బీసీ కోటా… కోర్టుల్లో రగడ – 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో సవాల్

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ న్యాయపరమైన జోక్యం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గత నెల 29న ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్…

Read More

పరువునష్టం నీడలో పగ – డిఫమేషన్ చట్టంతో స్వేచ్ఛకు సంకెళ్లు

సహనం వందే, న్యూఢిల్లీ:పరువు నష్టం చట్టం (డిఫమేషన్ లా) ఒక వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి బదులుగా రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, జనం గొంతు నొక్కడానికి ఒక ఆయుధంగా మారిందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రాఘవేంద్ర కుమార్ గోపు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరును ఆయన కామెంట్స్ స్పష్టం చేశాయి. ఆయన ఈ చట్టాన్ని పూర్తిగా…

Read More

అటు ట్రంప్… ఇటు సుప్రీం – బ్యాలెట్ ఎన్నికలకు బలం ఇచ్చిన ఘటనలు

సహనం వందే, న్యూఢిల్లీ:ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రాణం. ప్రజల ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ ఆ ఓటును నమోదు చేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై (ఈవీఎంలు) ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి ఈ యంత్రాలు గొడ్డలిపెట్టుగా మారాయనే ఆరోపణలు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈవీఎంలకు బదులు కాగితపు బ్యాలెట్ కు మారుతామని ప్రకటించడం, భారత్‌లో సుప్రీంకోర్టు ఈవీఎంలలోని లోపాలను బయటపెట్టడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. అమెరికాలో ఈవీఎంల మీద అనుమానాలు…అమెరికా దేశీయ నిఘా…

Read More

పార్లమెంట్ భవనాన్ని మూసేయాలా?

సహనం వందే, ఢిల్లీ: సుప్రీంకోర్టుపైన, ప్రధాన న్యాయమూర్తి పైన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే, ఇక పార్లమెంటు ఎందుకని ఆయన మండిపడ్డారు‌. భారతదేశంలో జరుగుతున్న అంతర్యుద్ధాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా బాధ్యత వహించాలని దుబే సంచలన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు తన పరిధిని దాటి మతపరమైన యుద్ధాలను రెచ్చగొడుతోందని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి….

Read More

స్మిత వర్సెస్ సీఎం

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఒకరకంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఢీకొంటున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ ఫోటో రీట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పోలీసులు జారీ చేసిన నోటీసులకు ఆమె ఏమాత్రం వెరవడంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ట్వీట్లను వరుసగా రీట్వీట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తన ట్వీట్లను తొలగించకపోగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా రీట్వీట్లు…

Read More

బిడ్డ మాయమైతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: ఇకపై ఏ ఆసుపత్రిలో పసిపాప కనిపించకుండా పోయినా, వారి లైసెన్స్ రద్దు చేయడం ఖాయం! పిల్లల అక్రమ రవాణాదారుల పట్ల తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఆసుపత్రులు కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పులో స్పష్టం చేసింది. ముఠాల నుంచి చిన్నారులను కాపాడటంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అత్యున్నత న్యాయస్థానం పిలుపునిచ్చింది. కంటికి రెప్పలా కాపాడాలి… ప్రతి ఆసుపత్రిలో ప్రసవించిన శిశువు సంపూర్ణ బాధ్యత ఆసుపత్రి సిబ్బందిదేనని జస్టిస్…

Read More