‘సంస్కృతం చచ్చిపోయిన భాష’ – తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అటాక్
సహనం వందే, తమిళనాడు:తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళ భాషను పక్కన పెట్టి సంస్కృతానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, సంస్కృతం చచ్చిపోయిన భాష (డెడ్ లాంగ్వేజ్) అంటూ వ్యాఖ్యానించి, సంచలనం సృష్టించారు. ‘మీరు తమిళ భాషను ప్రేమిస్తున్నట్లు నటిస్తారు. కానీ మా విద్యార్థులు తమిళం చదవకుండా ఉండటానికి హిందీని, సంస్కృతాన్ని రుద్దుతారు. ఇది ఎంతవరకు న్యాయం?’…