మంత్రి దామోదరకు నాయకుల కృతజ్ఞతలు

సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాల నాటి ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరడంలో కీలక పాత్ర పోషించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ జనరల్ సెక్రటరీ కొండేటి మల్లయ్య మరియు ఇతర నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రి దామోదర రాజనర్సింహ చేసిన కృషిని కొనియాడారు. “దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణ ఆకాంక్షను నెరవేర్చడంలో మంత్రి…

Read More

తెలంగాణ వ్యవసాయంలో సాంకేతిక విప్లవం – జర్మనీ సహకారంతో ఆధునిక సాగుకు శ్రీకారం!

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జర్మనీ ప్రతినిధుల బృందంతో గురువారం సచివాలయంలో సమావేశమై, నూతన సాంకేతికతల వినియోగం, మార్కెటింగ్, డిజిటల్ వ్యవసాయ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, “భారత-జర్మనీ ప్రభుత్వాల సహకారంతో వ్యవసాయ రంగం అభివృద్ధికి నూతన ప్రణాళికలు రూపొందిస్తాం” అని అన్నారు. సిరిసిల్లలో పైలట్ ప్రాజెక్ట్: సిరిసిల్ల జిల్లా వేములవాడలో జర్మనీ సంస్థ…

Read More

కాంగ్రెస్ తెచ్చిన కరువు – తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శ

సహనం వందే, సూర్యాపేట: “నీళ్ల మంత్రి నల్లగొండలోనే ఉన్నా చుక్క నీరు తేలేకపోవడం సిగ్గుచేటు” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సూర్యాపేటలో గురువారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండిపోవడానికి కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణం” అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేరు…

Read More

దశాబ్దాల నిరీక్షణకు తెర – 57,924 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో రేవంత్ ప్రభుత్వం సరికొత్త రికార్డు!

సహనం వందే, హైదరాబాద్: “కొలువుల పండుగ” సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త అందించారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మీ కల నేడు నిజమైంది. ఈ రోజు నియామక పత్రాలు అందుకుంటున్న 922 మందికి, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి తావులేదు… గత…

Read More

కాంగ్రెస్ బడ్జెట్ ‘బడా జూట్’.. అబద్ధాల పుట్ట: హరీష్ రావు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజకీయ ప్రసంగంలా ఉందని, పచ్చి అబద్ధాలు, అసత్యాలతో నిండి ఉందని ఆయన దుయ్యబట్టారు. ఈ బడ్జెట్‌ను ‘బడా జూట్’ బడ్జెట్‌గా అభివర్ణిస్తూ, కాంగ్రెస్ విశ్వసనీయతను కోల్పోయిందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఆకాశమంత హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక మొహం చాటేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనూ, బయటా అబద్ధాలే మాట్లాడుతున్నారని విమర్శించారు….

Read More

రాష్ట్ర బడ్జెట్‌పై జాన్ వెస్లీ తీవ్ర విమర్శలు – నిధుల కేటాయింపు పెంచాలని డిమాండ్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌పై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో విద్యా, వైద్య, వ్యవసాయం, గృహనిర్మాణ రంగాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి నిధుల కేటాయింపులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు, ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోకు, ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదనలకు ఎలాంటి పొంతన లేదని జాన్ వెస్లీ…

Read More

తీపి, చేదు కలగలిపిన ఉగాది పచ్చడిలా బడ్జెట్: కూనంనేని

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. ఈ బడ్జెట్‌ను ఆయన తీపి, చేదు కలగలిపిన ఉగాది పచ్చడిలా అభివర్ణించారు. ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం సాహసోపేతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని కూనంనేని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, హామీల అమలులో సమతుల్యత పాటించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన తెలిపారు. గొప్పలకు పోకుండా, పన్నుల భారం పెంచకుండా, ఉన్నంతలో బడ్జెట్…

Read More

బడ్జెట్ రూ. 3.04 లక్షల కోట్లు

సహనం వందే, హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 3 లక్షల 4 వేల 965 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం 2 లక్షల 26 వేల 982 కోట్లు కాగా, మూలధన వ్యయం 36 వేల 504 కోట్లుగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ బడ్జెట్‌లో ఆరు గ్యారంటీ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ముఖ్యంగా రైతు భరోసా పథకానికి 18 వేల కోట్లు,…

Read More

జయహో సునీత విలియమ్స్

– 9 నెలల అంతరిక్ష వాసం తర్వాత సురక్షితంగా భూమికి చేరిక – ఫ్లోరిడా తీరంలో ల్యాండింగ్… వైద్య పరీక్షలు… ప్రపంచవ్యాప్త ఆసక్తి సహనం వందే, హైదరాబాద్: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు నాసా అస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు బుధవారం (మార్చి 19) అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు….

Read More

పసుపుకు కేంద్రం మద్దతు ధర ఇవ్వాలి

సహనం వందే, హైదరాబాద్:పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పసుపు రైతులను పట్టించుకోలేదని, కానీ ప్రతిపక్షంలోకి వచ్చాకా.. పసుపు రైతులపై దొంగ ప్రేమ ఒలకపోస్తుందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పసుపు రైతులు ఆందోళన చేస్తే… రోడ్ల మీదకు రాకుండా ఆంక్షలు పెట్టి, కేసులు పెట్టి జైల్లో వేసిన చరిత్ర మీది అని గుర్తుచేశారు. తనపై సైతం కేసులు పెట్టినట్లు తెలిపారు. మంగళవారం ఆయన హాకా భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పసుపు…

Read More