బెంగళూరు ఐఐఎం ప్లేస్మెంట్స్ కుంభకోణం – పీజీ స్టూడెంట్స్ ప్లేస్మెంట్ కమిటీ నిర్వాకం
సహనం వందే, బెంగళూరు: దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటైన బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. 20 మంది సభ్యులున్న విద్యార్థి ప్లేస్మెంట్ కమిటీ మొత్తం ఒక్కసారిగా రాజీనామా చేయడంతో 2026 నాటి నియామక ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నెల 10న ఈ సామూహిక రాజీనామా జరిగింది. అసలు ఈ రాజీనామాలకు కారణం ఏమిటంటే… నియామక ప్రక్రియలో ఓ ముఖ్యమైన నిబంధనను కమిటీ సభ్యులకు అనుకూలంగా ఉండేలా…