హైదరాబాద్‌లో బర్డ్‌ఫ్లూ పంజా

   వేల కోళ్లు మృతి… ప్రజల్లో భయాందోళనలు – నర్సరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతితో అప్రమత్తం సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందడంతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక పౌల్ట్రీ ఫార్మ్‌లో వేల కోళ్లు చనిపోవడంతో ల్యాబ్ పరీక్షలు నిర్వహించగా, బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టి, కోడిగుడ్లు, చికెన్ విక్రయాలను నిషేధించారు. ఈ విషయం తెలియడంతో పౌల్ట్రీ యజమానులు ఆందోళనలో ఉండగా,…

Read More

ఏడు లక్షలు దాటిన యువ వికాసం దరఖాస్తులు

బీసీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లయ్యబట్టు సహనం వందే, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్ల పరిధిలో 7 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లయ్యబట్టు తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించాలనుకున్న యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 14వ తేదీ వరకు…

Read More

ముంచెత్తిన వాన…!

   అకాల వర్షం… నగరం జలమయం…! – రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు – గ్రేటర్‌ పరిధిలో కుండపోత వాన… చెరువులను తలపించిన రోడ్లు సహనం అంతే, హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలోని చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావతమై క్రమంగా జల్లులతో మెదలైన వాన… ఆ తర్వాత తీవ్రత పెంచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతమే నమోదైంది. మధ్యాహ్నం తర్వాత…

Read More

నేను యోగిని… పొలిటిషియన్ కాదు

– యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలనం సహనం వందే, లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ విరమణపై ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు. “నేను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కాదు. నేను ఒక యోగిని” అని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీలో ఆయన భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారనే ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, యోగి ఈ వ్యాఖ్యలు…

Read More

ఎల్2-ఎంపురాన్ లో గుజరాత్ అల్లర్లు కట్

– ఈరోజు నుంచి కొత్త వెర్షన్ సహనం వందే, సినిమా బ్యూరో: థియేటర్లలో మలయాళ సినిమా చరిత్రలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఎల్2: ఎంపురాన్ తెలుగు వెర్షన్‌లో 24 కత్తిరింపులు చేసినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత నెల 27న విడుదలైంది. ఈ సినిమాలోని కొన్ని వివాదాస్పద సన్నివేశాలపై విమర్శలు రావడంతో మార్పులతో కూడిన కొత్త వెర్షన్‌ను ఈరోజు నుంచి…

Read More

సెంట్రల్ వర్సిటీ భూమి రణరంగం

   ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు – అది ప్రభుత్వ భూమి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్ఠీకరణ సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం విద్యార్థుల ఆగ్రహానికి దారితీసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టగా, పోలీసులు వారిని అక్రమంగా అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ భూమిని ఐటీ పార్కులు, ఇతర…

Read More

ఢిల్లీ బీసీ గర్జనకు రాహుల్ గాంధీ

   రేపు ఢిల్లీలో బీసీల మహాధర్నా – 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యం – తెలంగాణ నుంచి చారిత్రక పోరాటం సహనం వందే, హైదరాబాద్: ఢిల్లీలో మంగళవారం నిర్వహించే బీసీల మహాగర్జనకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మహా ధర్నాకు రాహుల్ గాంధీ హాజరవడం దానికి రాజకీయ ప్రాముఖ్యత పెరిగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర…

Read More

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో మహిళల హవా

– టాపర్లుగా ఇద్దరు మహిళా అభ్యర్థులు సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. మల్టీ జోన్-1, మల్టీ జోన్-2ల్లో టాపర్లుగా మహిళలే నిలవడం విశేషం. మల్టీజోన్-2లో 550 మార్కులతో ఒక మహిళా అభ్యర్థి టాపర్‌గా నిలవగా, మల్టీజోన్-1 లో 532.5 మార్కులతో మరొక మహిళా అభ్యర్థి అగ్రస్థానంలో నిలిచారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆదివారం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్…

Read More

ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అత్యాధునిక ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన వేడుకల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత…

Read More

పేదరికం లేని రాష్ట్రమే నా లక్ష్యం

– ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు ప్రకటన సహనం వందే, విజయవాడ: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి రూ. 3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీని ద్వారా అన్ని సేవలను ప్రజలకు అందించే…

Read More