సమాధుల నుండి సందేశాలు – మనిషి, ఆత్మల అనుసంధానం
సహనం వందే, హైదరాబాద్: ఏఐ యుగంలో మరణం ఇక అంతిమ సత్యం కాదు. మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ మనిషి భౌతిక ఉనికి ముగిసినా… వారి డిజిటల్ ఉనికిని శాశ్వతం చేసే వింతైన సాంకేతికతను సిద్ధం చేస్తోంది. ఏఐ సాయంతో వారి జ్ఞాపకాలను… వారి సంభాషణలను ఒక వ్యాపార వస్తువుగా మార్చే ఈ ప్రయత్నం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నైతిక, మానవ హక్కుల చర్చను రేకెత్తిస్తోంది. ఫేస్బుక్ ఖాతా కంటిన్యూ…మనిషి హృదయ స్పందన ఆగిపోయినా ఫేస్బుక్ ఖాతా…