సోలార్ బిల్… ఐఏఎస్ ఫైర్ – చార్జీల పెంపుపై మాజీ సీఎండీ ఫిర్యాదు
సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో సోలార్ వినియోగదారుల బిల్లులు ఒక్కసారిగా రెట్టింపు కావడంతో తీవ్ర కలకలం రేగుతోంది. డిస్కం అధికారులు ఎటువంటి నోటీసు లేకుండా రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలను పక్కనబెట్టి నెట్ మీటరింగ్ స్థానంలో గ్రాస్ మీటరింగ్ను అమలు చేయడమే దీనికి కారణం. గ్రిడ్కు ఇచ్చిన కరెంటుకు తక్కువ ధర చెల్లిస్తూ తీసుకున్న కరెంటుకు మాత్రం అధిక రిటైల్ ధర వసూలు చేస్తున్నారు. ఇది ప్రజలను మోసం చేయడమేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో సీఎండీ, తెలంగాణ రిటైర్డ్ సీనియర్…