోలేదు? గ్రామాలు మొదలు హైదరాబాద్ వరకు ఎక్కడ చూసినా వాళ్ళెవరూ తెలుగు నేర్చుకోరు… మాట్లాడరు. వాళ్ల కోసం మనం హిందీ నేర్చుకోవాలి తప్ప… మార్వాడీలు మాత్రం తెలుగు నేర్చుకోరు. మనకు వచ్చినా రాకున్నా వాళ్ల భాషలోనే మాట్లాడాలి. తెలుగు భాషపై మార్వాడీ ద్వేషం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్థానిక ప్రజల భాషా,…

Read More

ప్రజా నాయకుడి శరీరమూ ప్రజలకే అంకితం – మెడికల్ కాలేజీకి సురవరం భౌతికకాయం

సహనం వందే, హైదరాబాద్:సిపిఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి రెడ్ ఆర్మీ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. ఆయన భౌతికకాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో గౌరవించింది. అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు, నాయకులు పాల్గొని నివాళులర్పించారు. సుధాకర్ రెడ్డి చివరి కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. అంతిమయాత్రలో ముందు పోలీసులు అధికారిక గౌరవ వందనం సమర్పించగా, ఆ తర్వాత…

Read More

మా దేశం… మా కోసం – టూరిస్ట్ గోబ్యాక్ – యూరోపియన్ల నినాదం

సహనం వందే, యూరప్:ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్థానిక ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ‘మా దేశం మా కోసమే’నని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. టూరిస్టుల పేరుతో తమ అందమైన నగరాలను నాశనం చేస్తున్నారని… తమ జీవనశైలిని, సంస్కృతిని, ఉనికిని ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఆదాయ వనరుగా భావించిన పర్యాటకం ఇప్పుడు యూరప్‌లోని అనేక నగరాలకు సమస్యగా మారింది. పర్యాటకుల తాకిడి పెరిగి స్థానిక సంస్కృతి, జీవనశైలి దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ బార్సిలోనా నుంచి…

Read More