
కాంగ్రెస్ తెచ్చిన కరువు – తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శ
సహనం వందే, సూర్యాపేట: “నీళ్ల మంత్రి నల్లగొండలోనే ఉన్నా చుక్క నీరు తేలేకపోవడం సిగ్గుచేటు” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సూర్యాపేటలో గురువారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండిపోవడానికి కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణం” అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేరు…