యాపిల్ ‘ఎయిర్’… క్వాలిటీ ఫెయిల్ – అందమైన ఐఫోన్… కొన్నారో పరేషాన్

సహనం వందే, హైదరాబాద్:యాపిల్ సంస్థ ప్రతీ ఏటా కొత్త ఐఫోన్లను విడుదల చేస్తూ ఉంటుంది. అంతకుముందు వెర్షన్లలో కొన్ని మార్పులు, కెమెరా అప్డేట్స్ వంటి వాటితోనే చాలావరకు సరిపెడుతుంది. కానీ ఈసారి అలా కాకుండా అత్యంత సన్నని డిజైన్‌తో కూడిన ఐఫోన్ ఎయిర్ మోడల్‌ను తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం 5.6 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంది. ఇంత సన్నగా ఉండడం వల్లే ఎయిర్ మోడల్ గురించి చాలామంది ఆసక్తిగా అడుగుతున్నారు. మెరిసే టైటానియం ఫ్రేమ్,…

Read More

జెన్ జెడ్ గుండెల్లో జ్వాల – అవినీతి, అక్రమాలపై ఈ చిహ్నం బ్రహ్మాస్త్రం

సహనం వందే, న్యూఢిల్లీ:ఆసియా యువతరం తమ గొంతుకను వినిపించడానికి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అది ఏ ఆయుధం కాదు, ఒక ప్రత్యేకమైన జెండా కాదు, కేవలం ఒక గుర్తు. ఇది వన్ పీస్ అనే జపాన్ మాంగాలో లూఫీ అనే కథానాయకుడి ట్రేడ్‌మార్క్ అయిన గడ్డితో అల్లిన టోపీ గుర్తు. ఇండోనేషియా, నేపాల్‌తో మొదలైన ఈ విప్లవం ఇప్పుడు ఆసియా మొత్తం విస్తరించింది. అవినీతి, ప్రభుత్వ దమనకాండ, నిరంకుశత్వం, సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా ఇది ఒక శక్తిమంతమైన…

Read More

తాత్కాలిక బదిలీల తిరకాసు – ఉద్యోగుల బదిలీలకు కఠిన నిబంధనలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్లపై జారీ చేసిన మార్గదర్శకాలపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కన్నా నిరాశనే మిగుల్చుతోంది. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పలు అంశాలు ఉద్యోగుల ఆశలకు అడ్డుకట్ట వేసినట్లు స్పష్టమవుతోంది. కఠినమైన అర్హతా నిబంధనలు, పరిమిత కాలపరిమితి, ఆర్థిక ప్రయోజనాల లేమి వంటివి ఉద్యోగుల మధ్య అసంతృప్తిని పెంచుతున్నాయి. అర్హత కన్నా అనర్హతలే ఎక్కువ…ప్రభుత్వం తాత్కాలిక బదిలీల కోసం…

Read More

హుస్సేన్‌సాగర్ నీటిపై క్రికెట్ స్టేడియం

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి మరిన్ని కొత్త హంగులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. హుస్సేన్‌సాగర్‌ నీటిపై ఫ్లోటింగ్ గ్రౌండ్స్ (తేలియాడే మైదానాలు) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీంతో పర్యాటక రంగం మరింత పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ వాసులు నీటిపైనే ఫుట్‌బాల్, బాక్స్ క్రికెట్ వంటి క్రీడలు ఆడుకునే అరుదైన అవకాశం దక్కుతుంది. ఇప్పటివరకు ఇలాంటివి సింగపూర్ వంటి విదేశాల్లోనే…

Read More

భారత మగాళ్లకు అమెరికాలో డిమాండ్ – ఇండియన్ భర్త కోసం ఒక మహిళ ప్రయత్నం

సహనం వందే, అమెరికా:న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ ప్రపంచానికి కేంద్ర బిందువు లాంటిది. అక్కడ విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన ప్రజలు కనిపిస్తుంటారు. అలాంటి చోట ఒక అమెరికన్ మహిళ ‘భారతీయ భర్త కావాలి’ అని రాసి ఉన్న ప్లకార్డుతో నిలబడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆధునిక కాలంలో డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ప్రేమ వ్యవహారాలకు వేదికగా మారుతున్నప్పుడు… ఆ మహిళ పాత పద్ధతిని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించింది….

Read More

బ్లడ్ మ్యాచ్‌ – దేశం బాధలో ఉంటే పాక్ తో క్రికెట్ ఆటలేంటి?

సహనం వందే, హైదరాబాద్:ఏప్రిల్ రెండో తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అమాయకులైన 26 మంది భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దేశం ఇంకా ఆ దుర్ఘటన షాక్‌లోంచి తేరుకోకముందే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు, ఉగ్రదాడి బాధితుల కుటుంబాలు ఈ నిర్ణయంపై మండిపడుతున్నాయి. దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని నినదిస్తుంటే క్రికెట్ మైదానాల్లో పాకిస్తాన్‌తో చేతులు…

Read More

విజయనగరం వీరుడు… పార్లమెంట్ టాపర్

సహనం వందే, న్యూఢిల్లీ:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంటులో టాపర్ గా నిలిచారు. ప్రశ్నలు, హాజరు విభాగాల్లో ఎంపీలందరితో పోలిస్తే మొదటి స్థానం సాధించారు. మొత్తం పని తీరులో నాలుగో స్థానం వచ్చింది. 99 శాతం హాజరు, 115 ప్రశ్నలతో ముందుండటం అతని అంకితభావాన్ని తెలియజేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీలలో అత్యుత్తములలో ఒకరిగా నిలవడం తెలుగుదేశం పార్టీకి గొప్ప గుర్తింపు. లోక్‌సభ సభ్యుల పనితీరు నివేదికను పార్లమెంట్ విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025…

Read More

జెన్ జెడ్ వెనుక ‘డీజే’ సౌండ్ – నేపాల్ ను కుదిపేసిన నేత సుదాన్ గురుంగ్

సహనం వందే, నేపాల్:నేపాల్‌లో అవినీతి, కుటుంబ రాజకీయాలు… అలాగే సోషల్ మీడియా నిషేధంపై జెన్ జెడ్ యువతలో రేగిన ఆగ్రహం ఇప్పుడు రాజకీయ విప్లవంగా మారింది. ఈ పోరాటంలో ప్రభుత్వాన్ని గడగడలాడించిన యువ కెరటం 36 ఏళ్ల సుదాన్ గురుంగ్. ‘హమి నేపాల్’ అనే సంస్థకు అధ్యక్షుడైన గురుంగ్… ఈ నిరసనలకు ఊపిరి పోశాడు. వాటిని దేశవ్యాప్తంగా వ్యాపింపజేశాడు. ‘కొత్త తరం ముందుకు వచ్చి, పాత విధానాలను సవాల్ చేయాల’ని గురుంగ్ చెప్పిన మాటలు లక్షలాది మంది…

Read More

లోకల్ ఫుడ్సే… సూపర్‌ఫుడ్స్ – స్థానిక పండ్లు… కూరగాయలే ఆరోగ్యానికి రక్ష

సహనం వందే, హైదరాబాద్:ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మెరుస్తున్న అకై బౌల్స్… కెఫెల్లో కనిపించే స్పిరులినా స్మూతీలు… వీటిని చూసి సూపర్‌ఫుడ్స్ అనే పదానికి అలవాటు పడిపోయాం. ఈ ఆహారాలు బరువు తగ్గించడంతో పాటు చర్మాన్ని మెరుగుపరుస్తాయని… శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయని… క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నిరోధిస్తాయని ప్రచారం జరుగుతోంది. కానీ వైద్యులు మాత్రం ఇవి మ్యాజిక్ చేసే మందులు కాదని… బ్యాలెన్స్‌డ్‌గా స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు తినడమే నిజమైన ఆరోగ్య రహస్యం అని…

Read More

జనం నెత్తిన వారసత్వం – కుటుంబాల గుప్పిట్లో ప్రజాస్వామ్యం

సహనం వందే, న్యూఢిల్లీ:భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు కొన్ని కుటుంబాల గుప్పెట్లో బందీగా మారిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే ఎన్నికల హక్కుల సంస్థ జరిపిన తాజా అధ్యయనం నిరూపించింది. దేశంలోని మొత్తం 5,204 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ఐదో వంతు మంది రాజకీయ కుటుంబాల నుంచి వారసులుగా వచ్చిన వారేనని ఆ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. లోక్‌సభలో ఏకంగా 31 శాతం మంది సభ్యులు, రాజ్యసభలో 19 శాతం మంది వారసత్వ…

Read More