కాళేశ్వరంలో సునామీ – సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వం నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. లక్ష కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో అట్టుడికిపోతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా నిర్ణయించడం సంచలనం రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి లోతుగా దర్యాప్తు జరగాలన్న ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీని తీవ్ర…

Read More

వ్యవసాయ విస్త’రణం’అధికారులు – ఏఈఓల ప్రమోషన్ల చిక్కుముడి

సహనం వందే, హైదరాబాద్:వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ) పదోన్నతులు అంతులేని చిక్కుముడిగా మారాయి. వ్యవసాయంలో డిగ్రీ (బీఎస్సీ అగ్రికల్చర్) పూర్తి చేసి నేరుగా ఏఈఓలుగా నియమితులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని గ్రాడ్యుయేట్ ఏఈఓల సంఘం ఆరోపించింది. మరోవైపు కేవలం డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవారు ఇన్-సర్వీస్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి సీనియారిటీని తొక్కేస్తున్నారని ఆ సంఘం మండిపడుతోంది. దీనివల్ల దాదాపు 750 మంది గ్రాడ్యుయేట్ ఏఈఓలు తమ పదోన్నతుల కోసం తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారని…

Read More

ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ – అర్ధరాత్రి నుంచి వైద్య సేవలు బంద్

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆదివారం అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపి వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన 1300 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ పరిణామం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు చేసినందుకు తమకు రావాల్సిన బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని నెట్‌వర్క్ ఆసుపత్రులు చాలా…

Read More

ప్రవక్త బోధ… గోవధ నిషేధ – సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ సంచలనం

సహనం వందే, ముంబై:బాలీవుడ్ లెజెండరీ రైటర్, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతున్నాయి. తమ కుటుంబం ఎప్పుడూ గోమాంసం తినలేదని, తమ ఇంట్లో గోమాంసం వంటకం ఎప్పుడూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ్టి వరకు తమ ఇంట్లో గోమాంసం వండలేదని, చాలా మంది ముస్లింలు అది చవకగా దొరుకుతుందని తింటారని ఆయన అన్నారు. ప్రవక్త మహమ్మద్ బోధనల ప్రకారం ఆవు పాలు తల్లిపాలకు సమానమని,…

Read More

వ్యవసాయ వర్సిటీలో అవినీతి పంట – ఆచార్య ఎన్‌జీ రంగా వీసీపై ఫిర్యాదులు

సహనం వందే, గుంటూరు:ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అవినీతికి నిలయంగా మారిందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయానికి తాత్కాలిక వీసీగా వ్యవహరిస్తున్న వ్యక్తి అక్రమాలకు పాల్పడుతున్నారని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఓ ప్రొఫెసర్‌ స్వయంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు వర్సిటీలో జరుగుతున్న చీకటి కార్యకలాపాలకు అద్దం పడుతున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ పాలక మండలిని విస్మరించి కోరం లేకుండానే రెండు సంవత్సరాలుగా సమావేశాలు నిర్వహిస్తున్నారంటే…

Read More

మోడీ ఇంట్లో ‘సీక్రెట్’ చూశా – విజయనగరం ఎంపీ అప్పలనాయుడు వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజా నాయకుడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని కలలుగన్న ఆయన… ఏకంగా ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంపీ అయిన వెంటనే తిరుపతికి వెళ్లి ప్రసాదం తీసుకొని ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నివాసం వద్దకు చేరుకున్నారు. మోడీ అపాయింట్మెంట్ లేదు. కానీ కలవాలన్న కృతనిశ్చయంతో వెళ్లారు. ఆయన నమ్ముకున్నట్లు మోడీ కలవడానికి అనుమతి లభించింది. ప్రసాదం చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటన అనేకమంది…

Read More

మహారాష్ట్రలో బీసీ కోటా మంటలు – రిజర్వేషన్ల కోసం మరాఠాల ఉద్యమం

సహనం వందే, ముంబై:మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఉద్యమం మరోసారి ఉద్ధృతమైంది. మరాఠా కోటా కోసం పోరాడుతున్న నాయకుడు మనోజ్ జరంగే ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. మరాఠా సామాజిక వర్గానికి సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు తనం (ఎస్‌ఈబీసీ) హోదా కల్పించి, విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షకు వేలాది మంది మరాఠాలు, రైతులు, యువత మద్దతుగా కదులుతున్నారు. జరంగే ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, పోరాటం నుంచి…

Read More

కుర్చీ వదలని ఎంఎన్ జే డైరెక్టర్

సహనం వందే, హైదరాబాద్:ఎంఎన్ జే డైరెక్టర్ శ్రీనివాసులును వెంటనే రిలీవ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఈనెల 26వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటికీ ప్రతిరోజూ ఆయన ఆస్పత్రికి వస్తూనే ఉన్నారు. అంతేకాదు డైరెక్టర్ పోస్టులో విధులు నిర్వహిస్తుండటంపై ఆసుపత్రి వర్గాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తప్పించినా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి యంత్రాంగం ఆయనను ఎందుకు రిలీవ్ చేయడం లేదని…

Read More

స్మిత సబర్’వార్’ – రేవంత్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సెలవు నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఆరు నెలలపాటు చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవడం వెనుక నిజమైన కారణాలు ఏంటనేది అంతుచిక్కడం లేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత లేని పోస్టులు కట్టబెట్టడం, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరిగే సమయంలో సెలవు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో…

Read More

అద్దెకు అమ్మమ్మ… కిరాయికి తాతయ్య – వృద్ధాశ్రమాల్లో బాగోద్వేగాల అమ్మకం

సహనం వందే, ఆగ్రా:ఆగ్రాలోని రామ్‌లాల్ వృద్ధాశ్రమం తెరపైకి తెచ్చిన వృద్ధులను కిరాయికి ఇచ్చే కొత్త పథకం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. ఇది మంచి ఉద్దేశంతో మొదలైందని ఆశ్రమ నిర్వాహకులు ఎంత చెబుతున్నా దీని వెనుక దాగిన చీకటి కోణాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఒంటరి పిల్లలకు కుటుంబ సాంగత్యం, వృద్ధులకు ఆదరణ అనే తీపి మాటలు వెనుక డబ్బు సంపాదన, అక్రమ కార్యకలాపాలు దాగి ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదని, మానవ…

Read More