దక్షిణాది డబ్బుతో ఉత్తరాది దర్పం – సౌత్ ఇండియన్ డబ్బుతో నార్త్ సోకులు
సహనం వందే, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల ఆదాయంతో ఉత్తరాదిని సాదుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గళమెత్తారు. మన రాష్ట్రం నుంచి వెళ్తున్న నిధుల్లో సగం కూడా తిరిగి రాకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు… దక్షిణాది ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం పన్నుల పంపిణీలో అనుసరిస్తున్న అన్యాయమైన సూత్రాలు ఇప్పుడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఈ మేరకు ఆయన హైదరాబాదులో మాట్లాడారు….