
డాక్టర్లకు సీబీఐ బేడీలు – మెడికల్ కాలేజీల అనైతిక చర్య
సహనం వందే, హైదరాబాద్:ఛత్తీస్గఢ్లోని ఓ వైద్య కళాశాలకు గుర్తింపు ఇచ్చేందుకు ఏకంగా రూ. 55 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ ముగ్గురు వైద్యులతో సహా ఆరుగురిని అరెస్టు చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల గుర్తింపు ప్రక్రియలో పేరుకుపోయిన అవినీతిని మరోసారి బట్టబయలు చేసింది. సీబీఐ అధికారులు ఈ కేసులో కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్లలో 40 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఛత్తీస్గఢ్లోని నవ రాయ్పూర్ ప్రాంతంలో ఉన్న శ్రీ…