
ప్రమాదంలో పత్రికాస్వేచ్ఛ – ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి
సహనం వందే, హైదరాబాద్:పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ‘ప్రజాస్వామ్యం- పత్రికాస్వేచ్ఛ’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీనియర్ జర్నలిస్టు ఆర్.దిలీప్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వాలు వ్యతిరేక వార్తల పట్ల కొంత అసంతృప్తి చూపేవి కానీ ఇప్పుడు అసహనం నుంచి కక్ష సాధింపు వరకు వచ్చాయని ఆరోపించారు. ప్రభుత్వాలు పూర్తిగా…