
విశాఖలో ‘కరాచీ’ చిచ్చు!
సహనం వందే, విశాఖపట్నం: విశాఖపట్నంలో కరాచీ అనే పేరు ఇప్పుడు అగ్గి రాజేస్తోంది. వెంకోజీపాలెం డైమండ్ పార్క్ రోడ్డులో కొన్నేళ్లుగా కొనసాగుతున్న కరాచీ బేకరీ పేరును మార్చాలంటూ స్థానిక జనజాగృతి సమితి సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో… శత్రుదేశ నగరమైన కరాచీ పేరుతో ఇక్కడ వ్యాపారం చేయడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. ఈ పేరును వెంటనే మార్చాలని, లేదంటే బేకరీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ వారు…