
‘ముంబై మరాఠీల అడ్డా’
సహనం వందే, ముంబై: ‘ముంబై మరాఠీల అడ్డా. ఇక్కడ ఉంటూ మమ్మల్ని అవమానిస్తే సహించం’ అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించింది. ముంబైలో మరాఠీలపై గుజరాతీల ఆగడాలపై మండిపడింది. మహారాష్ట్రలో మరోసారి ప్రాంతీయ వివాదం తలెత్తింది. ఘాట్కోపర్లోని శ్రీ సంభవ్ దర్శన్ సొసైటీలో మాంసాహారం తినే మరాఠీ కుటుంబాలను శుక్రవారం గుజరాతీలు దూషించడం తీవ్ర వివాదానికి దారితీసింది. మరాఠీలను అవమానించడంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) గుజరాతీలకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ ఘటన రాజకీయ…