ఆరిపోయిన ‘ఎర్ర ‘దీపం – కేరళతో ముగిసిన చారిత్రక శకం
సహనం వందే, హైదరాబాద్: భారత రాజకీయ యవనికపై ఒక అజేయ శకం ముగిసింది. దశాబ్దాల పాటు ఎర్రజెండా రెపరెపలాడిన కేరళ గడ్డపై కమ్యూనిజం కుప్పకూలిపోయింది. సిద్ధాంత వైరాగ్యం, పాలనా వ్యతిరేకత వెరసి లెఫ్ట్ పార్టీలను అధికారం లేని అనాథలుగా మార్చాయి. 2026 ఎన్నికల ఫలితాలు భారత కమ్యూనిస్టు చరిత్రలో ఒక రాజకీయ శవ పంచనామాగా మిగిలిపోయాయి. కేరళ కంచుకోట బద్ధలుభారతదేశంలో కమ్యూనిస్టులకు చివరి అండగా ఉన్న కేరళ రాష్ట్రం ఇప్పుడు వారి చేయి దాటిపోయింది. 1977 తర్వాత…