ఉస్మానియా ప్రిన్సిపల్ గా రాజారావు

సహనం వందే, హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా డాక్టర్ రాజారావు నియమితులయ్యారు.‌ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ గా ఆయన పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్ గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించారు.

Read More

ఉగ్రదాడికి అంతర్గత సాయంపై అనుమానాలు

సహనం వందే, కోల్ కతా: కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి దేశీయంగా ఎవరైనా సాయం చేశారా అన్న అనుమానాలు ఉన్నాయని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్‌చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన కోల్ కతాలో పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఇంత పెద్ద సంఖ్యలో చొరబాటుదారులు ఎలా చొచ్చుకురాగలిగారనే దానిపై సమగ్రమైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఎక్కడో పెద్ద లోపం జరిగింది. ఇంత మంది చొరబాటుదారులు ఎలా లోపలికి…

Read More

ఉగ్రదాడిపై ముస్లింల ఆగ్రహజ్వాల

సహనం వందే, హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్‌లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. శుక్రవారం మక్కా మసీదు వద్ద జరిగిన జుమా నమాజ్‌లో పాల్గొన్న ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. నమాజ్ అనంతరం వారు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ ముర్దాబాద్, హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ…

Read More

ఇండియా చుట్టూ శత్రువలయం

సహనం వందే, ఢిల్లీ: మన దేశం చుట్టూ శత్రుదేశాల కోరలు చాస్తున్నాయి. పశ్చిమాన పాకిస్తాన్ తన ఉగ్రవాద చర్యలతో నిత్యం మనల్ని రెచ్చగొడుతోంది. ఉత్తరాన చైనా తన దుష్ట పన్నాగాలతో సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతోంది. తూర్పున బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లు ఆగడం లేదు. దక్షిణాన శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే… ఆఫ్ఘనిస్తాన్‌లోని అల్లకల్లోల పరిస్థితులు మనకు నిత్యం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ శత్రుదేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మనపై కుట్రలు పన్నుతుండటం…

Read More

కీరవాణీ… హిందువులనే అవమానిస్తావా?

బ్యాన్ చేయాలంటూ డిమాండ్! సహనం వందే హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ‘పాడుతా తీయగా’ అనే ఒక సింగింగ్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ప్రవస్తి ఆరాధ్య ఆయనపై బాడీ షేమింగ్ ఆరోపణలు చేయగా, ఇప్పుడు కీరవాణి గతంలో చేసిన ఒక వ్యాఖ్య వైరల్ కావడంతో ఆయనను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలతో దుమారం… ‘పాడుతా తీయగా’ 25వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న ప్రవస్తి ఆరాధ్య,…

Read More

అమెరికా కోసమే ఉగ్రవాదులకు సాయం

సహనం వందే ఇస్లామాబాద్: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన షాకింగ్ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. గత మూడు దశాబ్దాలుగా తమ దేశం అమెరికా ఆదేశాల మేరకే ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చిందని ఆయన బహిరంగంగా అంగీకరించడం సంచలనం కలిగిస్తోంది. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురితమైన కథనం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్కై న్యూస్‌ ముఖాముఖిలో వెల్లడి… ఖ్వాజా ఆసిఫ్ స్కై న్యూస్ యాంకర్ యాల్డా హకీమ్‌తో…

Read More

హైదరాబాద్‌లో పాకిస్తాన్ పేర్లతో బిజినెస్

సహనం వందే, హైదరాబాద్: కాశ్మీర్‌లో 26 మంది అమాయక భారతీయుల ప్రాణాలను బలిగొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరిహద్దుల్లో నెత్తురు ఏరులై పారుతుంటే… మన హైదరాబాద్ నగరంలో మాత్రం పాకిస్తాన్ నగరాల పేర్లతో వ్యాపారం యథేచ్ఛగా కొనసాగడం అత్యంత సిగ్గుచేటు. కరాచీ బేకరీ, పెషావర్ హోటల్ వంటి ప్రసిద్ధ సంస్థలు తమ పేర్లను ఇప్పటికీ మార్చకపోవడం వారి దేశభక్తి రాహిత్యాన్ని తేటతెల్లం చేస్తోంది. శత్రుదేశపు నగరాల పేర్లను బ్రాండ్‌లుగా వాడుకోవాల్సిన దుస్థితి…

Read More

రాహుల్ – హిండెన్‌బర్గ్ ల ఉమ్మడి ఆపరేషన్

సహనం వందే, ఢిల్లీ: ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా ఆధారిత షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌తో చేతులు కలిపి, భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుడు సామ్ పిట్రోడా అమెరికాలోని హోమ్ సర్వర్‌లను హ్యాక్ చేయడం ద్వారా ఈ కుట్ర బట్టబయలైనట్లు స్పుత్నిక్ ఇండియా నివేదిక వెల్లడించింది. హిండెన్‌బర్గ్…

Read More

పాకిస్తాన్ గగనతలం మూసివేత

సహనం వందే, ఢిల్లీ: పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానాలకు పూర్తిగా మూసివేయడంతో భారత విమానయాన సంస్థలు కొత్త చిక్కుల్లో పడ్డాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య వల్ల భారతీయ విమానయాన సంస్థలు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా, ఇండిగో వంటివి తమ అంతర్జాతీయ విమాన మార్గాలను మార్చుకోవలసి వస్తోంది. దీని కారణంగా విమాన ప్రయాణ సమయం పెరగడంతో పాటు…

Read More

యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఖతం!

సహనం వందే, హైదరాబాద్: 1993లో అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ రూపొందించిన అత్యంత రహస్యమైన డాక్యుమెంట్స్ ఇప్పు డు కలకలం రేపుతున్నాయి. భారత్-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం సంభవిస్తే పాకిస్తాన్ కేవలం సైనిక పరంగానే కాదు… దేశంగా కూడా నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆ డాక్యుమెంట్స్ 30 ఏళ్ల క్రితమే హెచ్చరించాయి. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సీక్రెట్ రిపోర్ట్స్ బయటకు రావటం సంచలనంగా మారింది. మరి…

Read More