వైద్యం చేయండి… బిల్లు అడగకండి – డబ్బులు కట్టలేదని చికిత్స నిలిపివేయొద్దు
సహనం వందే, న్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రుల బిల్లుల దందాపై రాజ్యసభలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ నిప్పులు చెరిగారు. పేదవాడి ప్రాణం కంటే పైసలే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్న యాజమాన్యాల తీరును ఎండగట్టారు. అత్యవసర సమయంలో డబ్బుల కోసం రోగిని వేధించకుండా… ముందస్తు చికిత్స అందించేలా కఠిన చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందంటూ గళమెత్తారు. రోగి అంటే ఆదాయం కాదుఆసుపత్రులు రోగులను కేవలం డబ్బులు ఇచ్చే మిషన్లుగా…