
శాంతి వేదికపై ‘విజయనగర’ గళం – ప్రపంచ వేదికపై ఎంపీ అప్పలనాయుడు
సహనం వందే, రాజస్థాన్:రాజస్థాన్లోని శాంతివనం ఆధ్యాత్మిక, రాజకీయ సందడితో నిండిపోయింది. బ్రహ్మకుమారిస్ గ్లోబల్ సమ్మిట్-2025 శనివారం ఘనంగా మొదలైంది. కేంద్ర మంత్రులు కైలాస్ విజయ్ వర్గీయ, దుర్గాదాస్ ఉయకే ముఖ్య అతిథులుగా… విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విశిష్ట అతిథిగా హాజరై జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సామరస్యం, సుస్థిరమైన భవిష్యత్తు సాధన కోసం అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ అడుగులు వేస్తోంది. యుద్ధం వద్దు… శాంతికే…