ఫిమేల్ ఫేవర్… పన్నెండు లీవ్స్ – స్త్రీలకు రుతు సెలవులు ప్రకటించిన కర్ణాటక

సహనం వందే, బెంగళూరు:కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన సంవత్సరానికి పన్నెండు రుతు మాసపు సెలవుల నిర్ణయం చారిత్రక ఘట్టం. ఉద్యోగం చేస్తూ ఇల్లు, కుటుంబాన్ని సమన్వయం చేసే మహిళలకు రుతుక్రమం వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని గుర్తించి ప్రభుత్వం వారికి ఆరోగ్యపరంగా ఊరట నిచ్చే ప్రయత్నం చేసింది. ఈ నిర్ణయం వల్ల తమ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం దొరికిందని ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసు పని ఒత్తిడిని తగ్గించుకుని…

Read More

నేత్రావతి ఒడ్డున శవాల గుట్టలు – ధర్మస్థల నరబలుల మారణకాండ

సహనం వందే, కర్ణాటక:కర్ణాటకలోని పవిత్ర శైవక్షేత్రం ధర్మస్థల చుట్టూ భయానక రహస్యాలు కమ్ముకున్నాయి. పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా జరిగిన దారుణ హత్యలు, క్షుద్రపూజల పేరుతో నరబలులు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఒంటరిగా కనిపించిన యువతులు, బాలికలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి, శవాలను రహస్యంగా పూడ్చిపెట్టిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదుతో ఈ దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు, ఎముకలు లభ్యమవడం…

Read More

‘ఇది కర్ణాటక… ఇది ఇండియా’

సహనం వందే, కర్ణాటక: కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అధికారిణి ప్రవర్తన రాష్ట్రంలో తీవ్ర భాషా వివాదానికి దారితీసింది. అనేకల్ తాలూకాలోని సూర్యనగర బ్రాంచ్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ కస్టమర్‌తో అధికారిణి కన్నడ మాట్లాడటానికి నిరాకరించింది‌. పైగా హిందీ మాట్లాడాలని పట్టుబట్టడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో చివరకు ఆ ఉద్యోగిణిని బదిలీ చేశారు. కస్టమర్‌తో అధికారిణి తీవ్ర వాగ్వాదంసూర్య…

Read More

కర్ణాటకలో 70 శాతం మంది బీసీలే

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలో బీసీల జనాభా ఏకంగా 70 శాతం ఉండటం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంతమంది బీసీలు అక్కడ ఉన్నారా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. కులగణన సర్వేలో ఈ వివరాలు వెలుగు చూశాయి. కర్ణాటకలో దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉన్న కుల గణన నివేదిక ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ ఈ నివేదికను ఏప్రిల్ 17న చర్చించనుంది. ఈ సందర్భంగా ఇతర వెనుకబాటు తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌ను ప్రస్తుత 32 శాతం నుంచి…

Read More

కర్ణాటకలో ఓబీసీలకు 51 శాతం రిజర్వేషన్లు

సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలో రిజర్వేషన్ల విధానం ఒక్కసారిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్‌ను భారీగా పెంచాలని కుల గణన నివేదిక సిఫార్సు చేసింది. ప్రస్తుతం 32 శాతంగా ఉన్న ఓబీసీ రిజర్వేషన్లను ఏకంగా 51 శాతానికి పెంచాలని నివేదిక ప్రతిపాదించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను సమర్పించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుల గణన నివేదికలో ఏం…

Read More