తులం తుస్… బంగారం మిస్ – ఎన్నికల హామీపై చేతులెత్తేసిన కాంగ్రెస్

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో ఎంతో వాడీవేడిగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం ఇవ్వడం సాధ్యం కాదని ఆయన కామెంట్స్ చేయడంపై విమర్శలు వెలుగుతున్నాయి. దీంతో మహిళల తులం బంగారం ఆశ అడియాశగా మారింది. మహాలక్ష్మి పథకం పేరుతో కొత్తగా పెళ్లయిన వారికి పసిడి బహుమతి అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినా ఆ హామీ ఇప్పుడు…

Read More

నేతల లూటీ… ఏఐ లాఠీ – రాజకీయ అవినీతిని వెలికితీసేలా కొత్త ఫీచర్

సహనం వందే, హైదరాబాద్:దేశ రాజకీయాల్లో త్వరలో ఒక పెను సంచలనం చోటు చేసుకోనుంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సెర్చ్ ఇంజిన్ పెర్ప్లెక్సిటీ ఏఐ తీసుకొస్తున్న నూతన ఫీచర్ భారతీయ రాజకీయ నాయకుల స్టాక్ హోల్డింగ్స్ గుట్టు రట్టు చేయనుంది. ఇప్పటివరకు ఎన్నికల అఫిడవిట్లు, ఆస్తి డిక్లరేషన్లలో అస్పష్టంగా ఉన్న నేతల ఆర్థిక కార్యకలాపాలు, షేర్ల పెట్టుబడులు ప్రజల కళ్ల ముందు పారదర్శకంగా ఆవిష్కృతం కాబోతున్నాయి. పెర్ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు….

Read More

ముస్లిం ఓట్లు… బీజేపీకి సీట్లు – బిహార్ ఎన్నికల్లో ఓవైసీ శిఖండి పాత్ర

సహనం వందే, పాట్నా:బిహార్ ఎన్నికల రాజకీయాలు అసదుద్దీన్ ఓవైసీ వ్యూహంతో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలోని మహాకూటమి ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఎంఐఎం పోటీ పడడం పరోక్షంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి లాభం చేకూర్చే అవకాశం కలిగించింది. మహాకూటమి ప్రధానంగా ఆధారపడిన ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారానే ఈ ప్రమాదం ఏర్పడుతోంది. 2020 ఎన్నికల్లో ఎంఐఎం పోటీ వల్ల ఐదు సీట్లు కోల్పోయిన మహాకూటమి… ఇప్పుడు 64 సీట్లకు…

Read More

లైక్ చేస్తే లూటీ – 30,000 మంది… రూ. 1,500 కోట్లు లూటీ

సహనం వందే, హైదరాబాద్:డిజిటల్‌ ప్రపంచంలో చిన్న లైక్‌ కూడా ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందో సుమిత్ కుమార్ ఉదంతం నిరూపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని చెఫ్ సుమిత్… ఒక ఆర్థిక సలహాదారు వీడియోకు లైక్ కొట్టగానే పది నిమిషాల్లోనే వాట్సాప్ సందేశం వచ్చింది. పెట్టుబడి కోసం ఎర వేయడానికి సైబర్ నేరగాళ్లు ఎంత వేగంగా పకడ్బందీగా పనిచేస్తున్నారో చెప్పడానికి ఇదే ఉదాహరణ. వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ సభ్యులతో లాభాల ఊసేత్తుతూ తమ వలలో చిక్కుకున్న వ్యక్తికి ఆశ…

Read More

బీసీ బ్రాండ్… కృష్ణయ్య బౌండ్ – ఒక ఉద్యమకారుడి ఆవేదనతో కూడిన లేఖ

సహనం వందే, హైదరాబాద్:బీసీల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమ దిక్సూచి ఆర్. కృష్ణయ్య ప్రస్తుత రాజకీయ ప్రస్థానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ అనే ఉద్యమకారుడు కృష్ణయ్యకు రాసిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో అగ్గి రాజేస్తోంది. గత చరిత్రను నెమరువేస్తూనే అపారమైన బీసీ నాయకుడి ఇమేజ్‌కు ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులు ఏమాత్రం సరితూగవని ఆ లేఖ నిలదీసింది. రాజకీయ పక్షాలు బీసీ ఉద్యమాన్ని…

Read More

రక్తం చిందిన ‘కర్మ’ బంధం – నేను… తను… శూన్యం

కష్టమే శాశ్వతం… సమాజపు చిన్నచూపుజీవితం అనేది అనేక అనుభవాల రైలు ప్రయాణం లాంటిది. సుఖం అనేది కంటికి కనిపించని అందమైన దేవతా వస్త్రం లాంటిది. అది ఉన్నట్టే ఉంటుంది కానీ ఎక్కువ కాలం మనతో కొనసాగదు. కానీ కష్టం అనేది నిరంతరం మనల్ని వెంటాడుతుంది. కొందరు కొన్ని సమయాల్లో ఆప్తులుగా ఉన్నట్టే కనిపిస్తారు. కానీ కష్టం వస్తే ఎవరూ దొరకరు. మాస్టర్‌ డిగ్రీ చదివి బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ ఏరికోరి కుడిచేయి లేని దివ్యాంగురాలిని నేను పెళ్లి…

Read More

సెకండ్ హ్యాండ్ సినిమా సేల్ – పాత సినిమాల విడుదలపై ప్రేక్షకుల అసహనం

సహనం వందే, హైదరాబాద్:తెలుగు సినిమా రంగంలో రీ రిలీజ్ పరంపర ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. ఇది ప్రేక్షకులను ఆకర్షించడం కాదు… అక్షరాలా దోచుకోవడమే! ఇప్పటికే ఓటీటీ వేదికల్లో ఉచితంగా అందుబాటులో ఉన్న కమర్షియల్ మసాలా సినిమాలకు ప్రేక్షకుడు మళ్ళీ టికెట్ కొని థియేటర్లకు వెళ్లాల్సి రావడం ఏంటి? సందేశాత్మక చిత్రాలు కావు. సామాజిక సమస్యలపై తీసినవి కావు. కేవలం పాత ఫార్ములా సినిమాలు. కానీ డబ్బు ఆర్జనకు మాత్రం సినీ పెద్దలు ఏ చిన్న అవకాశాన్నీ…

Read More

ఏఐ ఉండగా డాక్టర్ దండగ – తీరికలేని మానవ వైద్యులతో రోగుల ఇబ్బంది

సహనం వందే, న్యూయార్క్:ఆసుపత్రికి వెళితే డాక్టర్ ఉంటారో లేదో తెలియదు… ఎప్పుడు వస్తారో తెలియదు… ఒకవేళ ఉన్నా బిజీ బిజీగా ఉంటారు. కొన్నిసార్లు ఎమర్జెన్సీ అంటూ వెళతారు. దీంతో రోగులు గంటల తరబడి డాక్టర్ కోసం వేచి ఉండాల్సి వస్తుంది. ఫలితంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు. ఇక కొన్ని ఆసుపత్రుల్లోనైతే డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల రోగులందరినీ సకాలంలో చూసే పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు కాలం మారింది. ఏఐ యుగం నడుస్తుంది. ఏఐ చాట్…

Read More

ఉగ్రమరణం స్వర్గలోకం – మసూద్ ఆధ్వర్యంలో మహిళా జిహాదీ బ్రిగేడ్‌

సహనం వందే, న్యూఢిల్లీ:భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ నడ్డి విరిగినా ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కొత్త కుట్రకు తెర లేపాడు. తన ఉగ్ర ఎజెండాను కొనసాగించేందుకు ఏకంగా మహిళలనే జిహాదీ బ్రిగేడ్‌గా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బహవల్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఈ వ్యూహం రూపొందుతోంది. పాకిస్తాన్ అధికారులు, ప్రభుత్వంలోని పెద్దల అండదండలు లేకుండా ఈ ప్రమాదకర కుట్ర చేయడం అసాధ్యం. నిషేధించిన సంస్థలంటూ పదే పదే ప్రపంచానికి…

Read More

విదేశీ గడ్డపై ఫుడ్డు కోసం గడ్డి – స్విట్జర్లాండ్ లో భారతీయ పర్యాటకుడి కక్కుర్తి

సహనం వందే, స్విట్జర్లాండ్:స్విట్జర్లాండ్‌ హోటళ్ల వద్ద కొందరు భారతీయ పర్యాటకులు ప్రదర్శిస్తున్న చవకబారు బుద్ధి యావత్ దేశాన్ని తలదించుకునేలా చేస్తోంది. జ్యూరిచ్‌లోని ఓ హోటల్ బ్రేక్‌ఫాస్ట్ బఫేలో ఢిల్లీకి చెందిన ఒక కుటుంబం చేసిన పనిని అక్కడే ఉన్న ఓ భారతీయ వ్యక్తి కళ్లారా చూసి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబం హోటల్‌కి ఖాళీ బాక్సులు తీసుకువచ్చి అందులో పండ్లు, ఉడికించిన గుడ్లు, పెరుగు వంటి వాటిని నింపుకొని వెళ్లిపోయింది. హోటల్ ప్రవేశ…

Read More