ఎడిట్ జీన్స్… డిజైన్ బేబీస్ – మీరు కోరుకున్నట్టు మీ బిడ్డ తయారు

సహనం వందే, అమెరికా:మీరు ఊహించినట్టుగానే మీ బిడ్డ ఉంటే ఎలా ఉంటుంది? చక్కటి ముక్కు… కాంతివంతమైన చర్మం… మంచి రంగు… ఒత్తయిన జుట్టు… ఆరడుగుల ఎత్తు… ఉన్నతమైన మేధస్సు – ఈ లక్షణాలన్నీ మీ ఇష్టానికి అనుగుణంగా ఎంచుకునే అవకాశం లభిస్తే? అదే ఇవాళ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేస్తున్న డిజైనర్ బేబీస్ కథ. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ కథల్లో మాత్రమే కనిపించే ఈ అద్భుత సృష్టి… నేడు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తున్న ‘ప్రివెంటివ్’…

Read More

కామినేనికి ‘కోటి’తో చెంపపెట్టు – నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు

సహనం వందే, నల్లగొండ:నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లిలో ఉన్న కామినేని ఆసుపత్రి వైద్యులు చేసిన ఘోర నిర్లక్ష్యంపై జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. డాక్టర్ల తప్పిదం కారణంగా బాలింత మరణించిన కేసులో మృతురాలి కుటుంబానికి ఏకంగా కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించడం సంచలనం అయ్యింది. డెలివరీకి వచ్చి ప్రాణాలు కోల్పోయి…నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన అస్నాల స్వాతి డెలివరీ కోసం 2018 జూలై 13న కామినేని ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు ఆమెకు…

Read More

ఎగ్జిట్ హైప్… రిజల్ట్ డౌట్ – బీహార్ లో కమలం జోరు… కథ వేరు

సహనం వందే, పాట్నా:బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై నెలకొన్న ఏకపక్ష అంచనాలు విమర్శలకు తావిస్తున్నాయి. దైనిక్ జాగరణ్, మాట్రిజ్, పీపుల్స్ ఇన్‌సైట్, చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్ సహా మొత్తం తొమ్మిది ప్రముఖ సర్వే సంస్థలు బీహార్‌లో ఎన్డీయేదే తిరుగులేని అధికారం అని ముక్తకంఠంతో చెప్పాయి. ఈ అంచనాల ప్రకారం సరాసరి ఎన్డీయే కూటమి సుమారు 157 స్థానాలు దక్కించుకుంటుంది. అంటే అధికార పీఠం దక్కించుకోవడానికి అవసరమైన 122 స్థానాల మెజారిటీని చాలా తేలికగా దాటేస్తుందన్న మాట….

Read More

బీహార్ ఎన్నికల్లో ఎర్రకోట పేలుళ్లు – ఢిల్లీ ఉద్రిక్తతతో దేశ వ్యాప్తంగా అలర్ట్

సహనం వందే, న్యూఢిల్లీ/పాట్నా:బీహార్ ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన పేలుడు దేశ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటన ఎన్నికల సమయంలో భద్రతా పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చింది. మొదటి దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిన బీహార్‌లో… ఈ పేలుడు ప్రభావం రెండో దశ ఓటర్లలో భయాన్ని నింపుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు….

Read More

‘లక్ష’ల్లో ఆశ… ‘వంద’తో నిరాశ – భారత్ లో మస్క్ టెస్లా ఆశలు మటాష్

సహనం వందే, న్యూఢిల్లీ:భారత్‌లో టెస్లా వాహనాల విక్రయాలు చూస్తే దిగ్భ్రాంతి కలగక మానదు. టెస్లాను భారత్‌కు తీసుకొస్తే లక్షల్లో కార్లు అమ్ముడవుతాయని ఎలాన్ మస్క్ పెట్టుకున్న అంచనాలు పటాపంచలయ్యాయి. అక్టోబర్‌లో టెస్లా అమ్మింది కేవలం 40 వాహనాలు మాత్రమే! సెప్టెంబర్‌లో అమ్ముడైన 64 వాహనాలతో పోలిస్తే ఇది ఏకంగా 37% పతనం. జూలై నుంచి ఇప్పటివరకు అమ్మిన మొత్తం కార్లు 144 మాత్రమే. కొన్ని వందల ఆర్డర్లతో టెస్లా చేస్తున్న ఈ మౌన ప్రదర్శన చూస్తుంటే దేశీయ…

Read More

అర లక్ష కోట్లకు హైడ్రా రక్షణ – కమిషనర్ రంగనాథ్ వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కాపాడడంలో హైడ్రా సాధించిన విజయం అసాధారణమైనది. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు ఏకంగా 181 డ్రైవ్స్ నిర్వహించి 954 కబ్జాలను తొలగించినట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు ప్రకటించారు. ఈ క్రమంలో మొత్తం 1045.12 ఎకరాల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ సుమారు రూ. 50,000 కోట్ల నుండి రూ. 55,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో ప్రభుత్వ భూములు 531.82 ఎకరాలు,…

Read More

బీహార్ ఎన్నికల్లో అమ్మాయిల ఎర – ‘ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్’ లీక్స్

సహనం వందే, పాట్నా:ఒకవైపు బీహార్‌లో ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు తెరవెనుక కొందరు ప్రజా ప్రతినిధులు చేస్తున్న దారుణాలు దేశాన్ని కుదిపేశాయి! ఎన్నికల సమయంలో లాబీయింగ్ కోసం… పెద్ద పెద్ద నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అమ్మాయిలను సరఫరా చేయడం నివ్వెరపరిచింది. ప్రముఖ జాతీయ మీడియా ‘దైనిక్ భాస్కర్’ నిర్వహించిన ‘ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్’ బయటపెట్టిన రహస్యాలు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి ప్రజాప్రతినిధులు తమ విలాసాల కోసం ఏకంగా అమ్మాయిలను సరఫరా చేసే నెట్‌వర్క్‌ను ఆశ్రయిస్తున్నారట!…

Read More

జైలు పాలవుతున్న జస్టిస్ – నేరం నిరూపితం కాకుంటే జైల్లోనే జీవితం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతీయ న్యాయం కళ్ల గంతలు కట్టుకుని ఉందంటే బహుశా ఇదేనేమో! దేశంలో అత్యున్నత న్యాయస్థానం నుంచి వచ్చిన మాటలు ఇవి. సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్ నాథ్ స్వయంగా విడుదల చేసిన నివేదిక ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తోంది. మన జైళ్లలో మగ్గుతున్న మొత్తం ఖైదీల్లో 70 శాతం మందికి పైగా ఇంకా అండర్‌ట్రయల్స్‌ (నేరం రుజువు కానివారు) కావడం వ్యవస్థకు అద్దం పడుతోంది. ఎంతోమంది పౌరులు దోషులుగా తేలకముందే సంవత్సరాల తరబడి జైలు శిక్ష అనుభవిస్తుంటే న్యాయం…

Read More

లీవ్ అడిగితే లెక్చర్- ఆఫీసుల్లో బాసుల తీరుపై ఉద్యోగుల ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్:ఒక రెడిట్ పోస్ట్ ఇప్పుడు భారతీయ కార్పొరేట్ ప్రపంచంలో అగ్గి రాజేసింది. అత్యవసరం అని లీవ్ అడిగితే… జపాన్ మేనేజర్ ఆప్యాయంగా పలకరించి జాగ్రత్తగా ఇంటికి వెళ్లు అంటూ ప్రేమగా సెలవు మంజూరు చేశాడు. కానీ మన భారతీయ బాస్ ఎలా స్పందించారో తెలుసా? ‘నువ్వు ఎక్కువగా సెలవులు పెడుతున్నావు. నీ పని తీరుపై మేనేజ్మెంట్ అసంతృప్తితో ఉంది. సరేలే కానీ ఈసారికి సెలవు ఆమోదించాను… అయితే ఫోన్లో, మెయిల్‌లో అందుబాటులో ఉండు’ అని…

Read More

ఆకలిపై షాట్… షుగర్ ఔట్ – బరువుపై అమెరికా ఫార్మా కంపెనీ బ్రహ్మాస్తం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో కోరలు చాస్తున్న డయాబెటిస్, అధిక బరువు సమస్యలకు చెక్ పెట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా నుంచి ఓ కొత్త అస్త్రం వచ్చింది. అదే… మౌంజారో! అమెరికన్ ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ తయారు చేసిన ఈ ఇంజెక్షన్… మన దేశంలో అడుగుపెట్టిన ఆరు నెలల్లోనే రూ.100 కోట్ల అమ్మకాలతో రికార్డు సృష్టించింది. కేవలం డయాబెటిస్ నియంత్రణకే కాదు… బరువు తగ్గించడంలోనూ అద్భుతాలు చేస్తూ దేశ ఫార్మా మార్కెట్‌లో రెండో అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించింది. డయాబెటిస్…

Read More