చైనాతో మెటా రహస్య ఒప్పందాలు

సహనం వందే, వాషింగ్టన్:అమెరికాకు చెందిన ప్రముఖ ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ కు చెందిన మెటా సంస్థ తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటోంది. విజిల్ బ్లోయర్ సారా విన్-విలియమ్స్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. మెటా సంస్థ చైనా ప్రభుత్వంతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని, అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించిందని ఆరోపించారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సారా విన్-విలియమ్స్ తెలిపిన వివరాల ప్రకారం..‌‌. మెటా సంస్థ చైనా ప్రభుత్వంతో ఒక ఒప్పందం…

Read More

వనజీవి రామయ్య కన్నుమూత

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం సహనం వందే, ఖమ్మం:ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య (85) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య, తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేశారు. ఒంటరిగా కోటికి పైగా మొక్కలు…

Read More

యాదాద్రిలో వైద్య డిప్యూటేషన్ల దందా

ఏకంగా 106 మంది సిబ్బందికి డిప్యూటేషన్లు సహనం వందే, హైదరాబాద్:వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్లపై మంత్రి దామోదర రాజనర్సింహ నిషేధం విధించినా, యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం వైద్య మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. మంత్రి ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. తమకు ఎవరూ ఎదురులేదన్న ధోరణితో ఉన్నారు. మంత్రి ఆదేశాలకు విరుద్ధంగా, ఈ కాలంలో ఏకంగా 106 మందిని డిప్యూటేషన్ ద్వారా ఇష్టమైన చోటకు పంపించారు. నర్సింగ్ ఆఫీసర్లు మొదలు సీనియర్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర సిబ్బందికి డిప్యూటేషన్లు…

Read More

ఈవీఎంలు హ్యాక్ అవుతాయి

పేపర్ బ్యాలెట్లే మేలన్న అమెరికా నిఘా చీఫ్ సహనం వందే, వాషింగ్టన్:ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) హ్యాకర్లకు సులువుగా చిక్కుతాయని అమెరికా దేశీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ హెచ్చరించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా కాగితపు బ్యాలెట్లే సురక్షితమైన ఆమె అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక ముఖ్యమైన సమావేశంలో గబ్బార్డ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ మిషన్లలో భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని తమ కార్యాలయం సేకరించిన ఆధారాలను ఆమె సమావేశంలో అందజేశారు.”ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్…

Read More

భువనగిరి వైద్య శాఖలో అసంతృప్తి జ్వాలలు

సహనం వందే, భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయంలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితులపై వైద్య ఉద్యోగులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మహిళా ఉద్యోగులపై జరుగుతున్న వేధింపులు, విపత్కర సమయాల్లో డీఎంహెచ్ఓ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, పరిపాలనాపరమైన అవకతవకలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై జిల్లాలోని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఏకతాటిపైకి వచ్చారు. ఈ మేరకు వారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. తమ ఆవేదనను, డీఎంహెచ్ఓ నిరంకుశ వైఖరిని వివరిస్తూ…

Read More

అమెరికాకు 15 లక్షల ఐఫోన్లు ఎయిర్‌లిఫ్ట్!

సహనం వందే, హైదరాబాద్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త దిగుమతి సుంకాలను తప్పించుకోవడానికి టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఒక తెలివైన ఎత్తుగడ వేసింది. సుమారు 600 టన్నుల యాపిల్ ఐఫోన్లను భారతదేశం నుంచి నేరుగా అమెరికాకు కార్గో విమానాల్లో తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇది దాదాపు 15 లక్షల యాపిల్ ఐఫోన్లని అంచనా. ట్రంప్ సుంకం వల్ల అమెరికాలో యాపిల్ ఐఫోన్ ధరలు పెరిగే పరిస్థితిని నివారించడానికి తోడ్పడుతుంది. అలాగే యాపిల్ ఉత్పత్తిలో భారతదేశం…

Read More

టెర్రరిస్టుగా డాక్టర్

సహనం వందే, న్యూఢిల్లీ:వైద్య వృత్తిని అభ్యసించి ప్రాణాలు కాపాడాల్సిన ఒక డాక్టర్ ఉగ్రవాదిగా మారడం ఎంతటి విషాదమో కదా! 2008 ముంబై ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడైన తహవూర్ హుస్సేన్ రాణా అటువంటి నేపథ్యం కలిగినవాడే. పాకిస్తాన్‌లో వైద్య విద్య అభ్యసించిన ఈ కెనడియన్ పౌరుడు, దాదాపు పదేళ్లపాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో భారత అధికారులు రాణాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 64 ఏళ్ల రాణా…

Read More

కుల వ్యవస్థపై అవిశ్రాంత పోరాటం

నేడు జ్యోతి రావ్ ఫూలే జయంతి (కె.రాములు, ఎండీ, ఆగ్రోస్)భారతదేశ చరిత్రలో కుల వ్యవస్థ ఒక చీకటి అధ్యాయం. ఈ దుర్మార్గమైన వ్యవస్థ సమాజంలో అసమానతలను, అణచివేతను సృష్టించిన కాలంలో దానిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన గొప్ప సంఘ సంస్కర్తలలో జ్యోతి రావ్ ఫూలే అగ్రగణ్యులు. ఆయన చేసిన సామాజిక పోరాటం, మహిళల విద్య కోసం ఆయన చేసిన కృషి నేటికీ మనకు స్ఫూర్తినిస్తుంది. కుల వివక్షతో అణగారిన వర్గాల విముక్తి కోసం, స్త్రీ విద్య యొక్క…

Read More

నా బ్రాండ్ ‘యంగ్ ఇండియా’

సహనం వందే, హైదరాబాద్:‘ప్రతీ ముఖ్యమంత్రికీ ఒక బ్రాండ్‌ ఉంటుంది. రూ. 2కే కిలో బియ్యం ఎన్టీఆర్‌ బ్రాండ్.. ఐటీ అంటే చంద్రబాబు.. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్‌ గుర్తుకు వస్తారు. కొంతమంది ఉద్యమాలే తమ బ్రాండ్‌ అని గొప్పలు చెప్పుకుంటారు.. యంగ్‌ ఇండియా స్కూల్‌ ఈజ్‌ మై బ్రాండ్‌’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. “దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని నేను విశ్వసిస్తున్నా. యంగ్ ఇండియా మా బ్రాండ్‌గా, తరగతి గదులను బలోపేతం చేస్తాం” అన్నారు….

Read More

వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు

సహనం వందే, అమరావతి:మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. మహిళల పట్ల ఇలాంటి తప్పుగా మాట్లాడే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. దీనిలో భాగంగా పార్టీ అధిష్టానం వెంటనే చేబ్రోలు కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ…

Read More