క్యాష్ క్రాష్… లిక్కర్ క్రైసిస్ – రూ. 2,988 కోట్ల బకాయిల పెండింగు
సహనం వందే, హైదరాబాద్:అంతర్జాతీయ మద్యం దిగ్గజాలు తెలంగాణ సర్కారుకు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. బకాయిలు చెల్లించకపోతే లిక్కర్ సరఫరా నిలిపివేస్తామని తెగేసి చెప్పాయి. హైనెకెన్, డియాజియో, పెర్నోడ్ రికార్డ్ వంటి బడా కంపెనీలు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ కు లేఖ రాశాయి. ఏకంగా రూ. 2,988 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో ఇక తాము భరించలేమని స్పష్టం చేశాయి. సకాలంలో డబ్బులు చెల్లించకపోతే లాకర్లు మూసేస్తామని అల్టిమేటం ఇచ్చాయి. అదే జరిగితే ఖజానాకు గండి…సరుకు సరఫరా నిలిచిపోతే…