Kalisetti celebrates 44years of TDP

సముద్రపు అలలపై కలిశెట్టి అడుగులు – రణస్థలం తీరాన పసుపు జెండా రెపరెపలు

సహనం వందే, రణస్థలం: గాలిలో తేలే పసుపు రంగు కేవలం ఒక పార్టీ గుర్తు మాత్రమే కాదు. అది వేల మంది గుండె చప్పుడు. రణస్థలం సముద్ర తీరాన అలల హోరులో ఆ పసుపు జెండా రెపరెపలాడుతుంటే చరిత్ర మళ్ళీ తలవొంచి నమస్కరించింది. మత్స్యకారుల కష్టాల్లోనూ, పేదల కన్నీళ్లలోనూ తోడున్న ఒక రాజకీయ ప్రస్థానం ఇది. గతాన్ని మరిచిపోని ఒక నాయకుడి ఆరాటం ఈ వేడుకలో కనిపించింది. పసుపు జెండా పండుగవిజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వినూత్నంగా…

Read More
Nikhila

అఖిలాంధ్ర సేవలో ‘నిఖిల’ – ఎంపీ అప్పలనాయుడు కూతురి పేరుతో ట్రస్ట్

సహనం వందే, రణస్థలం: ఎంపీగా తన గెలుపు వెనుక ఐదుగురు మహిళల ప్రేరణ ఉందని కలిశెట్టి అప్పలనాయుడు బహిరంగంగా ప్రకటించారు. తన కుమార్తె నిఖిల పేరు మీద ఆయన నెలకొల్పిన ట్రస్ట్ ఇప్పుడు విజయనగరం పార్లమెంట్ పరిధిలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కేవలం రాజకీయమే కాదు సామాజిక బాధ్యతలో కూడా తాము ముందుంటామని ఆయన నిరూపిస్తున్నారు. నిఖిల పేరిట కొత్త ఆశలువిజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సతీమణి ప్రభ నాయుడు ఆదివారం నిఖిల చారిటబుల్ ట్రస్ట్‌ను…

Read More

‘బాబు’ గోత్రం… కలిశెట్టి మేనల్లుడి కంఠస్థం

సహనం వందే, రణస్థలం:కలిశెట్టి అప్పలనాయుడు… విజయనగరం ఎంపీ. ఆయన స్టైలే వేరు. పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్లడం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి చేదోడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం పట్ల ఆయనకు ఎనలేని ప్రేమ. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా చంద్రబాబుకు ప్రియ శిష్యుడుగా ఉన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ఏ దేవాలయంలో అర్చనలు చేసినప్పటికీ తమ కుటుంబ సభ్యుల గోత్రనామాల కంటే…

Read More

కలిశెట్టి రాక… చిన్నారుల కేక – విజయనగరం ఎంపీ వినూత్న దీపావళి వేడుక

సహనం వందే, రణస్థలం:విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ప్రతి ఏటా ప్రభుత్వ బాలికల వసతి గృహం విద్యార్థినులతో దీపావళి సంబరాలు జరుపుకోవడం ఒక సంప్రదాయంగా మారింది. ఆయన స్వతహాగా పిల్లలతో గడపడానికి, వారి నిష్కల్మషమైన ఆనందాన్ని చూసి మురిసిపోవడానికి ఎంతో ఇష్టపడతారు. వారికి కావాల్సినవన్నీ చేసిపెట్టడం, అడగకముందే అవసరాలను తీర్చడం ఆయన సహజ శైలి. ఈ మానవీయ కోణం ఆయన రాజకీయ జీవితంలో ఒక ప్రత్యేకతను చాటుతోంది. సొంత బిడ్డతో వచ్చి తీపి పంచిన ఎంపీసోమవారం…

Read More

గురువుల పాఠమే ‘విజయ’ పీఠం – మాస్టార్లకు ఎంపీ అప్పలనాయుడు సన్మానం

సహనం వందే, రణస్థలం:విజయనగరం ఎంపీగా ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ అప్పలనాయుడు తన గురువులను ఏమాత్రం మర్చిపోలేదు. రోజువారీ బిజీగా ఉన్నప్పటికీ తనకు విద్యాబుద్ధులు నేర్పిన మాస్టార్లను గౌరవించడం మానలేదు.‌ గురువులు నేర్పిన పాఠమే తను ‘విజయ’నగరం ఎంపీ స్థాయికి ఎదగడానికి తోడ్పడిందని ఆయన సగర్వంగా ప్రకటించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురు పూజోత్సవం రోజున శుక్రవారం తనకు తొలి అక్షరాలు దిద్దిన గురువులను మర్చిపోని నిరాడంబరతను ప్రదర్శించారు. రణస్థలం మండలంలో ఉన్న తన ఆది గురువులు మేడూరి…

Read More