సోఫియాపై బీజేపీ మంత్రి మత వ్యాఖ్యలు

కాంగ్రెస్ భగ్గు… దేశవ్యాప్తంగా ఆగ్రహం! సహనం వందే, ఢిల్లీ: భారత సైన్యానికి గర్వకారణమైన మహిళా అధికారి, కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా చేసిన నీచమైన వ్యాఖ్యలు దేశాన్ని కుదిపేశాయి. ఆపరేషన్ సింధూర్ పత్రికా సమావేశంలో సోఫియా ఖురేషీని ఉద్దేశించి విజయ్ షా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. విజయ్ షాను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ వివాదం సోషల్ మీడియాలో…

Read More

‘యుద్ధం బాలీవుడ్ సినిమా కాదు’

సహనం వందే, పూణే: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలను భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే తీవ్రంగా ఖండించారు. యుద్ధం అనేది బాలీవుడ్ సినిమాలో చూపించే రొమాంటిక్ అంశం కాదని, అది అత్యంత గంభీరమైన విషయమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం రొమాంటిక్ సీన్ కాదు…యుద్ధం రొమాంటిక్ సీన్ కాదు. అది మీ…

Read More

పాక్‌కు వేల కోట్ల ఐఎంఎఫ్ రుణం

సహనం వందే, హైదరాబాద్: భారత్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అవిశ్రాంతంగా పోరాడుతుంటే, సరిహద్దుల్లో పాకిస్థాన్ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్‌కు భారీ మొత్తంలో రుణం ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సిద్ధమవడం విమర్శలకు దారితీస్తోంది. పాకిస్థాన్ ఈ నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఐఎంఎఫ్ మాత్రం రుణాన్ని మంజూరు చేసింది. ఆర్థిక స్థిరత్వమే ప్రధాన కర్తవ్యం…ఐఎంఎఫ్ అనేది 191 దేశాలు సభ్యులుగా ఉన్న ఒక…

Read More

పాకిస్తాన్ కాదు మోసగిస్తాన్

సహనం వందే, న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ దానిని ఉల్లంఘించిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని, భారత సైన్యం తగిన రీతిలో స్పందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మధ్యాహ్నం అంగీకారం… సాయంత్రం ఉల్లంఘనవిక్రమ్ మిస్రీ తెలిపిన వివరాల ప్రకారం… శనివారం…

Read More

ఆపరేషన్ ‘సినీ’దూర్

సహనం వందే, హైదరాబాద్: ఆయన ఒకానొక పెద్ద సినిమా స్టార్… అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. చిటికేస్తే అభిమానులు తరలివస్తారు. తన కోసం ప్రాణం ఇస్తారు. అలాంటి స్టార్ మన దేశ సైన్యానికి మద్దతు కోసం ర్యాలీ నిర్వహించాలని ఒక ప్రముఖ వ్యక్తి కోరగా, డబ్బులు ఇస్తే చేస్తానని అన్నాడట. ఇంతకంటే నీచత్వం ఇంకేమైనా ఉంటుందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా సినిమా విడుదలవుతుందంటే చాలు, వేల మంది అభిమానులను తరలించి ప్రచార హోరు సృష్టిస్తారు….

Read More

నారీ… రణభేరీ

సహనం వందే, న్యూఢిల్లీ: భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంతో, భారత సైన్యంలోని మహిళా అధికారులు ముందంజలో నిలిచి దేశానికి గర్వకారణమయ్యారు. కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మే 7న న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి, ఈ ఆపరేషన్ విశేషాలను వెల్లడించారు. ఒక ప్రధాన సైనిక చర్య గురించి ఇద్దరు మహిళా అధికారులు స్వయంగా మీడియాకు వివరించడం దేశ…

Read More

‘అందం’పై యుద్ధమేఘం

సహనం వందే, హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజలు ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారు. భారత సైన్యం సరిహద్దుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా శత్రువును ఎదుర్కొంటున్న సమయంలో, అందాల పోటీల్లో ఆనందించే పరిస్థితి దేశంలో లేదని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ‘మన జవాన్లు దేశం కోసం పోరాడుతుంటే, హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించడం జాతీయ మనోభావాలను గాయపరుస్తుంద’ని ఒకరు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోటీలు కొనసాగితే దేశ ఐక్యతకు భంగం కలిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు…

Read More

భారత్ కు అమెరికా… పాక్ కు చైనా

సహనం వందే, హైదరాబాద్: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ పై దాదాపు యుద్ధం మొదలైనట్లే. చారిత్రాత్మకంగా అలీన విధానాన్ని అనుసరించిన భారత్, ఇప్పుడు అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ రష్యా నుంచి ఆయుధ కొనుగోళ్లను తగ్గించింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తర్వాత అమెరికా వ్యూహాత్మక ప్రాధాన్యతను కోల్పోయిన పాకిస్తాన్, ఇప్పుడు చైనాపై ఆధారపడుతూ తన సైనిక అవసరాలను తీర్చుకుంటోంది. భారత్ ఆయుధ వ్యూహంలో మార్పు…భారత్ గతంలో రష్యాపై ఆధారపడగా, ఇప్పుడు…

Read More

ఉగ్రమూకలపై ఉక్కుపాదం

సహనం వందే హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత మెరుపుదాడి చేసింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లలో ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న 9 కీలక స్థావరాలను భారత సాయుధ దళాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ చర్యతో ఉగ్రవాదులకు భారత్ గట్టి హెచ్చరిక పంపింది. పహల్గామ్ మారణహోమానికి తగిన గుణపాఠంఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా…

Read More