హోమియోపతి వైద్యులు ఎంబీబీఎస్ డాక్టర్లేనా?

సహనం వందే, మహారాష్ట్ర:మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు వైద్య సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది. హోమియోపతి వైద్యులను వైద్య మండలిలో నమోదు చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం ప్రజారోగ్యానికి పెను ప్రమాదమని, ఇది వైద్య వ్యవస్థలో అవినీతికి దారితీస్తుందని ఐఎంఏ హెచ్చరిస్తోంది. ప్రభుత్వం హోమియోపతి వైద్యుల లాబీయింగ్‌కు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై బొంబే హైకోర్టులో కేసు…

Read More

ఎత్తుకు వైద్యం… వికటిస్తే వైకల్యం – ఫ్యాషన్ ఉచ్చులో చిక్కుకుంటున్న యువత

సహనం వందే, హైదరాబాద్:ఎత్తు పెరగాలనే కోరిక… దానికోసం ప్రాణాలను పణంగా పెట్టేంత పరిస్థితి దాపురించడం ఒక ఆందోళన కలిగించే అంశం. వ్యాయామం, సరైన ఆహారం, చిట్కాలు లాంటివి ఫలితం ఇవ్వనప్పుడు యువత ఫ్యాషన్ కోసం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ఎత్తు పెంచే వైద్యం వైపు అడుగులు వేస్తోంది. ఇండియాతోపాటు ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ ఆపరేషన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అయితే దీనిలోని ప్రమాదాలను బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ లాంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దురదృష్టవశాత్తు భారతదేశంలోనూ…

Read More

ఎవరేమనుకుంటారో…? – ఈ ప్రశ్నే విద్యార్థుల ఆత్మహత్యకు కారణం

సహనం వందే, హైదరాబాద్:పరీక్షా ఫలితాలు వచ్చాయి. యోగిత తన గదిలో తలుపు వేసుకుని కూర్చుంది. రిలేటివ్స్ ఫోన్ల మోత… కోచింగ్ సెంటర్ల హడావుడి… గుమ్మం బయట తల్లి నిట్టూర్పు… ఇవన్నీ యోగితకు ఓ ఉచ్చులా బిగుసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కన్నీళ్లతో ఉన్న యోగిత తెల్లరేసరికి నిర్జీవంగా మారింది. ఇదొక్క యోగిత కథే కాదు. మధ్యతరగతి కుటుంబాలలో ఇలాంటి విషాదాలు నిత్యకృత్యం. మార్కులకు, ర్యాంకులకు ప్రాణం అర్పించే ఎంతోమంది విద్యార్థుల వేదన ఇది. 2022లో మన దేశంలో 1.7…

Read More

విలాసంపై విప్లవాగ్ని – నేపాల్ అధికార పెద్దల లగ్జరీపై ఆగ్రహజ్వాల

సహనం వందే, నేపాల్:నేపాల్‌ లో ప్రభుత్వ పెద్దల విలాసవంతమైన జీవితంపై యువతలో ఆగ్రహం అగ్నిపర్వతంలా పేలింది. లగ్జరీ కార్లు, ఖరీదైన విదేశీ ప్రయాణాలు, కళ్ళు చెదిరే జీవనశైలికి సంబంధించిన నాయకుల పిల్లల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ‘నెపో కిడ్స్’ హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అయ్యాయి. దేశంలో నాలుగో వంతు ప్రజలు పేదరికంతో అల్లాడుతుంటే పాలకుల వారసులు చేస్తున్న విచ్చలవిడి ఖర్చులను చూసి యువత సహనం కోల్పోయింది. ఈ సోషల్ మీడియా ప్రచారం కేవలం సమాచారం కోసం మాత్రమే…

Read More

హరీష్ రావుకు ముఖ్యమంత్రి యోగం – ఫ్లాష్ సర్వే పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో చెక్కర్లు

సహనం వందే, హైదరాబాద్:ఫ్లాష్ సర్వే పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో 20 పేజీల రిపోర్ట్ చెక్కర్లు కొడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు కాంగ్రెస్ పార్టీకే మరింత ప్రయోజనం కలిగిస్తుందని సర్వే వెల్లడించింది. సర్వేలో అత్యంత ఆసక్తికరమైన విషయం హరీష్ రావు ప్రజల మనిషిగా ముందుకు వస్తున్నాడని… కేసీఆర్ కుటుంబంలో అంతర్గత యుద్ధం హరీష్ కి లాభిస్తుందని తేలింది. దీంతో హరీష్ రావే భవిష్యత్ ముఖ్యమంత్రి అవుతారని చాలామంది నమ్ముతున్నారు. కేటీఆర్‌కు మించి ప్రజల దగ్గర హరీష్‌కు బలమైన…

Read More

కోచింగ్‌కు పన్ను… భవిష్యత్తుపై మన్ను – విద్యార్థుల జీవితాలతో 18% జీఎస్టీ ఆట

సహనం వందే, హైదరాబాద్:మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పుడొక కొత్త చిక్కు వచ్చి పడింది. ఒకవైపు పిల్లల భవిష్యత్తు, మరోవైపు పెరిగిపోయిన ఖర్చులు. ప్రభుత్వం ఇటీవల ప్రైవేట్ కోచింగ్‌ సెంటర్లకు, ఆన్‌లైన్ ట్యూషన్లకు 18 శాతం జీఎస్టీ విధించడంతో ఈ సంకట పరిస్థితి మరింత పెరిగింది. పాఠశాలలు, కళాశాలలు పన్ను పరిధి నుంచి మినహాయించిన ప్రభుత్వం… కోచింగ్ సంస్థలను విద్యాసంస్థలుగా పరిగణించకుండా ఈ నిర్ణయం తీసుకుంది. పన్ను భారం వల్ల తల్లిదండ్రులు కోచింగ్ మానిపించి, పిల్లలను మళ్లీ పాఠశాల విద్యపై…

Read More

జ’గన్’పై రాజారెడ్డి మిస్సైల్ – రాజకీయాల్లోకి జగన్ మేనల్లుడు రాజారెడ్డి

సహనం వందే, విజయవాడ:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే వై.ఎస్. కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు, ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్. షర్మిల కుమారుడు వై.ఎస్. రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై షర్మిల కీలక ప్రకటన చేశారు. కర్నూలులో ఉల్లి రైతులను పరామర్శించేందుకు రాజారెడ్డిని తీసుకువెళ్లి ప్రజలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… వై.ఎస్. రాజారెడ్డికి ఎప్పుడు అవసరం అయితే…

Read More

వేటు కోసం వెయిట్ – బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల రగడ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం సంచలనం సృష్టించింది. ఈ ఫిరాయింపులపై వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఒకరిద్దరు మినహా ఎవరూ స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో…

Read More

కూలీ వేషంలో కాకీ – ముంబై పోలీసుల అనూహ్య వ్యూహం

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక వాడ కేంద్రంగా నడుస్తున్న ఒక భారీ డ్రగ్స్ రాకెట్‌ను ముంబై పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. వాగ్దేవి ల్యాబొరేటరీస్ అనే రసాయన కర్మాగారం ముసుగులో మెఫడ్రోన్ డ్రగ్స్ తయారవుతున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. రజనీకాంత్ సినిమా తరహాలో ఒక కానిస్టేబుల్‌ను కార్మికుడిగా పంపి నెల రోజుల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ మాఫియా గుట్టును రట్టు చేశారు. ఈ ఆకస్మిక దాడిలో రూ.12 వేల…

Read More

వేల కోట్ల డ్రగ్స్… ముంబై దెబ్బ అదుర్స్ – హైదరాబాదులో రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ సీజ్

సహనం వందే, హైదరాబాద్:దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ఇప్పుడు డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మారుతోంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు మేడ్చల్‌లో నిర్వహించిన ఆపరేషన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతో నగరంలో అక్రమ డ్రగ్స్ తయారీ ఏ స్థాయిలో జరుగుతుందో వెల్లడైంది. ఎక్స్‌టీసీ, మోలీ, ఎండీఎంఏ వంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌తో పాటు, వాటి తయారీకి అవసరమైన…

Read More