
జొన్న ‘అవినీతి’ కేంద్రాలు
సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో అనేక జొన్న కొనుగోలు కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారాయి. పక్క రాష్ట్రాల నుంచి అడ్డదారిలో జొన్నలు తెచ్చి, మద్దతు ధర పేరుతో దళారులు లక్షల రూపాయలు కొల్లగొడుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా తాంసిలో ముక్కిపోయిన అక్రమ జొన్నలు పట్టుబడటం సంచలనం రేపింది. ఈ ఘటన వెనుక అధికారుల హస్తం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసలు ఈ జొన్నలు ఎవరివో, ఎక్కడి నుంచి తెచ్చారో తేల్చకుండా అధికారులు దాస్తున్నారు….