తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి

– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, మతోన్మాద దాడులు పెరుగుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున న్యాయవాది ఇజ్రాయిల్ హత్య, ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం వంటి ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు కూడా పెరుగుతున్నాయని ఆయన…

Read More

ఎంపీల జీతాల దోపిడీ

పార్లమెంటు సభ్యులకు వేతనాలు పెంపు – 475 మంది ఎంపీలు కోటీశ్వరులు… – ఎంపీల సగటు ఆస్తి రూ. 20 కోట్లు… పెంపుపై మండిపడుతున్న జనం – హెటెరో అధినేత, ఎంపీ బండి పార్థసారథి రెడ్డి ఆస్తి రూ. 5,300 కోట్లు – మరో పార్లమెంటు సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఆస్తి రూ. 2,577 కోట్లు సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో చట్ట సభలకు ఎన్నిక అవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అలా కోట్లకు…

Read More

మార్క్ ఫెడ్ లో ప్రజాధనం లూటీ

రెండేళ్లు జొన్నలు అమ్మని ఫలితంగా రూ. 130 కోట్లు నష్టం – రెండేళ్ల కాలంలో గోదాముల్లో పాడైపోయిన తెల్ల జొన్నలు… అధికారుల నిర్లక్ష్యమే – ఇప్పుడు టెండర్లు పిలవడంతో తక్కువకు కోట్ – కాంట్రాక్టర్ల సిండికేట్… కొందరు అధికారుల సపోర్ట్ సహనం వందే, హైదరాబాద్: రెండేళ్ల క్రితం రైతుల నుంచి కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కి కొన్న తెల్ల జొన్నలు గోదాముల్లో పుచ్చిపోయేలా వదిలేసిన మార్క్‌ఫెడ్, ఇప్పుడు కాంట్రాక్టర్లకు తక్కువ ధరకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2023-24…

Read More

రైతులకు సాయం చేయండి

– ప్రభుత్వానికి జగన్ విజ్ఞప్తి సహనం వందే, అమరావతి: ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన ఆయన.. అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షం, వడగళ్ల, గాలికి 4000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. పార్ణపల్లె, ఏగువపల్లె, కోమటీనూతల, తాతిరెడ్డిపల్లి గ్రామాల్లో 4000 ఎకరాల్లో వర్షానికి అరటి పంటలు దెబ్బతిన్నాయి…..

Read More

అవయవ మార్పిడిలో కొత్త శకం!

మానవ అవయవాలు, కణజాల మార్పిడి చట్టం అమలు – బ్రెయిన్ డెత్ నిర్ధారణకు మరికొందరు స్పెషలిస్టులు… – తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… అక్రమాలకు చెక్ సహనం వందే, హైదరాబాద్: 1994లో ఆమోదించిన మానవ అవయవాల మార్పిడి చట్టానికి 2011లో సవరణలు చేసి, దాన్ని మానవ అవయవాలు, కణజాల మార్పిడి చట్టం (తోట)గా రూపొందించారు. ఈ చట్టం అవయవాలతో పాటు కణజాలాల మార్పిడిని చట్టబద్ధం చేసింది. 2014లో కేంద్రం విడుదల చేసిన నిబంధనలతో దేశంలో 24 రాష్ట్రాలు…

Read More

దక్షిణాది పోరాటంలో ఆంధ్ర ఒంటరి!

డీలిమిటేషన్ ఉద్యమానికి దూరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు – రాజకీయ స్వార్థాలు ప్రజా ప్రయోజనాలను బలిపెడుతున్నాయా? – ఎన్డీఏ కూటమిలో ఉన్నందున చెన్నై సమావేశానికి వెళ్లని టీడీపీ, జనసేన – మరి వైసీపీ అధినేత జగన్ వెళ్లకపోవడంలో ఆంతర్యం ఏంటి? – రాష్ట్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పార్టీల నేతలు… విధానాలు సహనం వందే, హైదరాబాద్: డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తున్న ఈ కీలక సమయంలో, తమిళనాడు, కర్ణాటక, కేరళ,…

Read More

డబ్బు కోసం గడ్డి

సినీ తారలు, సెలబ్రిటీల పోకడ – బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లతో బాధ్యతారాహిత్యం – ఫలితంగా అనేకమంది యువత ఆత్మహత్య – గుట్కాలు, మద్యం బ్రాండ్లకు కూడా సినిమా తారల ప్రచారంపై విమర్శలు సహనం వందే, హైదరాబాద్ సినిమా తారలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు.. వీళ్లంటే సామాన్యులకు ఎంతో అభిమానం. తెరపై కనిపించే హీరోలను ఆదర్శంగా తీసుకుని పాటించేవారు అనేకమంది ఉంటున్నారు. అయితే డబ్బుల కోసమో, మరే ఇతర కారణాల వల్లో సెలబ్రిటీలు చేసే తప్పుడు వాణిజ్య ప్రకటనలు ప్రజలను…

Read More

సన్‌రైజర్స్ విజయం

– రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో ఘన విజయం సహనం వందే, హైదరాబాద్: ఐపీఎల్ 2025 సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ఆరంభించింది. హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో రాజస్థాన్ 242/6 పరుగులకు…

Read More

డీలిమిటేషన్‌పై దుష్ప్రచారం

 కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల నిజస్వరూపం బహిర్గతం – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపణ సహనం వందే, హైదరాబాద్: డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం వారి అవకాశవాద రాజకీయాలను బట్టబయలు చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్ లేదా కేబినెట్‌లో ఎటువంటి చర్చ జరగనప్పటికీ, ఈ పార్టీలు దక్షిణాదికి…

Read More

వడగళ్ల వర్షంతో 11 వేల ఎకరాల్లో పంట నష్టం

– వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల వెల్లడి సహనం వందే, హైదరాబాద్: రెండు రోజులుగా తెలంగాణలో వడగళ్ల వర్షం, ఈదురు గాలుల వల్ల తెలంగాణలో 13 జిల్లాల్లో 11 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నష్టంపై గ్రామాల వారీగా సర్వే చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఏకకాలంలో రుణమాఫీ చేశాం… ఆర్థిక అస్తవ్యస్తత ఉన్నప్పటికీ, రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ….

Read More