మీడియాపై ట్రంప్ వార్ – యుద్ధ వార్తల వివాదం… అధ్యక్షుడి అసహనం
సహనం వందే, హైదరాబాద్: యుద్ధంపై అమెరికా వార్తా సంస్థలు ఇస్తున్న స్టోరీలపై అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రసార హక్కులే ఆయుధాలుగా మారాయి. వార్తా సంస్థల మెడపై కత్తి వేలాడుతోంది. స్వేచ్ఛాయుత ప్రసారాలకు తెరపడుతుంది. నియంత్రణే లక్ష్యంగా పాలకులు సాగిస్తున్న ఈ క్రీడ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. భయాందోళనల మధ్య జర్నలిజం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వానికి, మీడియాకు మధ్య యుద్ధం మొదలైంది. ప్రసార హక్కుల రద్దుతో పరిస్థితి మరింత విషమించింది….