ట్రంప్ బ్రాండ్… ‘రియల్’ ట్రెండ్ – భారత మార్కెట్లో ట్రంప్ ఎస్టేట్ మోజు

సహనం వందే, న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రాండ్‌తో కూడిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు భారత్ అతిపెద్ద విదేశీ మార్కెట్‌గా మారింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ (గూర్గావ్)లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రెండు లగ్జరీ ప్రాజెక్టులతో పాటు… ఇప్పుడు హైదరాబాద్‌లోని కోకపేట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ ప్రకటన రియల్ ఎస్టేట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 63 అంతస్తులతో సుమారు రూ. 3,500 కోట్ల పెట్టుబడితో ఈ టవర్లు నిర్మాణం కానున్నాయని డెవలపర్లు చెబుతున్నారు. ఈ భారీ…

Read More

మార్క్సిజం… మస్కిజం – మార్క్స్, మస్క్ ల లక్ష్యం సంపద పంపిణీయే

సహనం వందే, హైదరాబాద్:కారల్ మార్క్స్ ప్రతిపాదించిన కమ్యూనిజం సిద్ధాంతం, ఎలాన్ మస్క్ ఊహించిన రోబో యుగం— ఈ రెండు దృక్పథాలూ ఆర్థిక అసమానతలకు చెక్ పెట్టి సంపద సమృద్ధిని లక్ష్యంగా చేసుకున్నాయి. మార్క్స్ అందించిన ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు పని, ఎవరి అవసరానికి తగ్గట్టు సంపద పూర్తిస్థాయిలో అనుభవించడం అనే సూత్రం… మస్క్ ప్రతిపాదించిన యూనివర్సల్ హై ఇన్‌కం ఆలోచనతో ఆశ్చర్యకరంగా పోలి ఉంది. రెండు ఆలోచనల అంతిమ లక్ష్యం ఒకటే. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక…

Read More

స్మార్ట్ సర్జరీ.‌‌.. ‘బ్రెస్ట్’ రికవరీ- రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స

సహనం వందే, హైదరాబాద్:రొమ్ము క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విధానాలను ఎంఎన్ జే క్యాన్సర్‌ ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చింది. రొమ్ము క్యాన్సర్‌కు పెరుగుతున్న ముప్పు, చికిత్సలో నూతన విధానాలు, ప్రభుత్వ ఆసుపత్రుల పాత్రపై ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి సర్జికల్ ఆంకాలజీ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రమేష్‌ మాటూరితో ‘సహనం వందే’ ప్రత్యేక ఇంటర్వ్యూ… సహనం వందే: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ప్రమాద తీవ్రత ఎలా ఉంది? దీని పెరుగుదల ఆందోళన కలిగిస్తోందా? డాక్టర్ రమేష్: భారతీయ మహిళలకు…

Read More

గోల్కొండ వజ్రం… ఫ్రాన్స్ రక్తసిక్తం – రత్నం వెనుక శాపం…‌ రక్తపాతం… విప్లవం

సహనం వందే, పారిస్:ప్రపంచ ప్రసిద్ధి చెందిన రీజెంట్ వజ్రం చుట్టూ అల్లుకున్న రహస్యాలు… దాని భారతీయ మూలాల శాపం తాజాగా జరిగిన లూవ్ర్ మ్యూజియం దొంగతనంతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. కోట్ల విలువైన ఇతర ఆభరణాలను దోచుకెళ్లిన దొంగలు… గోల్కొండ గనుల నుంచి వచ్చిన ఈ రీజెంట్ రాణి వజ్రాన్ని మాత్రం తాకకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. చరిత్రలోని ఈ అపురూప వజ్రం కేవలం రత్నం కాదు… రక్తపాతంతో మొదలైన ఒక శాపగ్రస్త కథకు…

Read More

పాలకుల ఆటలో ‘కోటా’కు బీటలు – రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీల మెగా ధర్నా

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీ రిజర్వేషన్ నీరుగారి పోతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన 42 శాతం కోటా బిల్లు కోర్టుల కారణంగా ఒక్కసారిగా మాయమైపోయింది. ఈ అన్యాయానికి నిరసనగా బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం (24న) ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బంద్‌లు, ర్యాలీలు పాలకులపై ఒత్తిడి తీసుకువచ్చినా… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల అభ్యర్థనలను అణచివేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మహాధర్నా బీసీల…

Read More

అనారోగ్య దళితుడిపై అగ్రకుల దమనకాండ – ఆలయం పరిసరాల్లో మూత్రం పోశాడని ఫైర్

సహనం వందే, లక్నో:లక్నో సమీపంలోని కాకోరి పట్టణంలో జరిగిన దారుణ ఘటన దేశంలో కుల వివక్ష ఎంత వికృతంగా ఉందో మరోసారి బట్టబయలు చేసింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న 65 ఏళ్ల దళిత వృద్ధుడు రంపాల్ రావత్..‌. దీపావళి రోజున శీత్ల మాతా ఆలయం సమీపంలో అనుకోకుండా మూత్ర విసర్జన చేస్తే… ఒక స్థానికుడు అతనిపై దాడి చేసి అవమానించడం మానవత్వానికే సిగ్గుచేటు. మందిరానికి కనీసం 40 మీటర్ల దూరంలో జరిగిన ఈ చిన్నపాటి అనుకోని ఘటనను…

Read More

బ్రిటీషర్ల కంటే ఇస్లామీస్ డేంజర్ – యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

సహనం వందే, లక్నో:ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గోరఖ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం ఆయన రాజకీయ ఇస్లాంను బ్రిటిష్, ఫ్రెంచ్ సామ్రాజ్యవాదంతో పోల్చడమే కాకుండా… సనాతన ధర్మాన్ని బలహీనపరిచేందుకు దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందనే ఆరోపణలు చేశారు. గోరఖ్‌పూర్ వేదికగా యోగి సంధించిన ఈ విమర్శనాస్త్రాలు దేశ ప్రజల దృష్టిని మతపరమైన విభజనల వైపు మళ్లిస్తున్నాయనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో మొదలైంది. బ్రిటిష్,…

Read More

ఆకలితో అమ్మ… చనిపోయెనమ్మా – మరణించన 70 ఏళ్ల వృద్ధురాలు

సహనం వందే, హైదరాబాద్:దేశమంతా దీపావళి వెలుగులు, ఆనందాల నడుమ మునిగి తేలుతున్న వేళ, హైదరాబాద్‌లో ఒక వృద్ధురాలు ఆకలితో మరణించడం అత్యంత హృదయ విదారకరం. విశ్వనగరంగా పేరుగాంచిన నగరంలో గోపన్ పల్లి అక్షిత హాస్పిటల్ వద్ద 70 ఏళ్ళున్న ఒక నిస్సాయ మహిళ మృతదేహం దొరకడం గుండెలవిసేలా చేసింది. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఆమె గత కొన్ని రోజులుగా కనీసం పట్టెడన్నం లేక ఆకలి బాధలతో అలమటించి చివరికి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మరణం…

Read More

కలిశెట్టి రాక… చిన్నారుల కేక – విజయనగరం ఎంపీ వినూత్న దీపావళి వేడుక

సహనం వందే, రణస్థలం:విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ప్రతి ఏటా ప్రభుత్వ బాలికల వసతి గృహం విద్యార్థినులతో దీపావళి సంబరాలు జరుపుకోవడం ఒక సంప్రదాయంగా మారింది. ఆయన స్వతహాగా పిల్లలతో గడపడానికి, వారి నిష్కల్మషమైన ఆనందాన్ని చూసి మురిసిపోవడానికి ఎంతో ఇష్టపడతారు. వారికి కావాల్సినవన్నీ చేసిపెట్టడం, అడగకముందే అవసరాలను తీర్చడం ఆయన సహజ శైలి. ఈ మానవీయ కోణం ఆయన రాజకీయ జీవితంలో ఒక ప్రత్యేకతను చాటుతోంది. సొంత బిడ్డతో వచ్చి తీపి పంచిన ఎంపీసోమవారం…

Read More

ఓల్డ్ లేడీ… గోల్డ్ రూల్ – 117 ఏళ్ల బతికిన మరియా జీవిత రహస్యం

సహనం వందే, స్పెయిన్:ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా గుర్తింపు పొందిన మరియా బ్రాన్యాస్ మొరెరా 117 ఏళ్ల 168 రోజుల బతికి గత ఏడాది కన్నుమూశారు. ఆమె 1918 ఫ్లూ మహమ్మారిని తట్టుకున్నారు. అలాగే కరోనా నుంచి బయటపడ్డారు. రెండు ప్రపంచ యుద్ధాలు చూశారు. ఆమె చిరకాలం బతకడానికి గల రహస్యాలను శాస్త్రవేత్తలు ఛేదించారు. స్పెయిన్‌లోని బార్సిలోనా విశ్వవిద్యాలయంలో జన్యుశాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ మానెల్ ఎస్టెల్లర్ నేతృత్వంలో జరిగిన ఈ అపూర్వ అధ్యయనం మరియా జీవన మంత్రంలోని…

Read More