రైల్వే సమస్యలపై ఎంపీ గళం -ప్రజల గొంతుకైన ఎంపీ అప్పలనాయుడు

సహనం వందే, భువనేశ్వర్:ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్ కమిటీ సమావేశం వేదికగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజల గళాన్ని బలంగా వినిపించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల రైల్వే సమస్యలను జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ముందు వివరించారు. గత పార్లమెంట్ సమావేశాల్లోనూ తాను ఈ సమస్యలను లేవనెత్తినట్లు గుర్తు చేస్తూ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం భువనేశ్వర్ లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే సమావేశంలో…

Read More

ఇంటి గుట్టు… రహస్యం రట్టు – ఏపీలో ఫ్యామిలీ కార్డులకు శ్రీకారం

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఫ్యామిలీ కార్డు సెగలు రేపుతోంది. ప్రజల సంక్షేమం కోసం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ కార్డులను తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెప్పుతోంది. అయితే దాని వెనుక ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి నిఘా పెట్టే కుట్ర ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. గతంలో జగన్ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటి సర్వేల పేరుతో ప్రజల ఆస్తులు, ఆదాయ వివరాలు సేకరించి రాజకీయ లబ్ధికి వాడుకున్నారని వచ్చిన విమర్శల…

Read More

ముఖ్యమంత్రి వినాయక్’రెడ్డి’ – రేవంత్ రెడ్డి వేషధారణతో గణపతి

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లోని ఆఘాపురాలో ఏర్పాటు చేసిన ఒక వినాయక మండపం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మండపంలో వినాయకుడి విగ్రహం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేషధారణలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్యాంటు, షర్టు, బూట్లు, మెడలో కండువా ధరించి ఉన్న గణనాథుని రూపం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాజకీయ నేతపై అభిమానం ఇక్కడి నిర్వాహకులను ఈ విధమైన…

Read More

వాట్సాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్ – ఢిల్లీ పౌరులకు సర్కారు కొత్త సౌకర్యం

సహనం వందే, న్యూఢిల్లీ:ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్ ద్వారానే ఇంటి నుంచి మ్యారేజ్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ముఖ్యమైన ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్‌ఫాం ప్రజల సమయాన్ని ఆదా చేసి, వారి జీవితాలను మరింత సులభతరం చేస్తుంది. ఈ కొత్త సౌలభ్యం వల్ల ప్రభుత్వ సర్వీసులు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. ఎలా పని చేస్తుంది?ఈ సరికొత్త విధానం చాలా సులభంగా…

Read More

అజ్ఞాత దాతల అవినీతి ముసుగు – గుజరాత్‌లో వేల కోట్ల సీక్రెట్ డొనేషన్స్

సహనం వందే, న్యూఢిల్లీ:గుజరాత్‌లో జరిగిన భారీ అక్రమ ఆర్థిక లావాదేవీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. 2019-24 మధ్య కాలంలో గుజరాత్‌లోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు… సంస్థలు ఏకంగా రూ. 4,300 కోట్ల భారీ విరాళాలు స్వీకరించాయని ఒక మీడియా నివేదికను ఉటంకిస్తూ ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం ఎవరిది? ఏ ఉద్దేశంతో ఇచ్చారు? ఎవరికి చేరాయి? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల…

Read More

జీరో యూరియా దందా… వ్యాపారుల మాయ- ఫ్యాక్టరీల నుంచి నేరుగా తెచ్చి వ్యాపారం

సహనం వందే, హైదరాబాద్:రైతుకు యూరియా కొరత నిద్రపట్టనివ్వడం లేదు. వ్యవసాయ పనులను పక్కనపెట్టి గంటల తరబడి ఎరువుల దుకాణాల ముందు క్యూలో నిల్చోవడం నిత్యకృత్యమైపోయింది. ఈ దుస్థితిని కొందరు డీలర్లు, వ్యాపారులు అవకాశంగా తీసుకుని యూరియా బ్లాక్ దందాకు తెరతీశారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ. 270 విలువ గల 45 కిలోల యూరియా బస్తాను కొన్నిచోట్ల రూ. 500 పైగా అమ్ముతున్నారు. ఒక బస్తా కావాలంటే ఇతర సరుకులను కూడా కొనాలనే షరతులు, క్యాష్ అండ్ క్యారీ…

Read More

నెంబర్ అడగొద్దు… కస్టమర్స్ చెప్పొద్దు – ఇక మొబైల్ నెంబర్లు అడగడం నేరమే!

సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో డిజిటల్ యుగం విస్తరిస్తున్న కొద్దీ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో అమలులోకి రానున్న నూతన డేటా రక్షణ చట్టం ప్రకారం రిటైల్ దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారుల మొబైల్ నెంబర్లను అడగడం నేరంగా పరిగణించబడుతుంది. ఇప్పటివరకు దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్ ప్రక్రియలో మొబైల్ నెంబర్లు సేకరించడం ఒక…

Read More

వెలుగులోకి నటి చీకటి కోణం – మళయాళ లక్ష్మీ మీనన్‌పై కిడ్నాప్‌ కేసు

సహనం వందే, కోచి:సినిమా తెరపై అందమైన పాత్రలతో యువతను అలరించిన యువ నటి లక్ష్మీ మీనన్‌ పై కిడ్నాప్‌, దాడి కేసు నమోదవ్వడం సినీ లోకాన్ని కుదిపేసింది. పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక నటి ఇలాంటి తీవ్రమైన ఆరోపణల్లో చిక్కుకోవడం పరిశ్రమ వర్గాలను, ఆమె అభిమానులను విస్మయానికి గురిచేసింది. కొచ్చిలోని ఒక ఐటీ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేయడంతో ఈ వివాదం ఒక్కసారిగా సంచలనంగా మారింది. సినిమాలకు…

Read More

సిగ్నల్ ట్యాంపరింగ్ తో రైలు ఆపి దోపిడీ – నాగర్‌సోల్‌-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన

సహనం వందే, గుంటూరు:దొంగలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రైలు సిగ్నల్ వ్యవస్థనే ట్యాంపరింగ్ చేసి అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇది రైల్వే వ్యవస్థ డొల్లతనానికి నిదర్శనం. గుంటూరు జిల్లాలో అటువంటి సంఘటనే జరిగింది. నాగర్‌సోల్ నుంచి నర్సాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలోని మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి వద్ద దుండగులు సిగ్నల్ వ్యవస్థను ట్యాంపర్ చేశారు. రెడ్ సిగ్నల్ కనిపించడంతో లోకో పైలట్ రైలును 35…

Read More

అపార్ట్‌మెంట్లు డ్రగ్స్ అడ్డాలు – పబ్‌, రిసార్ట్‌, ఫామ్‌హౌస్‌లపై నిఘాతో మార్పు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ మహానగరంలో అపార్ట్‌మెంట్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. గతంలో పబ్‌లు, రిసార్ట్‌లు, ఫామ్‌హౌస్‌లలో చీకటి సామ్రాజ్యాన్ని నడిపించిన నేరగాళ్లు… ఇప్పుడు తమ కార్యకలాపాలకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పోలీసుల నిఘా కళ్ళ నుంచి తప్పించుకోవడానికి సర్వీస్ అపార్ట్‌మెంట్లు, గెస్ట్ హౌస్‌లను అడ్డాగా మార్చుకుని అక్కడే డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కొండాపూర్‌లో జరిగిన సంఘటన ఈ ప్రమాదకరమైన పోకడకు అద్దం పట్టింది. పోలీసులు ఒక సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి రేవ్ పార్టీ…

Read More