స్కూల్ మోదీ… కాలేజీ చంద్రబాబు..ఉద్యోగం రాహుల్ గాంధీ

సహనం వందే, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆదివారం హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ‘ప్రజలే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్, తన రాజకీయ జీవితంలో ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలతో తనకున్న అనుబంధాన్ని ఆసక్తికరంగా వెల్లడించారు. ‘స్కూల్ మోదీ… కాలేజీ చంద్రబాబు దగ్గర చదివాను. ఇప్పుడు రాహుల్…

Read More

తిరుమలేశుని సేవలో ఆయిల్ ఫెడ్

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ ఇద్దరి కబంధహస్తాల్లో చిక్కుకుపోయింది. వారిద్దరే ఆ సంస్థను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆయిల్ ఫెడ్ లోని కీలక విభాగాల్లో పాగా వేశారు. దీంతో వారు ఆడింది ఆట… పాడింది పాటగా మారింది. వారు ఏం చెప్తే అది జరుగుతుంది. వారిద్దరి సేవలో ఆయిల్ ఫెడ్ సంస్థ పునీతమవుతుంది. వారే తిరుమలేశ్వర్ రెడ్డి… జొన్న సత్యనారాయణ. తిరుమలేశ్వర్ రెడ్డి ఫైనాన్స్, కన్జ్యూమర్ మార్కెటింగ్, బల్క్ మార్కెటింగ్, ఓపీఎస్ వంటి విభాగాలకు మేనేజర్…

Read More

డాక్టర్ కే చేతబడి

సహనం వందే, హైదరాబాద్: ఆయన ఒక డాక్టర్… హైదరాబాదు నగరంలో మంచి ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. ఆయన ఆస్తులపై ఉప్పల్ ప్రాంతానికి చెందిన శివస్వామి అనే చేతబడి చేసే వ్యక్తి కన్నేశాడు. ఇంకేం రంగంలోకి దిగాడు. ‘నువ్వు నాకు గత జన్మలో సొంత అన్నవి. మనిద్దరం ఒక దేశానికి రాజులం. నాకున్న అతీంద్రియ శక్తులతో ఈ విషయాన్ని గుర్తించాను’ అంటూ మాయ మాటలు చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే, ‘నువ్వు మామూలు డాక్టర్…

Read More

యూరియా గండం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. సకాలంలో తెప్పించడంలో వ్యవసాయశాఖ విఫలమైంది. దాహం వేసినప్పుడు బావిని తవ్వినట్లుగా… ఇప్పుడు యూరియా కావాలంటూ హడావుడి చేస్తున్నారు. ముందుగానే కేంద్రం వద్దకు వెళ్లి ప్రయత్నించాల్సింది పోయి… ఇప్పుడు తమ తప్పును ఇతరులపై నెట్టే విధంగా కేంద్రం వద్ద పంచాయతీకి సిద్ధమయ్యారు. సీజన్ కి ముందు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంలో ఎందుకు వైఫల్యం చెందినట్లు? సీజన్ జోరు మీద ఉన్న సమయంలో ఇప్పుడు హడావుడి చేస్తే…

Read More

మార్క్ ఫెడ్ లో జాగీర్దార్లు

సహనం వందే, హైదరాబాద్: మార్క్ ఫెడ్ లో కొందరు ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయారు. దీంతో ఆయా విభాగాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ విభాగాలను తమ సొంత జాగీరులా భావిస్తున్నట్లు తోటి ఉద్యోగులే మండిపడుతున్నారు. వారి పోస్టుల్లోకి ఇతరులను తీసుకురావాలన్న ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పై స్థాయి అధికారులను మాయ చేసి తమ విభాగాలను సామంత రాజ్యాలుగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారిని కదపడానికి ఎవరూ సాహసించడం లేదు. ఐదారేళ్లుగా తిష్ట వేసిన…

Read More

మార్క్ ఫెడ్ లో ఆ ఒక్కడు!

సహనం వందే, హైదరాబాద్: మార్క్ ఫెడ్ సంస్థలో రైతులకు చేస్తున్న సాయం కంటే కొందరు అధికారులు మేయడమే ఎక్కువగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయినా పర్వాలేదు… కానీ తమ జేబులు నింపుకునేలా కొందరు అధికారులు పావులు కదుపుతుంటారు. మార్క్ ఫెడ్ సంస్థను తమ సొంత జాగీరులా భావిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ సంస్థలో సాధారణ కింది స్థాయి అధికారి కూడా ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులకు ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తుంటారు. ఒక…

Read More

రూ.300 కోట్ల రియల్ ఎస్టేట్ కుంభకోణం

జయత్రి గ్రూప్స్‌ పేరుతో మోసం సహనం వందే, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జయత్రి గ్రూప్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో సుమారు రూ.300 కోట్ల స్కామ్‌కు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2023 జనవరిలో పోలీసులు సంబంధిత డైరెక్టర్ ను అరెస్టు చేసినప్పటికీ, బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ పరారీలో ఉన్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మధ్యతరగతి కుటుంబాలను, రిటైర్డ్ ఉద్యోగులను ఆర్థికంగా నిలువునా దోచుకున్న సంఘటనగా నిలిచింది. ప్రీ-లాంచ్…

Read More

మార్క్ ఫెడ్ కు రూ. 93 కోట్ల నష్టం

సహనం వందే, హైదరాబాద్: మార్క్ ఫెడ్ అధికారుల నిర్వాకం వల్ల ఆ సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. కొందరు అధికారులు వ్యాపారులతో సిండికేట్ కావడం వల్లనే నష్టాలు మూటగట్టుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అందుకు తాజాగా జొన్నల విక్రయంలో జరిగిన లావాదేవీలే నిదర్శనం. గత ఏడాది రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్నలను వ్యాపారులకు అమ్మడం ద్వారా మార్క్ ఫెడ్ కు ఏకంగా రూ. 93 కోట్లు నష్టం జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది జొన్నల మద్దతు…

Read More

తెలంగాణను ప్రపంచ అగ్రగామిగా నిలుపుతాం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహనం వందే, హైదరాబాద్: తెలంగాణను 2047 నాటికి ప్రపంచ అగ్రగామిగా నిలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణను ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. ఈ మహత్తర లక్ష్య సాధనకు…

Read More

దేశంలో మళ్లీ కరోనా అలజడి

సహనం వందే, ఢిల్లీ: అంతరించిపోయిందనుకున్న కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. కొత్త రూపంలో తిరిగొచ్చి దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్లను గుర్తించిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. నిపుణుల హెచ్చరిక…భారతీయ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు ఎన్‌బి.1.8.1, ఎల్ఎఫ్.7 అనే రెండు కొత్త కరోనా వేరియంట్లను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే జేఎన్.1 రకం కేసులు నమోదయ్యాయి. ఈ…

Read More