Unemployment

నిరుద్యోగ విస్పోటనం – పదేళ్లలో 80 కోట్ల మంది బతుకు భారం

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచం ఒక నిరుద్యోగ అగ్నిపర్వతం మీద కూర్చుంది. రాబోయే దశాబ్ద కాలంలో కోట్ల మంది యువతకు ఉపాధి లేక వీధుల పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. భారత్‌లో పెరుగుతున్న నిరుద్యోగ రేటు, అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంకు చేస్తున్న హెచ్చరికలు ఒకే భయానక సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక లెక్కల గారడీ కాదు… వ్యవస్థల వైఫల్యం వల్ల పుట్టుకొస్తున్న సామాజిక దావానలం. ప్రపంచ బ్యాంక్ పేల్చిన బాంబుప్రపంచ బ్యాంకు గ్రూపు అధ్యక్షుడు అజయ్…

Read More
Justice Kurian Committee Report on Delimitation

ఢిల్లీ పెత్తనం… దక్షిణాదిపై ఉక్కుపాదం – జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ ఆవేదన

సహనం వందే, తమిళనాడు: భారతదేశంలో రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ కేవలం జనాభా గణాంకాల ఆధారంగానే సాగితే అది దేశ రాజకీయ సమతుల్యతను దెబ్బతీస్తుందని జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యంగా జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఆ కారణంగా పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధిని సాధించినందుకు రివార్డు ఇవ్వాల్సింది పోయి సీట్లు తగ్గించడం ద్వారా శిక్షించడం ఏమాత్రం…

Read More
Kavitha New Party

కవిత కన్నీటి పోరాటం – సొంత పార్టీ పెట్టేందుకు సన్నాహం

సహనం వందే, హైదరాబాద్: అధికార దాహం ముందు రక్తసంబంధం వెలవెలబోతోంది. వారసుడిని గద్దెనెక్కించే క్రమంలో కన్నకూతుళ్లనే బలిపీఠం ఎక్కిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ గురించి గొప్పలు చెప్పే నేతలు సొంత కూతురి విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఆకాశంలో సగం అని డబ్బాలు కొట్టుకునే నేతలు వాస్తవానికి వచ్చేసరికి సొంత కూతుళ్లనే తొక్కుతున్నారు. రాజకీయ చదరంగంలో ఆడబిడ్డలు బలిపశువులవుతున్నారు. వారసుల కోసం కన్నబిడ్డలను కాదనుకుంటున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీ పెట్టేందుకు…

Read More
Gold in India

‘బంగారు’ కొండపై భారత్ – బీరువాల్లో నిద్రపోతున్న లక్షల కోట్ల సంపద

సహనం వందే, హైదరాబాద్: భారతీయ ఇళ్లల్లో బంగారం పరవళ్లు తొక్కుతోంది. మన బీరువాల్లో ఏకంగా 420 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం పోగుపడి ఉందని అసోచామ్ నివేదిక వెల్లడించింది. ఈ అపార సంపద అమెరికా, చైనా మినహా ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దది కావడం గమనార్హం. ప్రపంచ సెంట్రల్ బ్యాంకులకు సవాల్మన ఇళ్లలో ఉన్న ఈ 420 లక్షల కోట్ల రూపాయల బంగారం… ప్రపంచంలోని టాప్ 10 దేశాల సెంట్రల్ బ్యాంకుల…

Read More
Vaibhav

కాలం కంటే ముందే ఎదిగిన కుర్రాడు – యువ క్రికెటర్ వైభవ్ ‘సిక్సర్’ కథ

సహనం వందే, హైదరాబాద్: జీవితం కొన్నిసార్లు మనం ఊహించిన దానికంటే వేగంగా పరిగెడుతుంది. కొందరు నడక నేర్చుకునే వయసులో పరిగెత్తడం ప్రారంభిస్తారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సరిగ్గా అదే చేస్తున్నాడు. చేతిలో బ్యాట్ పట్టుకుని మైదానంలో నిలబడితే అతని కళ్లలో కనిపించేది విజయం కాదు… ఒక తరం కల. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అత్యంత పిన్న వయసు రికార్డును చెరిపివేసే దిశగా ఈ చిన్నారి అడుగులు పడుతున్నాయి. ప్రతిభకు పట్టాభిషేకంఅజిత్ అగార్కర్ నేతృత్వంలోని…

Read More
Delimitation effects Southern States

ద’క్షీణ’ భారతం – దక్షిణాది సీట్ల అవసరం లేకుండానే ఢిల్లీ‌ పీఠం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో దక్షిణాది రాష్ట్రాల రాత మాత్రం మారడం లేదు. మనం రెక్కలు ముక్కలు చేసుకుని దేశానికి అన్నం పెడుతుంటే… ఎవరో వచ్చి ఆ పళ్లెం లాక్కుని వెళ్లే కుట్ర ఇది. అభివృద్ధికి మనం నిచ్చెనలవుతుంటే… ఆ నిచ్చెన మెట్లు ఎక్కి పీఠం ఎక్కేది మాత్రం ఉత్తరాది నేతలే. ఇది కేవలం సీట్ల పెంపు కాదు… దక్షిణాది ఆత్మగౌరవంపై జరుగుతున్న సర్జికల్ స్ట్రైక్. ప్రజాస్వామ్యం అంటే కేవలం తలల లెక్కింపేనా? తెలివితేటలకు, కష్టానికి విలువ…

Read More
Arvind Kejriwal Comments on Delhi High Court Judge

జడ్జిపై కేజ్రీ’ఫైర్’ – ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ సంచలన వాదన

సహనం వందే, ఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధాని న్యాయస్థానంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. తనపై ఉన్న కేసును కేవలం రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తూనే ఏకంగా న్యాయమూర్తి నిష్పాక్షికతను సవాల్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న సంస్థల కార్యక్రమాలకు న్యాయమూర్తి హాజరయ్యారని ఆరోపిస్తూ ఆయన నేరుగా కోర్టులోనే ధ్వజమెత్తడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తిపై కేజ్రీవాల్ అటాక్లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేజ్రీవాల్ సంచలన…

Read More
Luxury Houses

సామాన్యులు గృహ ‘హీనులు’ – కుబేరులే లక్ష్యంగా ఖరీదైన ఇళ్ళ నిర్మాణాలు

సహనం వందే, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు కేవలం ధనికులను లక్ష్యంగా చేసుకుని విలాసవంతమైన భవనాలనే నిర్మిస్తోంది. సామాన్యులకు అవసరమైన తక్కువ ధర ఇళ్ల నిర్మాణంపై ఏ ఒక్కరూ దృష్టి పెట్టడం లేదు. లాభాల వేటలో పడి పేద ప్రజల కనీస అవసరాలను పాలకులు, బిల్డర్లు పూర్తిగా విస్మరిస్తున్నారు. దీనివల్ల నగరాల్లో మురికివాడలు పెరిగిపోతున్నాయి. ఆదాయ అసమానతలు పెరగడానికి ఈ గృహ సంక్షోభమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీలలో దారుణ పరిస్థితులుభారతదేశ రాజధాని…

Read More
Thorium at Southern States

దక్షిణాది సూర్యుడితో వెయ్యేళ్ల వెలుగు – తమిళనాడు, కేరళలో థోరియం నిల్వలు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశ భవిష్యత్ వెలుగులకు దక్షిణ భారత తీరాలే అసలైన వేదిక కానున్నాయి. మనం ఎప్పుడూ విదేశీ యురేనియం కోసం ఆరాటపడతాం కానీ మన కాళ్ళ కింద ఉన్న మట్టిలోనే మహా నిధి దాగి ఉంది. కేరళ, తమిళనాడు తీరాల్లో అలలు తాకి వెళ్లే ఆ ఇసుక రేణువులే రేపటి భారత అగ్రరాజ్య స్వప్నానికి ప్రాణం పోయనున్నాయి. అగ్రరాజ్యాల ఆంక్షలను ధిక్కరిస్తూ మన శాస్త్రవేత్తలు గీసిన మూడు అంచెల వ్యూహం ఇప్పుడు ప్రపంచాన్ని దద్దరిల్లేలా…

Read More
Parliament MPs

కోటీశ్వరుల క్లబ్‌గా పార్లమెంటు – ఎంపీలలో 93 శాతం మంది కుబేరులే

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇప్పుడు ఒక ఖరీదైన వేలం పాటగా మారిపోయింది. సామాన్యుడి ఓటు హక్కు కంటే సంపన్నుడి నోట్ల కట్టకే విలువ పెరిగింది. ఎన్నికలు అంటే సిద్ధాంతాల యుద్ధం కాస్తా అంకెల గారడీగా మారిపోయింది. వేల కోట్లు కుమ్మరిస్తే తప్ప గెలవలేమన్న నగ్నసత్యం సామాన్యుడిని రాజకీయాలకు దూరం చేస్తోంది. అదృశ్య శక్తుల పెట్టుబడులు మన ఓటు విలువను తగ్గించేస్తున్నాయి. ఇది పండుగ కాదు… ప్రజాస్వామ్య పతనం. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను చూస్తుంటే…

Read More